Viral: మహిళను తొక్కి చంపిన ఏనుగు.. అంత్యక్రియలు కూడా అడ్డుకొని..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గజరాజుకు కోపం వస్తే ఏం జరుగుతోందో.. ఎలా ప్రవర్తిస్తోందో ఎన్నో ఘటనలు వెలుగు చూశాయి.. ప్రశాంతంగా ఉండే గజరాజుకు కోపం వచ్చిందంటే.. ఆపడం ఎవరితరం కాదు.. విధ్వంసం సృష్టిస్తోంది.. పంట పొలాలు, వాహనాలు, ప్రజలు, జంతువులు.. ఇలా ఏది అడ్డువచ్చినా.. అడ్డుకోవడం కష్టమే.. అయితే, తాజాగా ఓ ఏనుగు ప్రవర్తించిన తీరు మాత్రం సోషల్ మీడియాకు ఎక్కింది.. ఔరా..! ఆ గజరాజు ఎందుకు ఇలా చేశాడు..? మహిళలను తొక్కి చంపడం ఏంటి..? ఆ తర్వాత అంత్యక్రియలను కూడా అడ్డుకోవడం ఏంటి..? అంటూ అంతా ఆశ్చర్యపోయేలా చేసింది. అంతే కాదు.. ఆ ఘటన వెనుక ఓ స్టోరీని కూడా తెరపైకి తెస్తున్నారు.
Read Also: Rahul Gandhi At ED Office: ఈడీ ముందుకు రాహుల్.. విచారణ ప్రారంభం
Also Read
- UP Politics: అఖిలేశ్ ముందే ఎస్పీ నేతల బూతులు.. రెండు జిల్లా కమిటీలు రద్దు
- BJP: ‘‘కాంగ్రెస్ జోకర్ల పార్టీ’’.. రాహుల్ గాంధీపై బీజేపీ ఫైర్..
- Global Fuel Crisis: అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్లో రికార్డ్ స్థాయికి చేరిన డీజిల్, పెట్రోల్ ధరలు.. నెక్ట్స్ భారత్ వంతేనా?
- Job Loss Benefit: ఉద్యోగం పోయిందా? డోంట్ వర్నీ.. 50% జీతం మీ అకౌంట్లోకి వస్తుంది.. ఈ స్కీమ్ గురించి తెలుసా?
ఒడిశాలో జరిగిన ఆ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మయూర్భంజ్ జిల్లాలో 70 ఏళ్ల వృద్ధురాలిపై దాడి చేసింది ఓ ఏనుగు.. రాయ్పల్ గ్రామంలో నివాసం ఉంటున్న 70 ఏళ్ల వృద్ధురాలు మయ ముర్మూ.. తాగు నీటి కోసం సమీపంలోని పంపు మోటర్ దగ్గరకు వెళ్లగా.. పొలాల్లోకి దూసుకొచ్చిన ఓ ఏనుగు.. ఆమె దాడి చేసింది.. ఏనుగు దాడిలో తీవ్రంగా గాయపడిన ఆమెను ఆస్పత్రికి తరలించారు స్థానికులు.. కానీ, అప్పటికే ఆమె మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు.. ఇక, అంత్యక్రియలకు ఏర్పాట్లు చేసిన బంధువులు, స్థానికులు.. మృతదేహాన్ని ఊరేగింపుగా స్మశనవాటికకు తరలించారు. మృతదేహాన్ని చితి మీద పెట్టే సమయానికి మరోసారి ఎంట్రీ ఇచ్చింది ఆ ఏనుగు.. భయంతో అక్కడివారు పరుగులు తీయగా.. చితి మీద నుంచి శవాన్ని తొండంతో ఎత్తి పడేసింది.. కిందపడేసి తొక్కింది.. ఆ వృద్ధురాలి శవాన్ని దూరంగా విసిరేసంది.. ఇక, ఆ తర్వాత నెమ్మదిగా అక్కడి నుంచి వెళ్లిపోయింది..
ఈ ఘటన వెనుక స్థానికులు ఓ స్టోరీని చెబుతున్నారు.. మయ ముర్మూ భర్త ఏడేళ్ల క్రితం అనారోగ్యంతో చనిపోయాడట.. అయితే, ఆయనకు విషం పెట్టి మయ ముర్మూ చంపేసిందనే ప్రచారం కూడా ఉందట.. దీంతో, ఆమెపై కోపంతో ఉన్న భర్త.. ఆత్మగా మారి.. ఆ ఏనుగులో ప్రవేశించి.. ఇప్పుడు ఆమెను చంపేశాడని.. కనీసం అంత్యక్రియలను కూడా సజావుగా సాగకుండా చేశాడని.. గ్రామస్తుల జోలికే రాలేదని కథలు కథలుగా చెబుతున్నారు. మొత్తంగా ఈ వ్యవహారం ఇప్పుడు నెట్టింట వైరల్గా మారిపోయింది.
- Tags
- elephant
- funeral
- india
- Maya Murmu
- Odisha
తాజావార్తలు
-
UP Politics: అఖిలేశ్ ముందే ఎస్పీ నేతల బూతులు.. రెండు జిల్లా కమిటీలు రద్దు
-
RVNL New Order: నవరత్న కంపెనీకి రూ. 404 కోట్ల రైల్వే ప్రాజెక్ట్.. సోమవారం ఈ షేర్లలో కదలికలు..
-
Khairatabad Ganesh : ఖైరతాబాద్లో గణపయ్య సందడి.. క్యూలైన్లన్నీ ఫుల్.!
-
BJP: ‘‘కాంగ్రెస్ జోకర్ల పార్టీ’’.. రాహుల్ గాంధీపై బీజేపీ ఫైర్..
-
The Paradise: అనిరుధ్ స్టూడియో నుంచి నాని ‘చిన్న లీక్’.. ‘ది ప్యారడైజ్’ 3rd సింగిల్పై క్రేజీ వీడియో వైరల్! చూశారా
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!