Election Campaigning Ban: ఆ గ్రామంలో అట్లుంటది మరి.. ప్రచారంపై నిషేధం.. ఓటు వేయకపోతే ఫైన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏ ఎన్నికలైనా ప్రచారం హోరెత్తుతుంది.. ఇక, ప్రచారం తర్వాత ప్రలోభాల పర్వం కూడా జోరుగా సాగుతోంది.. మాకు ఓటు వేస్తే ఇంత ఇస్తాం.. ఈ పనులు చేసిపెడతాం అనే వాళ్లు చాలా మందే మోపయ్యారు.. అయితే, వీటికి దూరంగా ఉంటుంది ఓ గ్రామంలో.. అంటే ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉంటున్నారంటే.. ఓట్లను కూడా బహిష్కరించారా? ఏంటి? అనే అనుమానం రావొచ్చు.. అయితే, వీరు ఎన్నికల ప్రచారానికి మాత్రమే వ్యతిరేకంగా.. అందరూ ఓటు వేయాల్సిందే.. ఒకవేళ ఓటు వేయకపోతే ఆ గ్రామంలో ఫైన్ కట్టాల్సి ఉంటుంది.. స్వాతంత్ర్య భారతంలో ఇంత చైతన్యం కలిగిన గ్రామం ఎక్కడుంది అనే వివరాల్లోకి వెళ్తే..
Read Also: Action on SI and Constable: డయల్ 100 కాల్పై నిర్లక్ష్యం.. ఎస్ఐ, కానిస్టేబుల్పై వేటు
Also Read
- Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
- Rahul Gandhi: 'ప్రభుత్వాన్ని తొలగించండి' అని పోలీసులు నా చెవిలో చెప్పారు: రాహుల్ గాంధీ
- Niti Aayog: నీతి ఆయోగ్ కొత్త సీఈవోగా అనురాగ్ జైన్ నియామకం.. కేంద్రం ఉత్తర్వులు
- Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
గుజరాత్ రాష్ట్రంలోని రాజ్కోట్ జిల్లాలో రాజ్ సమధియాల అనే గ్రామం ఉంది.. ఇక్క ఏ ఎన్నికలు వచ్చినా రాజకీయ పార్టీల ప్రచారంపై నిషేధం విధించారు… ఇదేదో ఇప్పుడే తీసుకున్న నిర్ణయం కాదండోయ్.. 1983 నుంచి దీనిని అమలు చేస్తూ వస్తున్నారు.. అంటే, ఎన్నికలు వచ్చాయంటే ప్రచారం.. ఆరోపణలు, విమర్శలు, హంగామా ఏదీ ఆ గ్రామంలో కనిపించదు.. అలాగనే ఓటు వేయడానికే ఆ గ్రామం దూరంగా ఉంటుందా? అంటే అది పొరపాటే.. ఎందుకంటే.. ఆ గ్రామానికి చెందినవారు ఎవరైనా ఓటు వేయకపోతే రూ.51 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.. ఈ మొత్తాన్ని గ్రామ పంచాయతీ ఖాతాలో జమ చేస్తారన్నమాట.. అంటే, ఎన్నికలు వచ్చాయంటూ తప్పనిసరిగా గ్రామంలోని ఓటర్లు అంతా ఓటెయ్యాల్సిందే. దాదాపు 40 ఏళ్ల నుంచి ఈ నిబంధనలను పాటిస్తూ వస్తోంది ఆ గ్రామం..
మరో విచిత్రమైన విషయం ఏంటంటే.. ఆ ఊర్లో ఏ ఇంటికి తాళాలు కనిపించవు, ప్రజలెవరూ తమ ఇళ్లకు తాళాలు వేయరు.. అంతేకాదు.. ఏదైనా షాపు నిర్వహకుడు మధ్యాహ్నం భోజనానికి వెళ్లినా.. ఆ షాపు తీసే ఉంటుంది.. సదరు వినియోదారుడు తనకు కావాల్సిన వస్తువు తీసుకొని.. దానికి అయ్యే మొత్తాన్ని అక్కడ పెట్టి వెళ్తారట.. తాళాలు వేయకుండా ఉన్నా.. ఇప్పటివరకు తమ గ్రామంలో ఒక్క సారిమాత్రమే దొంగతనం జరిగిందని, అదికూడా మరిసటి రోజే ఆ దొంగ గ్రామాపంచాయతీ ముందు లొంగిపోయాడని చెబుతున్నారు ఆ గ్రామస్తులు.. ఇక, ప్రజల కోసం గ్రామపంచాయతి నిబంధనలు అమలుచేస్తున్నది. బహిరంగ ప్రదేశాల్లో చెత్త, ప్లాస్టిక్ పడేసినా, గుట్కా తిన్నా రూ.51 ఫైన్ కట్టాల్సి ఉంటుంది.. మద్యం సేవించినా, చెట్లను నరికినా, కొట్టివేసినా, పోలీసుకు ఫిర్యాదు చేయడం కానీ, కోర్టులో కేసు వేయడం చేసినా.. మూఢనమ్మకాలను ప్రోత్సహించినా, బాణాసంచా కాల్చినా రూ.500 చెల్లించాల్సి ఉంటుంది.. భూములను ఆక్రమించడం, బహిరంగంగా ఎవరినైనా దూషించినా రూ.251 జరిమానా తప్పదు.. ఆ గ్రామంలో ఎక్కడ చూసినా బోర్డులు దర్శనమిస్తుంటాయి.. నిబంధనలను గుర్తుచేస్తుంటాయి.
తాజావార్తలు
-
Chiranjeevi: నా అభిమానులు ఎస్కేఎన్, సాయి రాజేష్లను చూసి గర్వపడుతున్నా..
-
Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
-
CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!