Delhi Assembly Polls: ఓటర్ల తుది జాబితా విడుదలకు రంగం సిద్ధం! ఎన్నికల షెడ్యూల్ ఎప్పుడంటే..!
- ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ఈసీ ఏర్పాట్లు
- ఓటర్ల తుది జాబితా విడుదలకు రంగం సిద్ధం!
- ఎన్నికల షెడ్యూల్ ఎప్పుడంటే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు సమయం దగ్గర పడుతోంది. ప్రస్తుత ఢిల్లీ ప్రభుత్వం కాలం 2025, ఫిబ్రవరితో ముగుస్తుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. 2020లో ఫిబ్రవరి 8న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఫలితాలు మాత్రం ఫిబ్రవరి 11న విడుదలయ్యాయి. 2024లో పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్సభ ఎన్నికలు జరిగాయి. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం కొలువుదీరింది. ఇక తాజాగా మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు కూడా ముగిశాయి. మహారాష్ట్రలో ఎన్డీఏ, జార్ఖండ్లో ఇండియా కూటమి ప్రభుత్వాలు కొలువుదీరాయి.
ఇక 2025 కొత్త సంవత్సరంలో దేశ రాజధాని ఢిల్లీలో జరిగే శాసనసభ ఎన్నికలకు ప్రధాన పార్టీలైన ఆమ్ ఆద్మీ, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు సన్నద్ధం అవుతున్నాయి. ఢిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 2020, ఫిబ్రవరి 8న జరిగిన ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ 70 స్థానాలకు గాను 62 సీట్లు గెలుచుకుని భారీ విజయాన్ని సాధించింది. బీజేపీ 8 స్థానాలను కైవసం చేసుకోగా… కాంగ్రెస్ ఖాతా తెరవలేకపోయింది.
Also Read
- Salman Nadwi D*eath: అయోధ్య వివాదంపై చర్చలకు మద్దతిచ్చిన మౌలానా సల్మాన్ నద్వీ మృతి..
- Tamil Nadu Politics: విజయ్ సర్కార్ ఎప్పుడైనా కూలిపోవచ్చు.. ఎన్నికలకు సిద్ధం కండి..! స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు
- MEA: కరాచీ దాడిని భారత్పై నెట్టొద్దు.. పాక్పై ఘాటు వ్యాఖ్యలు..
- Ketan Agarwal Murder Case: కేతన్ హత్యలో పట్టుబడకుండా 10 గంటల మాస్టర్ ప్లాన్.. చివరకు అదే పట్టించింది!
ఇదిలా ఉంటే అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాను విడుదల చేయడం ఆనవాయితీ. ఇందుకోసం ఈసీ కసరత్తు పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఓటర్ల తుది జాబితాను జనవరి 6న విడుదల చేయనున్నట్లు ఈసీ తెలిపింది. అయితే ఓటర్ల జాబితా విడుదలైన ఒకటి, రెండ్రోజుల్లో ఈసీ షెడ్యూల్ విడుదల చేస్తుంటుంది. అయితే జనవరి 6 తర్వాత ఎప్పుడైన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల అవ్వొచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఢిల్లీ అసెంబ్లీ చివరి సమావేశాలు కూడా డిసెంబర్ 5తో ముగిసింది.
ఇదిలా ఉంటే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కోసం ఇప్పటికే ప్రధాన పార్టీలు సిద్ధమవుతున్నాయి. అధికార ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పటికే 11 మంది అభ్యర్థులను ప్రకటించేసింది. అలాగే బీజేపీ కూడా నియోజకవర్గ కమిటీలను ప్రకటించింది. ఇక కాంగ్రెస్ కూడా అన్ని స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు వెల్లడించింది. ఆప్తో పొత్తు ఉండబోదని తెలిపింది. మొత్తానికి ఢిల్లీలో త్రిముఖ పోరు ఉండబోతున్నట్లు తెలుస్తోంది.
తాజావార్తలు
-
RaviTeja : మాస్ మహారాజా రవితేజ ‘ఇరుముడి’ ఫస్ట్ సింగిల్ ‘ఇరుముడి కట్టు’ రిలీజ్
-
Suriya : కరుప్పు బ్లాక్ బస్టర్ జోష్..నెక్ట్స్ సినిమాలో పాట పడబోతున్న సూర్య
-
Mustard Oil Ban in US: భారత్లో హెల్దీ.. అమెరికాలో నిషేధం.. ఆవ నూనెపై నిజాలు ఇవే..!
-
Harshad Chopra: 43 ఏళ్ల వయసులోనూ ఎందుకు పెళ్లి చేసుకోలేదు?.. ప్రముఖ టీవీ నటుడు ఎమోషనల్ కామెంట్స్
-
Team India: టీమిండియాకు ఒక్క పరుగు షాక్.. ఇదేం మొదటిసారి కాదు!
ట్రెండింగ్
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!