Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Ec Clarity On Special Intensive Revision Survey In Bihar Assembly Elections

Bihar Elections: నకిలీ ఓట్లనే తొలగిస్తున్నాం.. నిరసనలపై ఈసీ క్లారిటీ

Published Date :July 24, 2025 , 11:44 am
By Suresh Maddala
  • నకిలీ ఓట్లనే తొలగిస్తున్నాం
  • నిరసనలపై ఈసీ క్లారిటీ
Bihar Elections: నకిలీ ఓట్లనే తొలగిస్తున్నాం.. నిరసనలపై ఈసీ క్లారిటీ
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

బీహార్ అసెంబ్లీ ఎన్నికల ముందు ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) సర్వే దేశాన్ని కుదిపేస్తోంది. అటు పార్లమెంట్‌లోనూ.. ఇటు బీహార్ అసెంబ్లీలోనూ ఆందోళనలు, నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఇక ప్రతిపక్ష నేత తేజస్వి యాదవ్ అయితే ఒక అడుగు ముందుకేసి.. తక్షణమే సర్వే గనుక ఆపకపోతే ఎన్నికలు బహిష్కరిస్తామంటూ బెదిరింపులకు దిగారు. ఇక సోమవారం పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమై నాలుగు రోజులైంది. కానీ పట్టుమని 10 నిమిషాలు కూడా సభ నడవలేదు. ఉభయ సభల్లో ఓటర్ సర్వేపై విపక్షాలు తీవ్ర స్థాయిలో ఆందోళనలు చేపట్టడంతో వరుస వాయిదాల పర్వం కొనసాగుతోంది.

ఇది కూడా చదవండి: Air Asia Flight: గాల్లో ఉండగా ఘర్షణ.. ప్రయాణికుడ్ని చితకబాదిన లేడీ గ్రూప్

Also Read

  • PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..
  • Tamil Politics: విజయ్‌పై మొదలైన డీఎంకే విమర్శలు.. ఏం జరిగిందంటే..?
  • PM Modi: మే 15 లోపు పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగొచ్చా.. మోడీ వ్యాఖ్యల ఆంతర్యం ఏమిటి.?
  • CM Vijay Simplicity: దటీజ్ దళపతి.. సీఎం హోదాలో ఉన్నా.. టేబుల్ మోసి సింప్లిసిటీ చాటుకున్న విజయ్!
Add as a preferred
source on google

ఓటర్ సర్వేపై ఆందోళనలు, నిరసనలు తీవ్ర అవ్వడంతో తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ స్పందించారు. నకిలీ ఓట్లను ఎలా అనుమతిస్తామంటూ ప్రశ్నించారు. ఓటర్లను తొలగిస్తు్న్నారంటూ వస్తున్న వార్తలను తోసిపుచ్చారు. కేవలం నకిలీ ఓట్లను మాత్రం తొలగిస్తున్నట్లు చెప్పారు.

ఇది కూడా చదవండి: Jaggery: రాత్రిపూట బెల్లం తింటే ఎన్ని ప్రయోజనాలో..!

భారత రాజ్యాంగం భారత ప్రజాస్వామ్యానికి తల్లిలాంటిది అని అన్నారు. ఎన్నికల కమిషన్ వ్యక్తులచే తప్పుదారి పట్టదన్నారు. చనిపోయిన ఓటర్లు, వలస వచ్చిన ఓటర్లు, రెండు చోట్ల ఓట్లు కలిగి ఉన్న వారు. నకిలీ ఓట్లను, విదేశీ ఓటర్లను మాత్రమే తొలగిస్తున్నట్లు చెప్పారు. తొలుత బీహార్‌లో ఈ సర్వే చేపట్టామని.. అనంతరం దేశమంతా నకిలీ ఓట్లను తొలగిస్తామని జ్ఞానేష్ కుమార్ స్పష్టం చేశారు.

బుధవారం ఎన్నికల సంఘం విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. బీహార్ ఓటర్ల జాబితా నుంచి 56 లక్షల పేర్లను తొలగించడానికి గుర్తించారు. 56 లక్షల పేర్లలో 20 లక్షల మంది చనిపోయిన ఓటర్లు, 28 లక్షల మంది శాశ్వతంగా వేరే రాష్ట్రానికి వెళ్లినవారు. ఒకటి కంటే ఎక్కువ ప్రదేశాలలో నమోదు చేసుకున్న 7 లక్షల మంది వ్యక్తులు. 1 లక్ష మంది సంప్రదించలేని ఓటర్లు ఉన్నారని పేర్కొంది. 15 లక్షల మంది ఓటర్ ధృవీకరణ ఫారాలు ఇవ్వలేని వారు ఉన్నారని తెలిపింది. వీళ్లంతా తుది జాబితా నుంచి తొలగింపబడతారని సంకేతం ఇచ్చింది.

ఇక ఓటర్ సర్వేపై దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు విచారిస్తోంది. తుది జాబితా సమయానికి అన్ని సంక్రమంగా చూసుకోవాలని ఈసీకి సూచించింది. ఇక సవరణ ప్రక్రియలో ఆధార్, ఓటర్ ఐడీ పత్రాలను ఎందుకు తీసుకోవడం లేదని ఈసీకి సుప్రీం ధర్మాసనం అడిగింది. ఇక సెప్టెంబర్‌లో ఈసీ తుది జాబితా విడుదల చేసే అవకాశం ఉంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Bihar Assembly Elections
  • congress
  • Election Commission clarity
  • RJD
  • Special Intensive Revision Survey

తాజావార్తలు

  • Rajinikanth-Kamal Haasan: రజనీ-కమల్ మెగా మల్టీస్టారర్‌లో త్రిష..

  • 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లే, యాక్టివ్ కూలింగ్‌తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!

  • Drishyam3 : దృశ్యం -3 తెలుగు రీమేక్ నుండి తప్పుకున్న వెంకీ.. డబ్బింగ్ వర్షన్ రిలీజ్ కు రెడీ

  • Tim David: ఎందుకు బ్రో అంత కోపం.. RCB విజయంతో టిమ్ డేవిడ్ ఆ వేళ్లు చూపిస్తూ.!

  • Trisha: త్రిషను ‘పరాన్నజీవి’తో పోల్చుతూ..సింగర్ సుచిత్ర సంచలన వ్యాఖ్యలు..

ట్రెండింగ్‌

  • PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..

  • Kathmandu: రన్‌వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?

  • Viral Road Accident: అరె బాబు.. బైకును అక్కడ ఎలా పార్క్ చేశావయ్యా.!

  • Forbes Survey: ఆఫీస్ ‘ప్రేమాయణం’.. 40 శాతం మంది తమ భాగస్వామిని మోసం చేస్తున్నారట! షాకింగ్ గణాంకాలు

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions