Eknath Shinde: మహారాష్ట్ర సీఎం సంచలన నిర్ణయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహారాష్ట్రలో కొత్తగా సీఎంగా బాధ్యతలు చేపట్టిన ఏక్ నాథ్ షిండే సంచలన నిర్ణయం తీసుకున్నారు. గతంలో తమిళనాడు సీఎం స్టాలిన్ తీసుకున్న తరహాలోనే తన కాన్వాయ్ కి ప్రత్యేక ప్రోటోకాల్ అవసరం లేదని ఆయన రాష్ట్ర పోలీసులకు ఆదేశాలిచ్చారు. వీఐపీల కన్నా సమాన్యుడికి ప్రాధాన్యత ఇవ్వాలని.. తన కాన్వాయ్ కోసం బందోబస్లు అవసరం లేదని మహారాష్ట్ర పోలీసులకు ఆదేశించారు. రాష్ట్ర డీజీపీ రజీనీష్ సేథ్, ముంబై పోలీస్ కమిషనర్ వివేక్ ఫన్సాల్కర్ తో చర్చించిన తర్వాత సీఎం ఏక్ నాథ్ షిండే ఈ నిర్ణయం తీసుకున్నారు. తన కాన్వాయ్ కు ఎలాంటి పోలీస్ బందోబస్త్ ఉండకూడని.. ఇది సామాన్యుల కష్టాలను, సమస్యలను తెలుసుకోవడంలో జాప్యం చేస్తుందని సీఎం ఏక్ నాథ్ షిండే అన్నారని ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంఓ) ఓ ప్రకటనలో వెల్లడించింది.
Read Also: Gurpreet Kaur: పెళ్లయిన తర్వాత రోజే సీఎం భార్య ట్విట్టర్ ఖాతా బ్లాక్.. ఎందుకంటే..
Also Read
- Train: మరీ చీఫ్గా దుప్పట్లు చోరీ.. కోచ్ అటెండెంట్లు గగ్గోలు.. ఎందుకంటే..!
- Supreme Court: ప్రేమికుల్ని నిలువరించడం సాధ్యమా? పోక్సో దుర్వినియోగంపై సుప్రీంకోర్టు చీవాట్లు
- India-US: అమెరికాతో ఒప్పందం వద్దనుకుంటున్నట్లు కథనాలు.. పీయూష్ గోయల్ క్లారిటీ
- Bengaluru: ప్రేమికుడిని పెళ్లాడిన 4 నెలలకే ఉపాధ్యాయురాలు ఆత్మహత్య.. సూసైడ్ నోట్లో ఏం రాసిందంటే..!
ఇది సామాన్యుల ప్రభుత్వం కాబట్టి వారికి వీఐపీల కన్నా ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని.. షిండే అన్నారు. ప్రత్యేక ప్రోటోకాల్ వల్ల ట్రాఫిక్ సమస్యలు ఏర్పడుతున్నాయని.. ప్రజల దినచర్యకు అంతరాయం కలుగుతుందని.. ఇది పోలీసులపై భారం పడేలా చేస్తుందని ఆయన అన్నారు. శివసేనలో మెజారిటీ ఎమ్మెల్యేలు ఏక్ నాథ్ షిండేకు మద్దతు తెలపడంతో బీజేపీ సహకారంలో ఏక్ నాథ్ షిండే మహారాష్ట్ర సీఎం పదవిని అధిష్టించారు. తాజాగా థానే, నవీ ముంబై, కళ్యాణ్ డోంబివాలి నగరాల కార్పొరేటర్లు సీఎం ఏక్ నాథ్ షిండేకు వర్గానికి మద్దతు తెలిపారు. 122 మంది కార్పొరేటర్లు ఉన్న కళ్యాణ్ డోంబివాలి మున్సిపల్ కార్పొరేషన్ లో 84 మంది శివసేన కార్పొరేటర్లు ఉంటే 40 మంది,111 మంది ఉన్న నవీ ముంబై కార్పొరేషన్ లో 38 మంది శివసేన కార్పొరేటర్లలో 32 మంది షిండేకు మద్దతు తెలిపారు. థానే మున్సిపల్ కార్పొరేషన్ లో 67 మంది శివసేన కార్పొరేటర్లలో 66 మంది షిండే వర్గానికి మద్దతు తెలిపారు.
తాజావార్తలు
-
Fake Shopping Offers : రూ.999 ఆఫర్.. ఖాతా ఖాళీ.! సైబర్ మోసగాళ్ల కొత్త ట్రిక్
-
OTR: కలెక్టర్ vs పోలీస్?.. పెద్దపల్లిలో హాట్ టాపిక్గా మారిన రివ్యూ మీటింగ్
-
OTR: ఎమ్మెల్యే మాధవి వైఖరి మిగతా ఎమ్మెల్యేలకు ఇబ్బందిగా మారిందా?
-
Train: మరీ చీఫ్గా దుప్పట్లు చోరీ.. కోచ్ అటెండెంట్లు గగ్గోలు.. ఎందుకంటే..!
-
ITR Filing: కొత్త ట్యాక్స్ విధానమే బెస్ట్? పాత విధానం ఎవరికి లాభం.. నిపుణులు ఏం చెబుతున్నారంటే?
ట్రెండింగ్
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!
-
BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!