End India bloc: కలిసి ఉండనప్పుడు కూటమి ఎందుకు?.. ఇండియా బ్లాక్పై ఒమర్ అబ్దుల్లా ఫైర్
- ఇండియా కూటమిపై జమ్మూకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా కీలక వ్యాఖ్యలు..
- కాంగ్రెస్, ఆమ్ఆద్మీ పార్టీల మధ్య విభేదాలు తలెత్తడంతో తీవ్ర ఆగ్రహాం..
- కలిసి ఉండనప్పుడు ఇండియా కూటమి ఎందుకు అని ప్రశ్నించిన ఒమర్ అబ్దుల్లా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
End India bloc: ఇండియా కూటమిని ఉద్దేశిస్తూ జమ్మూకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు చేశారు. కూటమిలో భాగమైన కాంగ్రెస్, ఆమ్ఆద్మీ పార్టీల మధ్య విభేదాలు తలెత్తడంతో ఆగ్రహాం వ్యక్తం చేశారు. దీంతో ప్రతిపక్షాల మధ్య ఐక్యతను ఆయన ప్రశ్నించారు. కలసికట్టుగా ఉండకపోతే కూటమికి ముగింపు పలకాలన్నారు. అయితే, కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా ఏర్పడిన ఇండియా కూటమికి సంబంధించి ప్రస్తుతం ఎలాంటి సమావేశం జరగకపోవడం బాధాకరం అన్నారు. ఇప్పుడు ఈ కూటమికి ఎవరు అధ్యక్షత వహిస్తారు?.. దీని అజెండా ఏంటి?.. అసలు కూటమి ఎలా ముందుకు కొనసాగుతుందని ఒమర్ అబ్దుల్లా ప్రశ్నించారు.
Read Also: Relationship Tips : ఈ లక్షణాలు ఉన్న వారిని నమ్మకండి
Also Read
- Trains: రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. ఇక నుంచి ఆ ప్రాంతాలకు వీక్లీ ఎక్స్ప్రెస్ ట్రైన్స్..
- West Bengal: బంగ్లాదేశీయులు, రోహింగ్యాలకు బ్యాడ్ న్యూస్.. బెంగాల్ ప్రభుత్వం బిగ్ యాక్షన్! ఆ సెంటర్లు రెడీ..
- Dog Steals Cash: ఖతర్నాక్ కుక్క.. ఖరీదైన దొంగతనం! సీసీటీవీ విజువల్స్ చూస్తే మైండ్ బ్లాకే..
- West Bengal: మమత మేనల్లుడి కోటకు బీటలు.. ఫల్తాలో భారీ విజయం దిశగా బీజేపీ..
ఇక, 2024 ఎన్నికల్లో బీజేపీ సొంతంగా మెజార్టీ రాకుండా చేసేందుకు శక్తికి మించి కృషి చేసిన ఇండియా కూటమి భవిష్యత్తుపై ఇప్పుడు స్పష్టత లేకుండాపోయిందన్నారు. మనమంతా ఐక్యంగా ఉంటామా, లేదా అనే విషయంపై స్పష్టత లేదని అసహనం వ్యక్తం చేశారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల తర్వాత కూటమిలోని భాగస్వామ్య పార్టీలు సమావేశానికి సిద్ధంగా ఉండండి.. లేదంటే, లోక్సభ ఎన్నికల కోసమే కూటమి ఏర్పడితే.. పొత్తుకు స్వస్తి చెప్పి.. ఇండియా కూటమిని మూసేయండి అని సూచించారు. అలాకాకుండా అసెంబ్లీ ఎన్నికల్లో కూడా విజయం సాధించాలంటే అందరం కలసికట్టుగా ముందుకు సాగాలని ఒమర్ అబ్దుల్లా పిలుపునిచ్చారు.
Read Also: CM Chandrababu: ఘటనా స్థలాన్ని పరిశీలించిన సీఎం చంద్రబాబు.. అధికారులపై ఫైర్..
అయితే, త్వరలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇండియా కూటమిలో భాగమైన కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీల మధ్య పొత్తుకు దూరంగా ఒంటరిగా బరిలోకి దిగాయి. ఈ రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం సైతం కొనసాగుతుంది. దీంతో లోక్సభ ఎన్నికల తర్వాత ఇండియా బ్లాక్ కి ప్రాధాన్యత తగ్గిపోయిందని కూటమిలోని నేతలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై స్పందించిన జమ్ముకాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా.. కలిసి ఉండలేకపోతే కూటమిని మూసేస్తే మంచిదని కీలక వ్యాఖ్యలు చేశారు.
తాజావార్తలు
-
Instant Onion Mixture: ఈ చిట్కా తెలిస్తే బయట ఫుడ్ అస్సలు కొనరు.. కేవలం 2 నిమిషాల్లో నోరూరుంచే స్నాక్ రెడీ!
-
Nandamuri Balakrishna: ఏపీని సినీ పరిశ్రమకు రాజధానిగా తీర్చిదిద్దుతాం..!
-
Lemon Pickle: చేదు రాకుండా, బూజు పట్టకుండా.. సంవత్సరం పొడవునా పాడవకుండా ‘నిమ్మకాయ పచ్చడి’ చేసేయండి ఇలా..!
-
Telangana Govt: గుడ్న్యూస్.. జూన్ 2 నుంచి మరో పథకం ప్రారంభం.. వారికి రూ.5 లక్షల వరకు..
-
Iran: ఇరాన్ సంచలన నిర్ణయం.. ప్రపంచ దేశాలకు బిగ్ రిలీఫ్! హోర్ముజ్ జలసంధిపై బిగ్ అనౌన్స్మెంట్..
ట్రెండింగ్
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?