Uttar Pradesh: అన్నను చంపిన తమ్ముడు.. సహకరించిన తల్లి, చెల్లి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Crime news: రోజు రోజుకీ మనుషుల్లో మానవత్వం నశిస్తుంది. మానవ సంబంధాలు మరుగున పడుతున్నాయి. పైసా మే పరమాత్మ అన్నట్లు బ్రతుకుతున్నారు చాలామంది. ఆస్తికోసం సొంత వాళ్లని కూడా చూడకుండా.. రక్తసంబంధీకులను కడతెరుస్తున్నారు. గతంలో ఇలాంటి ఘటనలు ఎన్నో చోటు చేసుకున్నాయి. అన్నను చంపిన తమ్ముడు, తమ్ముడుని చంపిన అన్న, ఆస్తి కోసం కన్న తల్లిదండ్రులను చంపిన పిల్లలు ఇలా ఎన్నో వార్తలు వెలుగు చూసాయి. తాజాగా అలాంటి సంఘటనే ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకుంది. వివరాలలోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్ లోని మేరఠ్ జిల్లాలో అక్రమ్ అనే యువకుడు ఆస్తికోసం సొంత అన్ననే చంపాడు. అయితే చిన్న కొడుకు చేస్తుంది తప్పు అని చెప్పాల్సిన తల్లి, చెల్లి కూడా అతనికి సహకరించారు. అయితే షెహజాద్ ఆత్మహత్య చేసుకున్నాడని నిందితులే పోలీసులకి ఫిర్యాదు చేశారు. అయితే మరణించిన వ్యక్తి భార్య పిల్లలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విచారణ చెప్పట్టారు పోలీసులు.
Read also:Israel–Hamas war: హమాస్ ఆర్థిక మంత్రిని చంపిన ఇజ్రాయిల్ ఎయిర్ ఫోర్స్..
Also Read
- Sonu Sood: విద్యార్థుల నిరసనపై కంగనా వ్యాఖ్యలు సిగ్గుచేటు.. సోనూ సూద్ ఘాటు స్పందన
- Rahul Gandhi: నా మాటల్లో తప్పులేదు.. క్షమాపణ చెప్పను.. ‘ఇడియట్స్’ వ్యాఖ్యలపై రాహుల్గాంధీ క్లారిటీ
- LPG eKYC: ఎల్పీజీ కేవైసీ అప్డేట్ మెసేజ్ వచ్చిందా..? అయితే ఈ పొరపాటు అస్సలు చేయకండి..
- Rahul Gandhi: "అమిత్ షా పోలీసులతో మాట్లాడటం నేను చూశాను".. రాహుల్ గాంధీ సంచలన ఆరోపణ
దీనితో అసలు నిజాలు బయటకు వచ్చాయి. లోహియానా గర్ పోలీసు స్టేషన్ పరిధిలోని ఆషియాన కాలనీలో షెహ్ జాద్ అనే వస్త్ర వ్యాపారి నివసిస్తున్నాడు. అయితే కొని రోజులుగా అతనికి తన తమ్ముడికి మధ్య ఆస్తి తగాదాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి ఇంటికి వచ్చిన అన్నని మాట్లాడాలి అని ఓ గదిలోకి తీసుకెళ్లాడు అక్రమ్. వెంటనే రాడుతో అన్న చాతి పైన కొట్టాడు అనంతరం గొంతు నులిమి చంపేశారు. అయితే అక్రమ్ కు తల్లి, చెల్లి కూడా సహకరించారు. కాగా షెహజాద్ మృత దేహాన్ని ఫ్యాన్ కు ఉరివేసి ఆత్మహత్య గా చిత్రీకరించాలని ప్రయత్నించారు. వాళ్ళ వ్యూహం ఫలించలేదు. కాగా హత్య జరిగిన సమయంలో మృతుడి భార్య బిడ్డలు మేడపైన నిద్రిస్తున్నారు. భార్య బిడ్డల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులు వారిస్తున్న వినకుండా మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కాగా సోమవారం వచ్చిన పోస్టుమార్టం నివేదిక ఆధారంగా ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు పోలీసులు
తాజావార్తలు
-
AP Job Calendar 2026: ఏపీ జాబ్ క్యాలెండర్.. ఈసారి 10,660 ఉద్యోగాలు భర్తీ.. మంత్రి లోకేష్ కీలక ఆదేశాలు..
-
Telangana Police Jobs: నిరుద్యోగులకు శుభవార్త.. తెలంగాణ కానిస్టేబుల్, ఎస్సై ఉద్యోగ నోటిఫికేషన్స్ విడుదల..
-
Bhagyashri Borse: ‘ఆ విషయం చెబితే మా అమ్మ నన్ను వాట్సాప్లో బ్లాక్ చేసింది.. 6 నెలలు మాట్లాడలేదు’..
-
Sonu Sood: విద్యార్థుల నిరసనపై కంగనా వ్యాఖ్యలు సిగ్గుచేటు.. సోనూ సూద్ ఘాటు స్పందన
-
Chanakya Niti: బంధువులైనా సరే.. ఈ విషయాలు మాత్రం చెప్పొద్దంటున్న చాణక్యుడు! ఇంతకీ ఏ విషయాలో తెలుసా?
ట్రెండింగ్
-
Health Tips : వర్షాకాలంలో గొంతు నొప్పా? ఈ అల్లం-బెల్లం కషాయం ట్రై చేయండి.!
-
Protein Tips : పనీర్ తింటున్నారా? పచ్చిదా.. వండిందా.. ఏది బెస్ట్.?
-
7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో వచ్చేస్తున్న బడ్జెట్ ఫోన్ OnePlus N6x.!
-
AI ఫీచర్లు, Intel Core Ultra ప్రాసెసర్లతో Dell XPS 13, Dell 14S, Dell 16S, Alienware 15 ల్యాప్టాప్లు లాంచ్..!
-
Subhadeep Ghosh: టీమిండియా కొత్త కోచ్గా మాజీ క్రికెటర్.. ఎవరీ సుభదీప్ ఘోష్?.. అంత తోపా!