EC-West bengal: ఎన్నికల వేళ ఈసీ కొరడా.. బెంగాల్లో ఏడుగురు ఎన్నికల అధికారులు తొలగింపు
- ఎన్నికల వేళ ఈసీ కొరడా
- బెంగాల్లో ఏడుగురు ఎన్నికల అధికారులు తొలగింపు
- ‘సర్’లో నిర్లక్ష్యం వహించినందుకు సస్పెండ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమ బెంగాల్ ఎన్నికల షెడ్యూల్ విడుదలకు రంగం సిద్ధం అవుతున్న తరుణంలో కేంద్ర ఎన్నికల సంఘం నిర్లక్ష్యంపై కొరడా ఝుళిపించింది. ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు ఏడుగురు అధికారులను సస్పెండ్ చేసింది. అధికారులపై తీవ్రమైన దుష్ప్రవర్తన, విధి నిర్వహణలో నిర్లక్ష్యం, ‘‘SIR’’ విషయంలో అధికారుల దుర్వినియోగంపై కీలక మైన ఆధారాలను సేకరించింది. దీంతో 1950 ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 13CC కింద అధికారులను సస్పెండ్ చేసింది. తక్షణమే ఎలాంటి ఆలస్యంగా లేకుండా అధికారులపై చర్యలు తీసుకోవాలని పశ్చిమ బెంగాల్ ప్రధాన కార్యదర్శికి కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది.
ఇది కూడా చదవండి: Bill Gates Flight Delay: బిల్గేట్స్ ఫ్లైట్ ల్యాండింగ్లో ఇబ్బందులు.. విజయవాడ చుట్టూ చక్కర్లు కొడుతున్న విమానం!
Also Read
- Rahul Gandhi: నీట్ బాధిత కుటుంబాలకు రాహుల్ గాంధీ ఓదార్పు.. ఎక్స్లో ఫొటోలు పోస్ట్
- Secret Reveal: 46 టన్నుల ఆర్బీఐ బంగారం గుట్టుచప్పుడు కాకుండా విదేశాలకు ఎలా వెళ్లింది..?
- Rahul Gandhi: ఆయోధ్య ‘చందా చోరీ’ స్కిట్పై ఫిర్యాదు.. రాహుల్గాంధీతో పాటు పలువురిపై ఎఫ్ఐఆర్
- Ajit Doval: స్వేచ్ఛ అంటే ఇష్టానుసారంగా ప్రవర్తించడం కాదు.. జెన్-జీపై అజిత్ దోవల్ కీలక వ్యాఖ్యలు
నివేదికల ప్రకారం.. సస్పెండ్ చేయబడిన అధికారుల్లో ముర్షిదాబాద్లోని సంసేర్గంజ్కు చెందిన AERO డాక్టర్ సఫీ ఉర్ రెహమాన్, ఫరక్కాకు చెందిన AERO నితీష్ దాస్ ఉన్నారు. మైనాగురికి చెందిన డాలియా రే చౌదరి, సుతి బ్లాక్కు చెందిన SK ముర్షిద్ ఆలం కూడా సస్పెండ్ అయ్యారు. అలాగే దక్షిణ 24 పరగణాలలోని కానింగ్ పుర్బో నియోజకవర్గానికి చెందిన AROలు సత్యజిత్ దాస్, జోయ్దీప్ కుండులను కూడా సస్పెండ్ చేశారు. జాయింట్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (BDO), డెబ్రా అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన ARO దేబాషిష్ బిశ్వాస్పై కూడా చర్యలు తీసుకున్నారు. ఈ అధికారులపై తీవ్ర నిర్లక్ష్యం, ఎన్నికల చట్టాలను ఉల్లంఘించారని ఆరోపిస్తూ కమిషన్కు నిరూపితమైన ఫిర్యాదులు అందాయి. దర్యాప్తు తర్వాత తక్షణ సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
ఇది కూడా చదవండి: Tarique Rahman: బంగ్లాదేశ్ ప్రధానిగా రేపు తారిక్ రెహమాన్ ప్రమాణస్వీకారం.. హాజరుకానున్న ఓం బిర్లా
SIR ప్రక్రియలో ఏదైనా నిర్లక్ష్యం లేదా ఏకపక్షతను సహించబోమని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. రాష్ట్రంలో నిష్పాక్షికమైన ఎన్నికలు జరిగేలా చూసేందుకు కమిషన్ ఈ చర్య ఒక ప్రధాన హెచ్చరికగా భావిస్తున్నారు.
తాజావార్తలు
-
Nithiin : నాని ప్రొడక్షన్లో నితిన్ కొత్త సినిమా
-
Danger Warnings: గోదావరి ఉగ్రరూపం.. ఆ జిల్లాలో కలకలం.. రంగంలోకి సహాయక బృందాలు..
-
Nirmal Purja: ప్రపంచ ప్రఖ్యాత పర్వతారోహకుడు దుర్మరణం.. పీవోకేలో నిర్మల్ పూర్జా మృతి
-
Sergio Gor: బంగ్లాదేశ్ ప్రధానితో సెర్గియో గోర్ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ
-
Captain Rajat Patidar: ఎట్టకేలకు కెప్టెన్సీ కొట్టేసిన రజత్ పాటిదార్.. సంతోషంలో ఆర్సీబీ ఫ్యాన్స్..
ట్రెండింగ్
-
Onion Cleaning Hack : ఉల్లిపాయతో గ్లాస్ మెరుస్తుందా.? వైరల్ హ్యాక్లో నిజం ఎంత.!
-
Kitchen Tips : బియ్యం కేవలం వంటకే కాదు.. ఈ సీక్రెట్ హ్యాక్స్ తెలిస్తే ఆశ్చర్యపోతారు.!
-
Flipkart Pay Later: ఇప్పుడు కొనండి.. నిమ్మలంగా కట్టండి.. ఫ్లిప్కార్ట్లో ‘పే లేటర్’ సదుపాయం!
-
ITR Filing Deadline: ట్యాక్స్పేయర్లకు అలెర్ట్.. ITR ఫైల్ చేశారా? ఈరోజే చివరి గడువు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవసరమా?.. అసలు ఆ ఆలోచన ఏంటి?.. ప్రముఖ వ్యాఖ్యాత ఆసక్తికర వ్యాఖ్యలు!