Jammu Kashmir: కాశ్మీర్ లోయలో ఎన్కౌంటర్.. నాన్ లోకల్స్ని చంపుతున్న ఉగ్రవాది హతం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Encounter breaks out between security forces and terrorists in J&K’s Anantnag: జమ్మూ కాశ్మీర్ లో మరోసారి ఎన్కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలకు కీలక విజయం లభించింది. ఆదివారం తెల్లవారుజామున అనంత్ నాగ్ జిల్లాలో భద్రతాబలగాలు ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. లష్కరే తోయిబా(ఎల్ఈటీ)కి చెందిన హైబ్రీడ్ ఉగ్రవాదిని మట్టుపెట్టారు కాశ్మీర్ పోలీసులు. ఉగ్రవాదుల రహస్యస్థావరాలను గుర్తించే క్రమంలో ఇరువర్గాల మధ్య ఎన్కౌంటర్ జరిగింది. దక్షిణ కాశ్మీర్ లోని అనంత్ నాగ్ జిల్లాలోని బిజ్ బెహారాలోని చెకీ దుడూ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే పక్కా సమాచారంతో భద్రతాబలగాలు కార్డన్ సెర్చ్ ప్రారంభించాయి. ఈ క్రమంలో కాల్పులు చోటు చేసుకున్నాయని పోలీసులు వెల్లడించారు.
Read Also: Himanta Biswa Sarma: మొఘలులు ఈశాన్య, దక్షిణ భారతాలను ఎన్నడూ జయించలేదు.. చరిత్రను తిరగరాయాలి..
Also Read
- PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
- Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
- Actor Vishal: ‘‘ఆయనకు ఏం తెలుసని మంత్రి పదవి ఇచ్చారు..?’’ సీఎం విజయ్పై విశాల్ ఘాటు వ్యాఖ్యలు..
- Chickens Die: ఘోర ఘటన.. 3 గంటల్లో 5,300 కోళ్లు మృతి.. కారణం ఏంటంటే..
చనిపోయిన ఉగ్రవాదిని కుల్గామ్కు చెందిన సజ్జాన్ తంత్రేగా పోలీసులు గుర్తించారు. సజ్జాన్ లష్కరే ఉగ్రవాదిగా క్రియాశీలకంగా ఉన్నాడు. నవంబర్ 13న బిజ్ బెహరాలోని రఖ్మోమెన్లో స్థానికేతర కూలీని హత్య చేసిన కేసులో సజ్జాన్ ప్రమేయం ఉందని పోలీసులు తెలిపారు. ఈ నెల 13న బిజ్ బెహరాలోని రఖ్ మోమెన్ లో బయట పని చేసుకుంటున్న ఇద్దరు కూలీలపై సజ్జాన్ కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన చోటా ప్రసాద్ అనే కూలీ మరణించాడు. ఈ మాడ్యుల్ కు చెందిన మరికొంత మంది ఉగ్రవాదులను అదుపులోకి తీసుకునేందుకు భద్రతా బలగాలు ప్రయత్నిస్తున్నాయి.
జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులపై భద్రతా బలగాలపై ఉక్కుపాదం మోపుతున్నారు. దీంతో టెర్రరిస్టులు కొత్తగా హైబ్రీడ్ టెర్రరిజానికి తెరలేపారు. జనాల్లో కలిసి ఉంటూనే నాన్ లోకల్స్, హిందువులు, కాశ్మీరీ పండిట్లు, ఉగ్రవాదులకు వ్యతిరేకంగా ఉన్నవారిని చంపి పారిపోతున్నారు. ఇలా చాలా మంది సామాన్య ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. అయితే ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్న వారిని వెతికి మరీ చంపేస్తున్నాయి భద్రతా బలగాలు.
తాజావార్తలు
-
Peddi: రామ్ చరణ్ ఫ్యాన్స్కు బ్యాడ్ న్యూస్..?
-
F-18 Collision: వైమానిక ప్రదర్శనలో.. ఢీకొన్న రెండు ఎఫ్-18 యుద్ధ విమానాలు (వీడియో)
-
KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
-
PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
-
Ragi Mixture: సాయంత్రం స్నాక్స్లోకి క్రిస్పీ ‘రాగి మిక్సర్’.. సింపుల్గా హెల్తీగా ఇంట్లోనే ఇలా చేసుకోండి!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..