Delhi Assembly Polls: ఓటర్ల తుది జాబితా విడుదలకు రంగం సిద్ధం! ఎన్నికల షెడ్యూల్ ఎప్పుడంటే..!
- ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ఈసీ ఏర్పాట్లు
- ఓటర్ల తుది జాబితా విడుదలకు రంగం సిద్ధం!
- ఎన్నికల షెడ్యూల్ ఎప్పుడంటే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు సమయం దగ్గర పడుతోంది. ప్రస్తుత ఢిల్లీ ప్రభుత్వం కాలం 2025, ఫిబ్రవరితో ముగుస్తుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. 2020లో ఫిబ్రవరి 8న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఫలితాలు మాత్రం ఫిబ్రవరి 11న విడుదలయ్యాయి. 2024లో పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్సభ ఎన్నికలు జరిగాయి. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం కొలువుదీరింది. ఇక తాజాగా మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు కూడా ముగిశాయి. మహారాష్ట్రలో ఎన్డీఏ, జార్ఖండ్లో ఇండియా కూటమి ప్రభుత్వాలు కొలువుదీరాయి.
ఇక 2025 కొత్త సంవత్సరంలో దేశ రాజధాని ఢిల్లీలో జరిగే శాసనసభ ఎన్నికలకు ప్రధాన పార్టీలైన ఆమ్ ఆద్మీ, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు సన్నద్ధం అవుతున్నాయి. ఢిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 2020, ఫిబ్రవరి 8న జరిగిన ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ 70 స్థానాలకు గాను 62 సీట్లు గెలుచుకుని భారీ విజయాన్ని సాధించింది. బీజేపీ 8 స్థానాలను కైవసం చేసుకోగా… కాంగ్రెస్ ఖాతా తెరవలేకపోయింది.
Also Read
- PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
- Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
- Actor Vishal: ‘‘ఆయనకు ఏం తెలుసని మంత్రి పదవి ఇచ్చారు..?’’ సీఎం విజయ్పై విశాల్ ఘాటు వ్యాఖ్యలు..
- Chickens Die: ఘోర ఘటన.. 3 గంటల్లో 5,300 కోళ్లు మృతి.. కారణం ఏంటంటే..
ఇదిలా ఉంటే అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాను విడుదల చేయడం ఆనవాయితీ. ఇందుకోసం ఈసీ కసరత్తు పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఓటర్ల తుది జాబితాను జనవరి 6న విడుదల చేయనున్నట్లు ఈసీ తెలిపింది. అయితే ఓటర్ల జాబితా విడుదలైన ఒకటి, రెండ్రోజుల్లో ఈసీ షెడ్యూల్ విడుదల చేస్తుంటుంది. అయితే జనవరి 6 తర్వాత ఎప్పుడైన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల అవ్వొచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఢిల్లీ అసెంబ్లీ చివరి సమావేశాలు కూడా డిసెంబర్ 5తో ముగిసింది.
ఇదిలా ఉంటే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కోసం ఇప్పటికే ప్రధాన పార్టీలు సిద్ధమవుతున్నాయి. అధికార ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పటికే 11 మంది అభ్యర్థులను ప్రకటించేసింది. అలాగే బీజేపీ కూడా నియోజకవర్గ కమిటీలను ప్రకటించింది. ఇక కాంగ్రెస్ కూడా అన్ని స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు వెల్లడించింది. ఆప్తో పొత్తు ఉండబోదని తెలిపింది. మొత్తానికి ఢిల్లీలో త్రిముఖ పోరు ఉండబోతున్నట్లు తెలుస్తోంది.
తాజావార్తలు
-
KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
-
PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
-
Ragi Mixture: సాయంత్రం స్నాక్స్లోకి క్రిస్పీ ‘రాగి మిక్సర్’.. సింపుల్గా హెల్తీగా ఇంట్లోనే ఇలా చేసుకోండి!
-
Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
-
Donald Trump: అమెరికా అధ్యక్షుడికి షాక్.. రూల్స్ బ్రేక్ చేశారంటూ ట్రంప్కు ఫైన్ వేసిన అధికారులు! అసలేం జరిగిందంటే..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..