Encounter: జమ్మూ కాశ్మీర్ దోడా జిల్లాలో ఎన్కౌంటర్.. కథువా ఉగ్రదాడి తర్వాత ఘటన..
- జమ్మూ కాశ్మీర్లో ఎన్కౌంటర్..
- దోడా జిల్లాలో భద్రతా సిబ్బంది - ఉగ్రవాదులకు మధ్య కాల్పులు..
- కథువా ఉగ్రదాడి తర్వాత రోజే మరో ఘటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Encounter: జమ్మూ కాశ్మీర్ వరస ఉగ్ర ఘటనలతో అట్టుడికిపోతోంది. తాజాగా దోడా జిల్లాలో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. నిన్న కథువాలో ఉగ్రవాదులు ఆర్మీ వాహనాలపై మెరుపుదాడి చేసి ఐదుగురు జవాన్ల మరణాలకు కారణమయ్యారు. ఈ ఘటన జరిగిన ఒక రోజు తర్వాత జమ్మూ లోని దోడా జిల్లాలో తాజా ఎన్కౌంటర్ ప్రారంభమైంది.
Read Also: BJP: “బెంగాల్లో మరో తాలిబాన్ వీడియో”.. తృణమూల్ అరాచకాలపై రాహుల్ గాంధీ మౌనం ఎందుకు..?
Also Read
- Priyanka Gandhi: ఆయన సర్టిఫికెట్ మాకు అవసరం లేదు.. మోహన్ భగవత్ వ్యాఖ్యలకు ప్రియాంకాగాంధీ కౌంటర్
- Salman Khan: అస్సాం వరద బాధితులకు అండగా సల్మాన్ ఖాన్.. 500 కొత్త ఇళ్ల నిర్మాణానికి సహాయం
- Gujarat Well Mystery: వింత ఘటన.. బావిలో నీరు అలల్లా కదలికలు, రంగంలోకి అధికారులు (వీడియో)
- Cyber Crime: నకిలీ పాప్-అప్ టోల్ఫ్రీ నంబర్లతో బురిడీ.. అంతర్జాతీయ సైబర్ మోసాల ముఠా గుట్టురట్టు..
కథువా ఘటన 48 గంటల్లో ఆర్మీపై జరిగిన రెండో దాడి. అంతకుముందు రాజౌరీలోని సైనిక శిబిరంపై ఆదివారం ఉగ్రవాద దాడి జరిగింది. ఈ దాడిని సైన్యం తిప్పికొట్టింది. దీంట్లో ఒక సైనికుడు గాయపడ్డాడు. ఆ తర్వాతి రోజు సోమవారం కథువాలో పెట్రోలింగ్ పార్టీపై, ఉగ్రవాదులు అడవుల్లో నక్కి గ్రెనెడ్స్ విసిరి, కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఐదుగురు జవాన్లు అమరులయ్యారు. కథువా ఘటన జరిగిన తర్వాత భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నాయి. ఈ ఘటనకు పాక్ ఉగ్రసంస్థ జైషే మహ్మద్కి సన్నిహితంగా ఉన్న కాశ్మీర్ టైగర్స్ బాధ్యత ప్రకటించుకుంది.
60 మందికి పైగా పాక్ ఉగ్రవాదులు, జింగిల్ వార్ఫేర్లో శిక్షణ పొంది జమ్మూ కాశ్మీర్లో పనిచేస్తున్నారు. గత నెల కాలం నుంచి రాజౌరీ, కథువా, దోడా జిల్లాల్లో ఉగ్రవాద దాడులు జరిగాయి. గత నెలలో ప్రధాని మోడీ మూడోసారి ప్రమాణస్వీకారం చేస్తున్న రోజే, కథువా జిల్లాలో శివ్ ఖోరీ నుంచి కత్రా వెళ్తున్న యాత్రికుల బస్సుపై ఉగ్రవాదులు దాడి చేయడంతో 10 మంది మరణించారు. జమ్మూ ప్రాంతంలోని కథువా, రాజౌరీ, దోడా జిల్లాల్లోని దట్టమైన అడవులు, కొండలు, లోయలు ఉగ్రవాదులకు అనుకూలంగా ఉన్నాయి. ఈ అడవులు పాక్ ఆక్రమిత కాశ్మీర్లోకి కొనసాగుతుండటంతో ఉగ్రవాదులకు అడ్డాగా మారింది.
తాజావార్తలు
-
Priyanka Gandhi: ఆయన సర్టిఫికెట్ మాకు అవసరం లేదు.. మోహన్ భగవత్ వ్యాఖ్యలకు ప్రియాంకాగాంధీ కౌంటర్
-
Mohammed Siraj: కొలంబోలో ‘డీఎస్పీ సాబ్’ రచ్చ.. సరికొత్త లుక్తో మైదానంలో మెరిసిన సిరాజ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
OG 2 Update: పవన్ కళ్యాణ్ ‘ఓజీ 2’ స్క్రిప్ట్ లాక్.. కానీ బిగ్ ట్విస్ట్!
-
Vu Glo Mini-LED TV: వీయూ గ్లో మినీ ఎల్ఈడీ టీవీ విడుదల.. 120Hz డిస్ప్లే, 50W సౌండ్తో కొత్త స్మార్ట్ టీవీ
ట్రెండింగ్
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!
-
12 అంగుళాల 2K 90Hz డిస్ప్లే, క్వాడ్ స్పీకర్లతో HP OmniPad 12 భారత్లో లాంచ్..!