Himanta Biswa Sarma: మొఘలులు ఈశాన్య, దక్షిణ భారతాలను ఎన్నడూ జయించలేదు.. చరిత్రను తిరగరాయాలి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Assam Chief Minister Himanta Biswa Sarma Comments On Rahul Gandhi over veer savarkar remarks:అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. 600 ఏళ్లకు పైగా అస్సాంను పాలించిన అహోం రాజవంశానికి చెందిన లెజెండరీ జనరల్ లచిత్ బర్ఫుకాన్ 400వ వార్షికోత్సవ కార్యక్రమం ఢిల్లీలో జరిగింది. దీనికి హాజరయ్యారు హిమంత బిశ్వ శర్మ. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, వీర సావర్కర్ పై చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వీర సావర్కర్ ని ప్రశ్నించడం పాపం అని అన్నారు. స్వాతంత్య్రోద్యమంలో సావర్కర్ సహకారాన్ని ప్రశ్నించడం పాపమని.. ఈ పాపాన్ని రాహుల్ గాంధీ చేయకూడదని ఆయన అన్నారు.
Read Also: Sangareddy Accident: గోవా నుంచి వస్తూ తెలంగాణలో ప్రాణాలు కోల్పోయారు
Also Read
- Congress 1000 Days: కాంగ్రెస్ 1000 రోజుల పాలనపై బీఆర్ఎస్ ఛార్జ్షీట్..!
- Ram Mandir Trust First CEO: రామ మందిర ట్రస్ట్ సీఈవో రేసులో ఆ నలుగురు.. తొలి CEOపై తుది నిర్ణయం రేపే..
- Mahua Moitra: ఎంపీ మహువా మొయిత్రా భద్రతపై కలకత్తా హైకోర్టు కీలక ఆదేశాలు.. కారణమిదే!
- Nitin Nabin: రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసిన నితిన్ నబిన్
మొఘలులు ఈశాన్య, దక్షిణ భారతాలను ఎన్నడూ జయించలేదని..చరిత్రను తిరిగి రాయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. వామపక్ష చరిత్రకారులు మొఘల్ చక్రవర్తులు యావత్ దేశాన్ని పాలించినట్లు వక్రీకరించారని.. ఈశాన్య భారతదేశాన్ని, అస్సాంలను ఎన్నడూ జయించలేదని అన్నారు. యావత్ భారతదేశం మొఘలుల చేతిలో ఓడిపోయిందని అంచానా వేయడాన్ని ‘వామపక్ష కుట్ర’గా హిమంత బిశ్వ శర్మ అభివర్ణించారు. సావర్కర్పై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. సావర్కర్ చాలా ఏళ్లు జైలులో ఉన్నారని.. అతను దేశానికి ఏం చేశాడని ప్రశ్నిస్తున్న వారు, ఆయన పాత్రను ప్రశ్నిస్తున్నవారు పాపం చేస్తున్నారని మండిపడ్డారు.
అంతకుముందు గురువారం, రాహుల్ గాంధీ మహారాష్ట్రలో సాగుతున్న భారత్ జోడో యాత్రలో సావర్కర్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సావర్కర్ బ్రిటీష్ వారికి క్షమాపణలు చెబుతూ.. నమ్మకస్తుడిగా ఉంటానని లేఖ రాశారని.. మహాత్మా గాంధీ, నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్ వంటి నేతలకు ద్రోహం చేశారని రాహుల్ గాంధీ అన్నారు. ఈ వ్యాఖ్యలపై శివసేన, బీజేపీ పార్టీలు రాహుల్ గాంధీపై విరుచుకుపడుతున్నాయి. ఇప్పటికే రాహుల్ వ్యాఖ్యలపై థానేనగర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది. స్థానికులు మనోభావాలు దెబ్బతిన్నాయని శివసేన నేతలు ఫిర్యాదు చేయడంతో ఆయనపై ఐపీసీ సెక్షన్ 500, 501 కింద నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్ కేసు నమోదైంది.
తాజావార్తలు
-
Toxic: సొంత గడ్డపైనే యశ్కు షాక్.. ‘టాక్సిక్’ వసూళ్లు చూసి ట్రేడ్ వర్గాలు అవాక్కు!
-
Sonu Sood: నేపాల్ విధ్వంసం చూసి చలించిపోయిన సోనూ సూద్.. బాధితులకు అండగా నిలవాలని విజ్ఞప్తి
-
Pawan Kalyan Birthday: అమలాపురం గడ్డ పవన్ అభిమానుల అడ్డా.. పవర్ స్టార్ పుట్టినరోజు మాకు పండుగే!
-
Emmy Awards 2026: ఈ నెలలోనే 78వ ఎమ్మీ అవార్డ్స్ .. ఎక్కువ నామినేషన్లు అందుకున్న షోలు ఇవే!
-
Congress 1000 Days: కాంగ్రెస్ 1000 రోజుల పాలనపై బీఆర్ఎస్ ఛార్జ్షీట్..!
ట్రెండింగ్
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!
-
8,050mAh బ్యాటరీ, 185Hz AMOLED డిస్ప్లే, 200MP కెమెరాతో ఫ్లాగ్షిప్ ఫోన్ POCO F9 Ultra లాంచ్.!
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!