Dhirendra Shastri: “ఓవైసీలో ఆ భయం ఉండాలి”.. భాగేశ్వర్ ధామ్ పీఠాధిపతి కామెంట్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dhirendra Shastri: రామాలయ ప్రారంభోత్సవం సమీపిస్తున్న తరుణంలో, కేంద్రం చేస్తున్న కార్యక్రమాలపై ముస్లిం యువత అప్రమత్తంగా ఉండాలని ఇటీవల ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. అయితే ఈ వ్యాఖ్యలపై భాగేశ్వర్ ధామ్ పీఠాధిపతి ధీరేంద్ర శాస్త్రి శుక్రవారం స్పందించారు. ‘‘ఇది అతడి భయాన్ని తెలియజేస్తోందని, మేము మసీదులపై మందిరాలను నిర్మించడం లేదని, దేవాలయాలను పునర్నిర్మించాలని అనుకుంటున్నామని, అతడికి ఈ భయం ఉంటే, ఆ భయంతోనే ఉండాలని నేను ప్రార్థిస్తున్నాను’’ అంటూ ఓవైసీని ఉద్దేశిస్తూ అన్నారు.
ఇటీవల బాబ్రీ మసీదు గురించి ప్రస్తావిస్తూ.. గత 500 ఏళ్లుగా పవిత్ర ఖురాన్ పఠించిన స్థలం ఇప్పుడు తమ చేతుల్లో లేదని, యువకులారా మనం, మన మసీదును కోల్పోయాము, మీకు బాధగా లేదా..? అని భవానీ నగర్లో జరిగిన ఓ కార్యక్రమంలో ఓవైసీ వ్యాఖ్యానించారు. మరో మూడు నాలుగు మసీదుల గురించి కుట్ర జరుగుతోందని ఆరోపించారు. ముస్లిం యువకులు అప్రమత్తంగా, ఐక్యంగా ఉండాలని ఆయన పేర్కొన్నారు.
Also Read
- Swine Flu H1N1 in India: H1N1 కొత్త వేరియంట్ వచ్చిందా? కరోనా లాంటి ముప్పు ఉందా? ICMR కీలక సమాచారం
- Kangana Ranaut: ‘వాళ్లంతా పనికిమాలిన వాళ్లు’.. తాప్సీ, బాబా రామ్దేవ్పై కంగనా ఘాటు వ్యాఖ్యలు
- CJP: ఢిల్లీలో సెప్టెంబర్ 5న భారీ నిరసన మార్చ్.. మరోసారి ఆందోళనకు సిద్ధమైన విద్యార్థులు
- Tamil Nadu: తీవ్ర దుమారం రేపుతోన్న పొట్టి దుస్తుల వ్యవహారం.. మంత్రి కీర్తన ఘాటు స్పందన
Read Also: MLA MS Babu: ఎమ్మెల్యే యూటర్న్..! ఓపిక ఉన్నంత వరకు కాదు.. ఊపిరి ఉన్నంత వరకు వైసీపీతోనే..!
ఈ వ్యాఖ్యలపై మాట్లాడిని ధీరేంద్ర శాస్త్రీ.. శ్రీరాముడు రాజకీయ అంశం కాదని, దీన్ని రాజకీయ చేయడం మూర్ఖత్వం అని అన్నారు. రాజకీయాలు మతం ద్వారా నడుస్తాయి, రాజకీయాల ద్వారా మతం నడవదని, దేశ ప్రజలు మేల్కొనే ఉన్నారని, ప్రతీది చూడగలరని, జాతీయ ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకుని ఓటేయండి, రాముడికి గౌరవం, ఐక్యత, శాంతి అనే సొంత విధానం ఉందని, దీన్ని రాజకీయం చేయవద్దని ప్రతిపక్షాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
రామ మందిరాన్ని కులతత్వం కోసం నిర్మించడం లేదని, రామభక్తుల విశ్వాసం కోసం నిర్మిస్తున్నారని అన్నారు. రాముడు అందరికి చెందిన వాడు అని అన్నారు. మరో రెండు మసీదు వివాదాల గురించి స్పందించిన ధీరేంద్ర శాస్త్రీ..జ్ఞానవాపిలో శివుడు, కృష్ణజన్మభూమిలో శ్రీ కృష్ణుడు ఉన్నాడని అన్నారు. ఈ విషయాల్లో ఎవరి అభిప్రాయం అవసరం లేదని, చట్టం, భారత సుప్రీంకోర్టు ఉన్నాయని, అక్బర్, బాబర్ గతంలో మన దేవాలయాలపై దాడి చేశారని అన్నారు. దీపావళి పండగ కంటే ఈ కార్యక్రయం చాలా ప్రత్యేకమైందని అన్నారు.
తాజావార్తలు
-
NIA Raids : ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్.. రామగుండంలో NIA మెరుపు దాడులు
-
Off The Record: ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలకు కేటీఆర్ వార్నింగ్..?
-
AP Liquor Scam Case: కారుమూరి అరెస్ట్పై ఈడీ కీలక ప్రకటన
-
Chairmans Desk : కాంగ్రెస్లో పాతకథ పునరావృతమౌతోందా.. రేవంత్ తక్షణ కర్తవ్యమేంటి..?
-
OTR: ప్రభాకర్ చౌదరి ఆరోపణలకు స్పందించని ఎమ్మెల్యే దగ్గుబాటి.. కారణం ఇదేనా..?
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్ఫోన్ కొనేముందు ఈ వాటర్ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!