Eknath Shinde: మహారాష్ట్ర సీఎం సంచలన నిర్ణయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహారాష్ట్రలో కొత్తగా సీఎంగా బాధ్యతలు చేపట్టిన ఏక్ నాథ్ షిండే సంచలన నిర్ణయం తీసుకున్నారు. గతంలో తమిళనాడు సీఎం స్టాలిన్ తీసుకున్న తరహాలోనే తన కాన్వాయ్ కి ప్రత్యేక ప్రోటోకాల్ అవసరం లేదని ఆయన రాష్ట్ర పోలీసులకు ఆదేశాలిచ్చారు. వీఐపీల కన్నా సమాన్యుడికి ప్రాధాన్యత ఇవ్వాలని.. తన కాన్వాయ్ కోసం బందోబస్లు అవసరం లేదని మహారాష్ట్ర పోలీసులకు ఆదేశించారు. రాష్ట్ర డీజీపీ రజీనీష్ సేథ్, ముంబై పోలీస్ కమిషనర్ వివేక్ ఫన్సాల్కర్ తో చర్చించిన తర్వాత సీఎం ఏక్ నాథ్ షిండే ఈ నిర్ణయం తీసుకున్నారు. తన కాన్వాయ్ కు ఎలాంటి పోలీస్ బందోబస్త్ ఉండకూడని.. ఇది సామాన్యుల కష్టాలను, సమస్యలను తెలుసుకోవడంలో జాప్యం చేస్తుందని సీఎం ఏక్ నాథ్ షిండే అన్నారని ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంఓ) ఓ ప్రకటనలో వెల్లడించింది.
Read Also: Gurpreet Kaur: పెళ్లయిన తర్వాత రోజే సీఎం భార్య ట్విట్టర్ ఖాతా బ్లాక్.. ఎందుకంటే..
Also Read
- Forbes Survey: ఆఫీస్ 'ప్రేమాయణం'.. 40 శాతం మంది తమ భాగస్వామిని మోసం చేస్తున్నారట! షాకింగ్ గణాంకాలు
- Vijay-Trisha: "గుసగుసలాడే వారికి ఇదే నా సమాధానం".. విజయ్తో అఫైర్ వార్తలపై త్రిష ఘాటు స్పందన!
- Tamil Nadu politics: తమిళనాడు రాజకీయాల్లో కొత్త ట్విస్ట్.. నకిలీ మద్దతు లేఖ వివాదం..! గవర్నర్, పీఎస్లో ఫిర్యాదు..
- Suvendu Adhikari: నేడే సువేందు ప్రమాణ స్వీకారం.. దీదీని గద్దె దించిన బెంగాల్ బాద్షా గురించి ఆసక్తికర విషయాలు..
ఇది సామాన్యుల ప్రభుత్వం కాబట్టి వారికి వీఐపీల కన్నా ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని.. షిండే అన్నారు. ప్రత్యేక ప్రోటోకాల్ వల్ల ట్రాఫిక్ సమస్యలు ఏర్పడుతున్నాయని.. ప్రజల దినచర్యకు అంతరాయం కలుగుతుందని.. ఇది పోలీసులపై భారం పడేలా చేస్తుందని ఆయన అన్నారు. శివసేనలో మెజారిటీ ఎమ్మెల్యేలు ఏక్ నాథ్ షిండేకు మద్దతు తెలపడంతో బీజేపీ సహకారంలో ఏక్ నాథ్ షిండే మహారాష్ట్ర సీఎం పదవిని అధిష్టించారు. తాజాగా థానే, నవీ ముంబై, కళ్యాణ్ డోంబివాలి నగరాల కార్పొరేటర్లు సీఎం ఏక్ నాథ్ షిండేకు వర్గానికి మద్దతు తెలిపారు. 122 మంది కార్పొరేటర్లు ఉన్న కళ్యాణ్ డోంబివాలి మున్సిపల్ కార్పొరేషన్ లో 84 మంది శివసేన కార్పొరేటర్లు ఉంటే 40 మంది,111 మంది ఉన్న నవీ ముంబై కార్పొరేషన్ లో 38 మంది శివసేన కార్పొరేటర్లలో 32 మంది షిండేకు మద్దతు తెలిపారు. థానే మున్సిపల్ కార్పొరేషన్ లో 67 మంది శివసేన కార్పొరేటర్లలో 66 మంది షిండే వర్గానికి మద్దతు తెలిపారు.
తాజావార్తలు
-
Rowdy Janardhana: విజయ్ బర్త్డే స్పెషల్..‘రౌడీ జనార్ధన’ నుండి రొమాంటిక్ పోస్టర్ రిలీజ్..
-
Kadai Roti Recipe: ఎప్పుడైనా కడాయి రోటీ రుచి చూశారా..? ఇంట్లోనే సింపుల్గా తయారుచేసుకోండి!
-
Forbes Survey: ఆఫీస్ ‘ప్రేమాయణం’.. 40 శాతం మంది తమ భాగస్వామిని మోసం చేస్తున్నారట! షాకింగ్ గణాంకాలు
-
KKR Playoffs Scenario: అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తున్న కేకేఆర్.. ప్లేఆఫ్స్ సమీకరణాలు ఇవే!
-
Ameesha Patel: పీఆర్ టీమ్స్కు డబ్బులిస్తే స్టార్లు అయిపోరు..అమీషా పటేల్ మాస్ వార్నింగ్!