Mahua Moitra: డిసెంబర్ 4న లోక్సభ ముందుకు మహువా మోయిత్రా ‘క్యాష్ ఫర్ క్వేరీ’ కేసు రిపోర్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mahua Moitra: తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) ఎంపీ మహువా మోయిత్రాపై వచ్చిన ఆరోపణల్ని ఇటీవల పార్లమెంట్ ఎథిక్స్ ప్యానెల్ విచారించింది. పార్లమెంట్లో ప్రశ్నలు అడిగేందుకు వ్యాపారవేత్త నుంచి లంచం తీసుకున్నారనే అభియోగాలు ఆమెపై ఉన్నాయి. క్యాష్ ఫర్ క్వేరీగా పిలువబడుతున్న ఈ కేసులో ఎథిక్స్ ప్యానెల్ రిపోర్టు డిసెంబర్ 4న లోక్సభ ముందు ప్రవేశపెట్టనున్నారు. ఈ నెల ఎథిక్స్ కమిటీ మహువా మోయిత్రానను లోక్ సభ నుంచి బహిష్కరించాలని సూచించింది. లోక్ సభ నిర్ణయంపై ఆమె భవితవ్యం ఆధారపడి ఉంది. వినోద్ సోంకర్ నేతృత్వంలోని ఎథిక్స్ కమిటీ నవంబర్ 9న తృణమూల్ ఎంపీకి వ్యతిరేకంగా నివేదికను ఆమోదించింది. లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు ఈ నివేదికను సమర్పించింది. టీఎంసీ ఎంపీ మహువా మోయిత్రాపై వచ్చిన అభియోగానలు ఎథిక్స్ ప్యానెల్ లోని ఆరుగురు సభ్యులు సమర్థించగా.. నలుగురు సభ్యులు వ్యతిరేకించారు.
Read Also: Qatar: జర్మనీ అధ్యక్షుడికి అవమానం.. అరగంట వరకు విమానం డోర్ వద్దే పడిగాపులు
Also Read
- CJP Protest: వెనక్కి తగ్గని CJP.. ఉద్యమం కొనసాగుతుందని ప్రకటన..
- Sachin Tendulkar: "ఓటమి ఓకే కానీ మోసం నేరం”.. NEET విద్యార్థుల ఉద్యమంపై సచిన్ భావోద్వేగ సందేశం!
- Naresh Pal Gangwar: నీట్ పేపర్ లీక్ నిరసనలు.. ఉన్నత విద్యాశాఖ కార్యదర్శిని తొలగించిన కేంద్రం.. కొత్త కార్యదర్శి ఎవరంటే?
- PM Modi Paper Leak Law: పేపర్ లీక్లపై కఠిన చట్టాలకు సిద్ధమైన కేంద్రం.. అర్ధరాత్రి ప్రధాని మోడీ వీడియో సందేశం
పార్లమెంట్లో ప్రశ్నలు అడిగేందుకు వ్యాపారవేత్త హీరానందానీ నుంచి లంచం తీసుకున్నారని బీజేపీ ఎంపీ నిషికాత్ దూబే ఆరోపించారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జై ఆనంత్ దేహద్రాయ్, ఆమె లంచాలు తీసుకున్నట్లు తిరుగులేని సాక్ష్యాలు ఉన్నందున ఆరోపణలు చేస్తున్నట్లు దూబే పేర్కొన్నారు. ఆమె పార్లమెంట్ లాగిన్ ఐడీని కూడా ఇతరులతో పంచుకున్నట్లు, దుబాయ్, న్యూజెర్సీ, యునైటెడ్ స్టేట్స్ మరియు బెంగళూరు నుంచి ఆమె ఐడీని యాక్సెస్ చేసినట్లు విచారణలో తేలింది. మరోవైపు వ్యాపారవేత్త హీరానందానీ పార్లమెంట్కు సమర్పించిన అఫిడవిట్లో తన నుంచి మోయిత్రా గిఫ్టులు తీసుకున్నట్లు పేర్కొన్నాడు.
ప్రధాని నరేంద్రమోడీ, అదానీ గ్రూపును లక్ష్యంగా చేసుకుంటూ ప్రశ్నలు అడిగినట్లు నిషికాంత్ దూబే ఆరోపించారు. ఆమె అడిగిన దాదాపుగా అన్నీ ఈ వ్యవహారంపైనే ఉన్నాయని చెప్పారు. అయితే ఈ ఆరోపణల్ని న్యాయవాది దేహద్రాయ్ తనపై వ్యక్తిగత పగతో చేశారని మోయిత్రా ఆరోపించింది. మరోవైపు ఈ వ్యవహారంపై ముందుగా ఆచితూచి స్పందించిన తృణమూల్, ఇటీవల ఏకంగా సీఎం మమతా బెనర్జీ మాట్లాడుతూ.. కావాలనే మహువామోయిత్రాను టార్గెట్ చేశారని ఆరోపించింది. ఈ ఆరోపణలు ఆమెకే ప్లస్ అవుతాయని, వచ్చే ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలుస్తుందని అన్నారు.
తాజావార్తలు
-
ఒక్కసారి ఛార్జ్ చేస్తే 526 కి.మీ రేంజ్, Level-2 ADASతో Kia Syros EV లాంచ్.. రూ.13.49 లక్షల ప్రారంభ ధరతో.!
-
రూ.8,599కే 90Hz డిస్ప్లే, IR బ్లాస్టర్ ఫీచర్, మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీతో ZENO 100 Pro లాంచ్.. పవర్ బ్యాంక్లు కూడా.!
-
CJP Protest: వెనక్కి తగ్గని CJP.. ఉద్యమం కొనసాగుతుందని ప్రకటన..
-
Vaibhav Sooryavanshi Records: మూడు వరల్డ్ రికార్డులు బద్దలు కొట్టిన వైభవ్.. ఇక ఎవరికీ సాధ్యం కాదు!
-
Sachin Tendulkar: “ఓటమి ఓకే కానీ మోసం నేరం”.. NEET విద్యార్థుల ఉద్యమంపై సచిన్ భావోద్వేగ సందేశం!
ట్రెండింగ్
-
Water Manifestation Technique: “నీటి మానిఫెస్టేషన్ టెక్నిక్” అంటే ఏమిటి.? నిజంగా పనిచేస్తుందా.?
-
Shreyas Iyer: ఆ ఇద్దరే మ్యాచ్ గెలిపించారు.. మాటలు రావడం లేదు.. తొలి విజయంపై శ్రేయస్ భావోద్వేగం!
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!