G20 Summit: జీ20లో చైనా సిబ్బంది ఓవర్ యాక్షన్.. బ్యాగులు చెక్ చేసేందుకు నిరాకరణ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
G20 Summit: ప్రపంచం ఆశ్చర్యపోయేలా భారతదేశం జీ20 సదస్పును నిర్వహించింది. బైడెన్, రిషి సునాక్, మక్రాన్ వంటి దేశాధినేతలు న్యూఢిల్లీకి వచ్చారు. ఈ సమావేశాల్లో భారత్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచింది. ప్రపంచ దేశాధినేతలకు మరిచిపోలేని విధంగా ఆతిథ్యం ఇచ్చింది. ఇదిలా ఉంటే చైనా అధికారులు మాత్రం ఓవర్ యాక్షన్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. చైనా డేలిగేట్స్ బ్యాగులను చెక్ చేసేందుకు అనుమతి ఇవ్వలేదని తెలుస్తోంది.
గత వారం జీ20 సమ్మిట్ కోసం చైనా ప్రతినిధి బృందం వచ్చింది. ఢిల్లీలోని ఓ స్టార్ హోటల్ లో వీరికి బస ఏర్పాటు చేశారు. అయితే హోటల్ లో వీరి బ్యాగులను భద్రతా సిబ్బంది తనిఖీ చేసేందుకు అనుమతి ఇవ్వకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఢిల్లీ చాణక్యపురిలో ఉన్న తాజ్ ప్యాలెస్ హోటల్ లో చైనా ప్రతినిధి బృందం బస చేసింది. ఈ ప్రతినిధి బృందం హోటల్ కి ఓ బ్యాగును తీసుసువచ్చింది. ఈ బ్యాగును తనిఖీ చేసేందుకు భద్రతా సిబ్బంది కోరగా.. ఇందుకు వారు నిరాకరించారని పోలీసులు తెలిపారు. భద్రతా నియమావళి ప్రకారం బ్యాగ్ను తనిఖీ చేయాలని పోలీసులు పదేపదే పట్టుబట్టినప్పటికీ చైనా ప్రతినిధులు చలించకపోవడంతో గందరగోళం చెలరేగింది.
Also Read
- Bharat Taxi Launch: ఓలా, ఉబర్లకు చెక్.. రంగంలోకి కేంద్ర ప్రభుత్వ ‘భారత్ టాక్సీ’.. అమిత్ షా మెగా ప్లాన్!
- PM Modi: సీషెల్స్లో మోడీ పర్యటన.. వృక్ష ఉద్యానవనం సందర్శన
- NCERT: 9వ తరగతి సిలబస్లో భారీ మార్పు.. ఫ్రెంచ్, రష్యా విప్లవాలు తొలగింపు..
- Gold Scam : ‘గోల్డ్ మ్యాన్’ గేమ్ ఓవర్.. రూ.30 లక్షల గోల్డ్ స్కామ్.!
Read Also: Live-In Relation: లివ్-ఇన్ రిలేషన్లో మరో హత్య.. నిందితుడికి సాయం చేసిన భార్య..
చివరకు ప్రతినిధి బృందం బ్యాగ్ ని తనిఖీ చేయకుండానే చైనా రాయబార కార్యాలయానికి తిరిగి వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు పోలీసులు తెలిపారు. బ్యాగులో ఏముందనే వివరాలు తెలియరాలేదు. ఈ పరిణామం తరువాత మరికొంత మంది చైనా ప్రతినిధులు హోటల్ చేరుకున్నారని, ఆ సమయంలో వారి బ్యాగులు చెక్ చేసేందుకు అభ్యంతరం తెలపలేదని పోలీసులు వెల్లడించారు.
న్యూఢిల్లీలో జరిగిన జీ20 సమావేశానికి సభ్యదేశాలతో పాటు ఆహ్వానిత దేశాల అధినేతలు వచ్చారు. అయితే రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ హాజరుకాలేదు. జిన్ పింగ్ స్థానంలో ఆ దేశ ప్రీమియర్ లీ కియాంగ్ హాజరవ్వగా.. పుతిన్ స్థానంలో రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ సమావేశానికి హాజరయ్యారు. ఉక్రెయిన్-రష్యా యుద్ధ నేపథ్యంలో పుతిన్ దేశాన్ని విడవడం లేదు. ఏ సమావేశానికైనా సెర్గీ లావ్రోవ్ హాజరవుతున్నారు. అయితే చైనా అధ్యక్షుడు రాకపోవడానికి మాత్రం స్పష్టమైన కారణాలు తెలియరాలేదు.
- Tags
- china
- G20 Summit
- india
- Putin
- Xi Jinping
తాజావార్తలు
-
Story Board : పాస్ పోర్ట్ కేవలం ప్రయాణ పత్రమేనా..? ఇప్పుడు కేంద్రం వాదనేంటి..?
-
OTR: ధర్మవరం రాజకీయాల్లో హీట్… మంత్రి సత్యకుమార్ వ్యూహం మారిందా?
-
OTR : SIR రూల్తో ఓటర్లలో గందరగోళం – ఏ గట్టు ఎంచుకోవాలి?
-
OTR: మంత్రాలయం కోటను బద్దలు కొట్టేందుకు టీడీపీ మాస్టర్ ప్లాన్?
-
YS Jagan : ఏపీలో నడుస్తోంది గూండాల రాజ్యమా?.. చంద్రబాబుపై వైఎస్ జగన్ ఫైర్..
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!