PM Modi: ‘‘ అంబేద్కర్ తిరిగి వచ్చినా..’’ రాజ్యాంగంపై ప్రతిపక్షాల ఆరోపణలపై మోడీ ఫైర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: బీజేపీ మూడోసారి అధికారంలోకి వస్తే రాజ్యాంగం, ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుందని ప్రతిపక్ష ఇండియా కూటమి పార్టీలు ఆరోపిస్తున్న నేపథ్యంలో, వీటిపై ప్రధాని నరేంద్రమోడీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రోజు మహారాష్ట్ర నాగ్పూర్లో జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో ఆయన మాట్లాడుతూ.. జమ్మూకాశ్మీర్కి ప్రత్యేక హోదా రద్దు చేసినందుకు బీఆర్ అంబేద్కర్ తనను తప్పక ఆశీర్వదిస్తారని ప్రధాని మోడీ అన్నారు. ‘‘రాజ్యాంగంలో చాలా ముఖ్యమైనది అయితే, ఆర్టికల్ 370 రద్దు చేసేంత వరకు దేశం మొత్తం ఒకే రాజ్యాంగం ఎందుకు అమలులోకి రాలేదు..? వేర్పాటువాదుల పట్ల మెతక వైఖరితో ప్రతిపక్షాలు ఇలా చేశాయి’’ అని ప్రధాని అన్నారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత అంబేద్కర్ ఆత్మ మోడీని ఆశీర్వదిస్తుందని చెప్పారు.
Read Also: Middle East tensions: ఇజ్రాయిల్, ఇరాన్ వెళ్లొద్దని భారతీయులకు కేంద్రం కీలక ఆదేశాలు..
Also Read
- Ketan Agarwal Case: కేతన్ హత్యకు ముందు, తర్వాత చాట్స్ డిలీట్.. సియా-చేతన్ ఫోన్లలో కీలక ఆధారాలు
- Ketan Agarwal Case: మద్యం మత్తులో సియా గోయల్.. వీడియో వైరల్
- Congress: కాంగ్రెస్లో భారీ ప్రక్షాళన.. యూపీతో సహా కీలక రాష్ట్రాల ఇన్ఛార్జ్ల మార్పు! కారణం ఇదేనా
- Monsoon: శాటిలైట్ చిత్రాల్లో షాకింగ్ దృశ్యాలు.. దేశంలో కనిపించని వర్ష మేఘాలు
బీజేపీ ప్రభుత్వానికి దేశ రాజ్యాంగమే సర్వస్వమని, బాబాసాహెబ్ అంబేద్కర్ స్వయంగా వ్చినా రాజ్యాంగాన్ని రద్దు చేయలేరని ప్రధాని చెప్పారు. కాంగ్రెస్ ఎమర్జెన్సీని విధించడం ద్వారా రాజ్యాంగాన్ని నాశనం చేయాలని ప్రయత్నించిందని ఆరోపించారు. తాము మళ్లీ గెలిస్తే రాజ్యాంగాన్ని మారుస్తాయని ప్రతిపక్షాలు మోసం చేస్తున్నాయని ఆరోపించారు. ఎమర్జె్న్సీ సమయంలో ప్రజాస్వామ్యానికి ముప్పు వాటిల్లలేదా..? అని కాంగ్రెస్ని ప్రశ్నించారు.
ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు జరిగే 7 దశల లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మొదటి దశలో ఎన్నికలు జరిగే మహారాష్ట్రలో పర్యటిస్తున్నారు. జూన్ 4న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. జమ్మూకాశ్మీర్లో దళితులు, గిరిజనులకు ప్రస్తుతం రాజ్యాంగ హక్కులు లభించాయని, కాంగ్రెస్ హయాంలో ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం వారిని విస్మరించారని ప్రధాని మోడీ అన్నారు.
తాజావార్తలు
-
Ireland: ఐర్లాండ్ చేతిలో ఓడిన 8వ దేశంగా భారత్.. ఇక మిగిలింది ఆ మూడే..
-
Off The Record: కందుకూరు టీడీపీలో సిట్టింగ్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే
-
Shreyas Iyer: ఐర్లాండ్ చేతిలో ఓటమికి కారణం ఇదే.. నిజాన్ని అంగీకరించిన శ్రేయాస్ అయ్యర్..
-
Pulse Polio: 28న పల్స్ పోలియోకు తెలంగాణ రెడీ.!
-
India Lose: ప్రపంచ ఛాంపియన్ల పరువు ఐర్లాండ్ వీధుల్లో పారేశారు.. శ్రేయాస్ అయ్యర్పై ఆగ్రహం..
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!