Congress: కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఆయనకే అవకాశం.. 1998 తర్వాత గాంధీయేతర కుటుంబం నుంచి ఛాన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Congress Party President Election: కాంగ్రెస్ పార్టీ త్వరలో అధ్యక్ష ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధం అవుతోంది. ఈ నెల 28న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలోనే కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికకు సంబంధించిన షెడ్యూల్ ఖరారు కానుంది. కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలిగా ఉన్న సోనియా గాంధీ అధ్యక్షతన ఆగస్టు 28న మధ్యహ్నం 3.30 గంటలకు వర్చువల్ గా సమావేశం జరగనుంది. అయితే కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతను చేపట్టేందుకు రాహుల్ గాంధీ సుముఖంగా లేనట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు, మెజారిటీ నేతలు రాహుల్ గాంధీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలని కోరుతున్నారు.
ఇదిలా ఉంటే 1998 తర్వాత కాంగ్రెస్ పార్టీకి గాంధీయేతర కుటుంబం నుంచి అధ్యక్షుడు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా ఒకరిపేరు ప్రముఖంగా వినిపిస్తోంది. గాంధీ కుటుంబానికి వీరవిధేయుడిగా ఉన్న రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ పదవీ అధ్యక్ష పదవికి ఎన్నికయ్యే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఈ విషయాన్ని సోనియా గాంధీ, అశోక్ గెహ్లాట్ కు తెలియజేశారని సమాచారం. అనారోగ్య సమస్యలతో సోనియా గాంధీ అధ్యక్షపదవీ బాధ్యతలను సమర్థంగా చేపట్టలేకపోతున్నారు. అశోక్ గెహ్లాట్ కు జాతీయ కాంగ్రెస్ పార్టీ బాధ్యతలను అప్పగించి.. రాజస్థాన్ లో సచిన్ పైలెట్ ను సీఎం అభ్యర్థిగా తీసుకురావాలని కాంగ్రెస్ అధినాయకత్వం భావిస్తోంది. దీంతో రాజస్థాన్ లో కాంగ్రెస్ పార్టీపై అసంతృప్తిని కూడా తొలగించవచ్చని భావిస్తోంది.
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
- UP: ఏం త్యాగం.. ఐదుగురు పిల్లల తల్లిని ప్రియుడికిచ్చి పెళ్లి చేసిన భర్త.. ఏం జరిగిందంటే..!
- Rahul Gandhi vs BJP: విద్యార్థులతో రాజకీయాలెందుకు? రాహుల్గాంధీని ప్రశ్నించిన బీజేపీ
మరోవైపు అశోక్ గెహ్లాట్ మాత్రం రాహుల్ గాంధీనే అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలని కోరుతున్నారు. రాహుల్ గాంధీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టకుంటే కార్యకర్తలు, నాయకులు నిరాశకు గురవుతారని అన్నారు. మరో కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ అధ్యక్ష బాధ్యతలు తీసుకోకుంటే ఎవరూ బలవంతం చేయరని వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే చివరి సారిగా 1996-1998 మధ్య సీతారం కేసరి గాంధీయేతర కుటుంబం నుంచి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పనిచేశారు. ఆ తరువాత నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ అధ్యక్షురాలిగా సోనియాగాంధీనే ఉన్నారు. మధ్యలో 2017-2019 మధ్య కాలంలో రాహుల్ గాంధీ అధ్యక్షుడిగా వ్యవహరించారు. 2019 లోక్ సభ ఎన్నికల్లో యూపీఏ దారుణ పరాజయం తరువాత రాహుల్ గాంధీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!