Eknath Shinde: డిప్యూటీ సీఎం పదవికి షిండే గ్రీన్సిగ్నల్.. రేపే ప్రమాణం
- డిప్యూటీ సీఎం పదవికి షిండే గ్రీన్సిగ్నల్
- గురువారం ప్రమాణం చేయనున్న షిండే
- అధికారికంగా ధృవీకరించిన శివసేన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహారాష్ట్ర రాజకీయాల్లో చోటుచేసుకున్న అనిశ్చితి ఎట్టకేలకు తొలగింది. నవంబర్ 23న వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో మహాయుతి (శివసేన, బీజేపీ, ఎన్సీపీ) కూటమి ఘన విజయం సాధించింది. కానీ వెంటనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయారు. డైలీ సీరియల్ లాగా దాదాపు 11 రోజుల పాటు సీఎం పోస్టుపై పంచాయితీ నడిచింది.
శివసేన ముఖ్యమంత్రి పదవిని ఆశించింది. అందుకు బీజేపీ నిరాకరించింది. బీజేపీకి 132 సీట్లు రాగా.. శివసేనకు కేవలం 57 సీట్లే వచ్చాయి. అయితే బీహార్ ఫార్ములా అమలు చేయాలని.. నితీష్ కుమార్ను సీఎంను చేసినట్లుగా షిండేను ముఖ్యమంత్రి సీటులో కూర్చోబెట్టాలని శివసేన డిమాండ్ చేసింది. ఇలా మహారాష్ట్ర పంచాయితీ రెండు వారాల పాటు సాగింది. మొత్తానికి బీజేపీ అధిష్టానం.. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీని రంగంలోకి దింపింది. చర్చోప చర్చల తర్వాత శివసేన మెత్తబడింది. బీజేపీ ప్రభుత్వంలో చేరేందుకు సిద్ధమైంది. అంతేకాకుండా దేవేంద్ర ఫఢ్నవిస్ ముఖ్యమంత్రిగా.. డిప్యూటీ సీఎంగా షిండే ప్రమాణం చేసేందుకు అంగీకారం తెలిపారు. దీంతో 11 రోజులుగా నెలకొన్న ప్రతిష్టంభనకు ఫుల్స్టాప్ పడింది. గురువారం ఆజాద్ మైదాన్లో దేవేంద్ర ఫఢ్నవిస్, షిండే, అజిత్ పవార్తో పాటు పలువురు కూటమి సభ్యులు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.
Also Read
- CM Revanth Reddy: చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచే రోజు ఇది.. జల వివాదాలకు శాశ్వత పరిష్కారం..!
- CM Vijay: ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన విజయ్.. ఫొటోలు వైరల్
- Ketan Agarwal Murder: యూట్యూబ్ సెర్చ్, కేఫ్లో మంతనాలు.. కేతన్, సియా కేసులో కీలక ఆధారాలు..
- DK Shivakumar: తుంగభద్ర వేదికగా నీటి ఐక్యత సందేశం ఇచ్చిన డీకే శివకుమార్
ఇది కూడా చదవండి: CM Revanth Reddy: పదేళ్లలో ఏం చేయకపోగా.. 10 నెలల మా పాలనపై విష ప్రచారం చేస్తున్నారు..
బుధవారం ఫడ్నవిస్ బీజేపీ శాసనసభాపక్ష నేతగా ఎన్నికయ్యారు. అనంతరం షిండే, అజిత్ పవార్తో కలిసి గవర్నర్ రాధాకృష్ణన్ను ఫడ్నవిస్ కలిశారు. ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని కోరారు. గురువారం సాయంత్రం 5:30 గంటలకు ఆజాద్ మైదాన్లో ప్రమాణస్వీకారం జరగనుంది. ప్రధాని మోడీ సహా కేంద్రమంత్రులు, ఎన్డీఏ ముఖ్యనేతలు హాజరుకానున్నారు.
కొత్త ప్రభుత్వంలో 7:7:7 నిష్పత్తిలో మూడు పార్టీలు మంత్రుల పదవులు పంచుకోనున్నట్లు తెలుస్తోంది. బీజేపీ నుంచి ఏడుగురు, శివసేన నుంచి ఏడుగురు, ఎన్సీపీ నుంచి ఏడుగురు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది. ఫడ్నవిస్ ముఖ్యమంత్రిగా.. షిండే, అజిత్ పవార్ డిప్యూటీ సీఎంలుగా ప్రమాణం చేయనున్నారు.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ -132, శివసేన-57, ఎన్సీపీ-41, కాంగ్రెస్-16, ఉద్ధవ్ థాక్రే-20, శరద్ పవార్-10 స్థానాలు గెలుచుకున్నాయి. కాంగ్రెస్ నేతృత్వంలోని మహా వికాస్ అఘాడి (ఎంవీఏ)కి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపించలేదు. ఈవీఎంల ట్యాంపరింగ్ వల్లే ఓడిపోయాం అంటూ కాంగ్రెస్ ఆరోపించింది.
ఇది కూడా చదవండి: CM Revanth Reddy: పదేళ్లలో ఏం చేయకపోగా.. 10 నెలల మా పాలనపై విష ప్రచారం చేస్తున్నారు..
తాజావార్తలు
-
Shehbaz Sharif: ఇరాన్ అధ్యక్షుడి టూర్లో పాక్ ప్రధాని వింత ప్రవర్తన.. నెట్టింట తీవ్ర విమర్శలు
-
PoK: పీఓకే ప్రజల్ని ఆకలితో చంపేస్తున్న పాకిస్తాన్..
-
Bunny Vas : తెలుగుమ్మాయని అవకాశం ఇస్తే.. మాకు 15 రూల్స్ పెట్టింది.
-
CM Revanth Reddy: చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచే రోజు ఇది.. జల వివాదాలకు శాశ్వత పరిష్కారం..!
-
Vaibhav Sooryavanshi: పక్కా ప్లాన్తో బరిలోకి వైభవ్ సూర్యవంశీ.. కాటేరమ్మ కొడుకు రికార్డుపైనే గురి..
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!