Kyrgyzstan: విషాదం.. జలపాతంలో పడి ఏపీ మెడికల్ విద్యార్థి మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కిర్గిస్థాన్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. జలపాతంలో పడి ఆంధ్రాకు చెందిన ఎంబీబీఎస్ విద్యార్థి దాసరి చందు (21) మృతి చెందాడు. కుమారుడి మరణవార్త తెలిసి తల్లిదండ్రులు విషాదంలో మునిగిపోయారు. కుటుంబంలో.. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మరోవైపు తమ కుమారుడి మృతదేహాన్ని స్వగ్రామానికి వచ్చేలా సహాయం చేయాలని కేంద్ర మంత్రి కిషన్రెడ్డిని బాధిత కుటుంబ సభ్యులు కోరారు.
ఇది కూడా చదవండి: Neha Murder Case: నేహ తండ్రికి క్షమాపణ చెప్పిన సీఎం సిద్ధరామయ్య..
Also Read
- ‘RRకు ఏమైనా బుద్ధి ఉందా..? గెలిచే మ్యాచ్ను చేతులారా జీటీకి ఇచ్చేశారు.. వారిద్దరి వల్లనే మ్యాచ్ పోయింది’
- Wife Harassment: భార్య వేధిస్తుంది, మరణించే అనుమతి ఇవ్వండి..
- Drushyam 4: దృశ్యం తరహాలో పాల వ్యాపారి స్కెచ్.. చివరికిలా దొరికిపోయాడు
- Shubman Gill Vs Vaibhav: వైభవ్ సూర్యవంశీ నరకం చూపిస్తాడు.. సంచలన వ్యాఖ్యలు చేసిన శుభ్మన్ గిల్..
ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లికి చెందిన దాసరి చందు కిర్గిస్థాన్లో ఎంబీబీఎస్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ఏపీకి చెందిన మరో నలుగురు విద్యార్థులతో కలిసి ఆదివారం ఆయన జలపాతాన్ని సందర్శించేందుకు వెళ్లాడు. జలపాతాన్ని సందర్శిస్తుండగా గడ్డకట్టిన మంచులో చిక్కుకుని చందు ప్రాణాలు కోల్పోయాడు. చందు మరణవార్త సోమవారం తల్లిదండ్రులకు తెలిసింది. చేతికి అందివచ్చిన కుమారుడు ప్రాణాలు కోల్పోవడంతో కన్నీరుమున్నీరుగా విలపించారు.
ఇది కూడా చదవండి: Pawan Kalyan : పిఠాపురం జనసేన అభ్యర్థిగా నామినేషన్ వేసిన పవన్ కల్యాణ్
తమ కుమారుడి మృతదేహాన్ని ఇంటికి తీసుకురావడానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని సంప్రదించినట్లు చందు తల్లిదండ్రులు తెలిపారు. కేంద్ర మంత్రి కిర్గిస్థాన్ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారని, మృతదేహాన్ని అనకాపల్లికి తరలించేందుకు ఏర్పాట్లు చేసినట్లు వారు వెల్లడించారు. యూనివర్సిటీలో పరీక్షలు ముగిశాక.. సమీపంలోని జలపాతం దగ్గరకు యాజమాన్యం తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. సెల్ఫీ దిగుతుండగా ఈ ప్రమాదం జరిగినట్లుగా సమాచారం. అనకాపల్లి ఎంపీ సత్యవతి చొరవతో చందు డెడ్బాడీ తెచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
తాజావార్తలు
-
Saunf Sharbat : సోంపు-బెల్లం షర్బత్ తాగితే మండుటెండలో కూడా చల్లగా ఉండచ్చు.! ఎలా చేసుకోవాలో తెలుసా ?
-
Banking Rules : జూన్ 1 నుంచి కొత్త బ్యాంకింగ్ రూల్స్ వస్తున్నాయా? వైరల్ అవుతున్న వార్తల్లో నిజం ఎంత?
-
‘RRకు ఏమైనా బుద్ధి ఉందా..? గెలిచే మ్యాచ్ను చేతులారా జీటీకి ఇచ్చేశారు.. వారిద్దరి వల్లనే మ్యాచ్ పోయింది’
-
IPL Final 2026: ఐపీఎల్ ఫైనల్ ఎఫెక్ట్.. అహ్మదాబాద్లో విమాన టికెట్లు, హోటల్ ధరలకు రెక్కలు.. గది అద్దె రూ.36 వేలు!
-
Suicide Murders: చేజేతులా కాపురాన్ని కూల్చేసుకున్నారు.. రెండు జిల్లాల్లో ఒకే తరహా విషాదం!
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..