Elon Musk: భారతదేశంలోకి ఎలాన్ మస్క్ సంస్థ.. లైసెన్సు కోసం ప్రభుత్వానికి దరఖాస్తు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Elon Musk’s SpaceX Seeks Licence To Launch Starlink Broadband In India: భారతదేశంలోకి అడుగు పెట్టేందుకు ఎలాన్ మస్క్ సంస్థ స్పేస్ఎక్స్ సిద్ధం అవుతోంది. దేశంలో ప్రతిష్టాత్మకంగా 5జీ సేవలను ప్రారంభించింది ప్రభుత్వం. దీంతో ప్రపంచదేశాలకు చెందిన పలు కంపెనీలు భారత్ లో అంతరిక్ష వ్యాపారాలపై ఆసక్తి చూపిస్తున్నాయి. ఎలాన్ మస్క్ స్పేస్ఎక్స్ తన స్టార్ లింక్ బ్రాండ్తో భారతదేశంలో బ్రాడ్బ్యాండ్-ఫ్రమ్-స్పేస్ సేవలను ప్రారంభించేందుకు సిద్ధం అవుతోంది. శాటిలైట్ సర్వీసెస్ కోసం టెలికమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ (డీఓటీ)కి దరఖాస్తు చేసింది. స్పేస్ఎక్స్ దరఖాస్తు చేసిందని.. డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ నిర్ధేశించిన విధి విధానాల ప్రకారం ప్రభుత్వం లైసెన్సుపై నిర్ణయం తీసుకుంటుందని అధికారులు తెలిపారు.
గ్లోబల్ కంపెనీలు భారతీయ అంతరిక్షంపై ఆసక్తి చూపుతున్నాయి. వాటిలో ఎలాన్ మస్క్ కు సంబంధించిన స్పేస్ఎక్స్ కూడా ఒకటి. ఇప్పటికే భారతీ గ్రూప్ కు సంబంధించిన వన్ వెబ్, రిలియన్స్ జియో ఇన్ఫోకామ్ ఇప్పటికే తమ లైసెన్సులను పొందాయి. శాటిలైట్ సేవలకు సంబంధించి లైసెన్సుల కోసం అప్లై చేసుకున్న మూడో సంస్థ స్పేస్ఎక్స్.
Also Read
- Modi-Rahul Gandhi: కులగణనపై మోడీకి ఖర్గే, రాహుల్గాంధీ లేఖ.. ఏముందంటే..!
- Operation Sindoor: పాకిస్తాన్ వేడుకున్నా దాడి చేశాం: మాజీ సీడీఎస్ అనిల్ చౌహాన్..
- Operation Sindoor: పాక్ అణుకేంద్రం ‘‘కిరాణా హిల్స్’’పై దాడి.. సంచలన నిజం చెప్పిన మాజీ CDS..
- Rahul Gandhi: కృతి సనన్ రక్షాబంధన్ యాడ్పై కంగనా విమర్శలు.. ఆమె ఇష్టమని రాహుల్గాంధీ మద్దతు
Read Also: Boora Narsaiah Goud: ఇవాళ బీజేపీలో చేరనున్న బూర నర్సయ్య గౌడ్
ప్రస్తుతం స్పేస్ఎక్స్ సంస్థ ప్రైవేటు విభాగంలో అంతరిక్ష ప్రయోగాల్లో దూసుకెళ్తోంది. స్పేస్ఎక్స్ తన ఫాల్కన్ రాకెట్ల ద్వారా అంతరిక్షంలోకి శాటిలైట్లను పంపిస్తోంది. డ్రాగన్ క్రూ ద్వారా అంతర్జాతీయ అంతరిక్షం కేంద్రం(ఐఎస్ఎస్)కు వ్యోమగాములను, సరకులను పంపుతోంది. ఈ విధంగా వ్యోమగాములను పంపిన ప్రైవేట్ స్పేస్ ఏజెన్సీగా స్పేస్ఎక్స్ రికార్డు క్రియేట్ చేసింది. స్టార్లింక్ కాన్స్టెలేషన్తో ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ కనెక్టవిటీని అందిస్తోంది.
గ్లోబల్ కంపెనీలు భారతీయ స్పేస్ పై ఆసక్తి చూపిస్తున్నాయి. దీంతో బ్రాడ్బ్యాండ్-ఫ్రం-స్పేస్ సేవల విభాగంలో రానున్న కాలంలో పోటీ తీవ్రం అయ్యే అవకాశాలు ఉన్నాయి. దీని విలువ 2025 నాటికి 13 బిలియన్ డాలర్లకు చేరుతుందని అంచానా. జియో, వన్ వెబ్, నెల్కో, కెనడాకు చెందిన టెలిసాట్, అమెజాన్ వంటి సంస్థలు భారతదేశంలో శాటిలైట్ బ్రాడ్బ్యాండ్ సేవలను ప్రారంభించేందుకు ఉవ్విళ్లూరుతున్నాయి.
తాజావార్తలు
-
Sandeep Reddy Vanga : ప్రభాస్ ‘స్పిరిట్’ కి A సర్టిఫికెట్ పక్కా.. నేను ఎంత గింజుకున్నా అంతే!
-
Modi-Rahul Gandhi: కులగణనపై మోడీకి ఖర్గే, రాహుల్గాంధీ లేఖ.. ఏముందంటే..!
-
Sandeep Reddy Vanga : ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్!
-
Power Bank Explosion : పవర్ బ్యాంక్ పేలి విద్యార్థికి తీవ్ర గాయాలు
-
OTR: మంత్రి కొండా సురేఖను కేబినెట్ నుంచి తప్పిస్తారా..?
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!