Gujarat: రైల్వే ట్రాక్పై సింహాలు.. ట్రైన్ ఆపి రక్షించిన లోకో పైలట్
- రైల్వే ట్రాక్పై పడుకున్న సింహాలు
- అప్రమత్తతో ట్రైన్ ఆపిన లోక్ పైలట్
- ట్రాక్ పై నిద్రిస్తున్న 10 సింహాలు
- సింహాల ప్రాణాలు రక్షించిన లోకో పైలట్ పై ప్రశంసలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రైల్వే ట్రాక్పై పడుకున్న సింహాలను చూసి లోక్ పైలట్ అప్రమత్తతో ట్రైన్ ఆపి వాటి ప్రాణాలను కాపాడాడు. దాదాపు 10 సింహాలు ట్రాక్ పై నిద్రిస్తుండగా.. అది చూసిన లోకో పైలట్ సడన్ గా బ్రేకులు వేశాడు. దీంతో వాటి ప్రాణాలను రక్షించాడు. ఈ ఘటన సోమవారం తెల్లవారుజామున గుజరాత్లోని పిపావావ్ పోర్ట్ సమీపంలో జరిగింది. లోకో పైలట్ ముఖేష్ కుమార్ మీనా గూడ్స్ రైలును పిపావావ్ పోర్ట్ స్టేషన్ నుండి ప్రధాన కారిడార్ పక్కన ఒక చిన్న ట్రాక్ పై వస్తున్నాడు. అయితే.. “ట్రాక్లపై విశ్రాంతి తీసుకుంటున్న 10 సింహాలను గుర్తించిన వెంటనే మీనా ఎమర్జెన్సీ బ్రేకులు వేసి రైలును ఆపాడు. అంతేకాకుండా.. సింహాలు లేచి పట్టాలపై నుంచి వెళ్లే వరకు వేచి ఉండి.. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అయితే.. లోకో పైలట్ చేసిన ఈ పనిపై పలువురు అధికారులు ప్రశంసిస్తున్నారు.
Kishan Reddy : జమ్మూ & కాశ్మీర్కు బీజేపీ ఇంచార్జ్ గా కిషన్ రెడ్డి..
Also Read
- Bengal's Next CM: బెంగాల్లో మే 9న బీజేపీ ప్రభుత్వం.. సువేందుకే సీఎంగా ఛాన్స్..
- Vijay-Governor: కాసేపట్లో గవర్నర్ను కలవనున్న విజయ్
- Bangladesh: బెంగాల్లో బీజేపీ గెలుపుతో సంతోషంలో బంగ్లాదేశ్ ప్రధాని.. కారణం ఇదే..
- Congress TVK Alliance: మారిపోయిన తమిళ అధికార పక్షం మ్యాప్.. టీవీకే క్లీన్ స్వీప్.. డీఎంకే-కాంగ్రెస్ దోస్తీకి 'ది ఎండ్'?
కాగా.. సింహాలతో సహా వన్యప్రాణుల భద్రత కోసం భావ్నగర్ డివిజన్ అనేక చర్యలు చేపడుతుంది. ఈ మార్గంలో వెళ్లే.. లోకో పైలట్లు అప్రమత్తంగా ఉంటారు.. అంతేకాకుండా.. నిర్దేశించిన వేగ పరిమితి ప్రకారం రైళ్లను నడుపుతారని రైల్వే అధికారులు తెలిపారు. కాగా.. ఈ రైలు మార్గంలో గత కొన్నేళ్లుగా అనేక సింహాలు చనిపోయాయి. అభయారణ్యం చాలా దూరంలో ఉన్నప్పటికీ, ఈ ప్రాంతంలో పులులు తిరుగుతాయని అధికారులు తెలిపారు.
Payyavula Keshav: రాష్ట్రానికి మంత్రి అయినా జిల్లాకు కూలీగా పని చేస్తా..
మరోవైపు.. సింహాలను రైళ్లు ఢీకొట్టకుండా కాపాడేందుకు రాష్ట్ర అటవీ శాఖ నిర్ణీత వ్యవధిలో ట్రాక్పై కంచెలను ఏర్పాటు చేసింది. ఇటీవలి కాలంలో.. గుజరాత్ హైకోర్టు, అసహజ కారణాల వల్ల ఆసియాటిక్ సింహాలు మృతి చెందడంపై దాఖలైన స్వయంప్రతిపత్తి పిల్ను విచారిస్తూ.. రైళ్లలో సింహాలు ఢీకొనకుండా కాపాడేందుకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం, రైల్వే శాఖను కోరింది. కాగా.. 2020 జూన్ లో నిర్వహించిన సింహాల సంఖ్య.. గుజరాత్ లో 674 సింహాలు ఉన్నట్లు తెలిపింది.
తాజావార్తలు
-
Bengal’s Next CM: బెంగాల్లో మే 9న బీజేపీ ప్రభుత్వం.. సువేందుకే సీఎంగా ఛాన్స్..
-
Peddi: కథ విన్నాక 25 నిమిషాల పాటు తేరుకోలేకపోయా!
-
Vijay-Governor: కాసేపట్లో గవర్నర్ను కలవనున్న విజయ్
-
Bangladesh: బెంగాల్లో బీజేపీ గెలుపుతో సంతోషంలో బంగ్లాదేశ్ ప్రధాని.. కారణం ఇదే..
-
Congress TVK Alliance: మారిపోయిన తమిళ అధికార పక్షం మ్యాప్.. టీవీకే క్లీన్ స్వీప్.. డీఎంకే-కాంగ్రెస్ దోస్తీకి ‘ది ఎండ్’?
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!