Basavaraj Bommai: విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం వద్దు: మాజీ సీఎం బసవరాజ్ బొమ్మై
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Basavaraj Bommai: కర్ణాటక రాష్ట్రంలో నూతన విద్యా విధానం అమలుపై రగడ కొనసాగుతోంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలో నూతన విద్యా విధానం రద్దు చేస్తామని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రకటించారు. ఈ నిర్ణయంపై మాజీ ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడొద్దని మాజీ ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై సూచించారు. విద్యార్థుల భవిష్యత్తో రాజకీయాలు చేయోద్దని సూచించారు. ప్రధాని మోడీ సర్కారుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని.. దీనిపై విద్యార్థులు తిరుగుబాటు చేస్తారని బొమ్మై హెచ్చరించారు. ‘‘విద్యావిధాన పాలసీలో చిన్న మార్పులు చేస్తే ఫర్వాలేదు కానీ.. సీఎం సిద్ధరామయ్య ఏకంగా రద్దు చేస్తాననడం అర్థరహితం… దీనివల్ల విద్యార్థుల భవిష్యత్తుకు తీవ్ర ఇబ్బంది కలుగుతుంది. వారి జీవితాలతో కాంగ్రెస్ రాజకీయాలు చేయకూడదని బసవరాజ్ బొమ్మై అన్నారు. దేశంలోని ఎంతోమంది మేధావుల ఏళ్ల కృషితో జాతీయ విద్యావిధానాన్ని రూపొందించారని.. ఇది మైరుగైన విద్యా నిర్మాణమని.. విద్యార్థుల ఆసక్తి మేరకు సబ్జెక్టులను ఎంపిక చేసుకునే స్వేచ్ఛను కలిగిస్తోందని చెప్పిన ఆయన.. అటువంటి విద్యావిధానాన్ని రద్దు చేస్తానని ప్రకటించడం కాంగ్రెస్ మూర్ఖత్వమని మండిపడ్డారు.
Read also: Mammu Kaka: మలయాళ సూపర్ స్టార్… పాన్ ఇండియా హారర్ సినిమా
Also Read
- Explainer: ఎవరు భారతీయులో తేల్చేది ఎవరు? పాస్పోర్ట్, ఆధార్, ఓటర్ ఐడీ, పాన్ కార్డ్ ఉన్నంతమాత్రానా ఇండియన్స్ అవ్వలేమా?
- Groom Dies Before Wedding: ఏమిటి ఈ ఘోరం.. పెళ్లి జరుగుతుండగానే వరుడు..
- Kangana Ranaut: సియా గోయల్ తల్లిదండ్రులకు కంగనా రనౌత్ మద్దతు!.. కేతన్ హ*త్య కేసు గురించి మాట్లాడుతూ..
- Viral Video: ఛీ.. ఛీ.. ఇంత దారుణంగా ఉన్నారేంట్రా బాబు.. భోజనం చేస్తున్న వారి మధ్యే మూత్ర విసర్జన మహిళ..
కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వంపై బీజేపీ నేతలు చేస్తున్న ఆరోపణలను ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ తీవ్రంగా ఖండించారు. నూతన విద్యావిధానం కర్ణాటకలో మాత్రమే అమలులో జరుగుతుందని.. బీజేపీ పాలిత రాష్ట్రాలైన గుజరాత్, హర్యానా, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్లలో ఎందుకు అమలు జరగడం లలేదని ప్రశ్నించారు. దివంగత నేత రాజీవ్ గాంధీ హయంలో ఉన్న విద్యావిధానాన్ని డీకే శివకుమార్ ప్రశంసించారు. ప్రాథమిక విద్య, సాంకేతిక, ఉన్నత విద్య పరంగా ఎంతో ఉత్తమం అని కొనియాడారు. ఈ నేపథ్యంలో కొత్తగా రూపొందించిన నూతన విద్యా విధానం అమలు చేయాల్సిన అవసరం లేదని.. ఇది కేవలం బీజేపీ రాజకీయ ఎత్తుగడ మాత్రమే అని ఆరోపించారు.
తాజావార్తలు
-
Explainer: చరిత్రలోనే అత్యంత క్రూరమైన ఉగ్రవాద దాడి..41ఏళ్ల తర్వాత బయటపడ్డ కనిష్క విమాన పేలుడు నిజం!
-
Explainer: ఎవరు భారతీయులో తేల్చేది ఎవరు? పాస్పోర్ట్, ఆధార్, ఓటర్ ఐడీ, పాన్ కార్డ్ ఉన్నంతమాత్రానా ఇండియన్స్ అవ్వలేమా?
-
Hyderabad: పరారీలో “గోల్డ్ మ్యాన్” .. ఇంటికి తాళం వేసి రాత్రికి రాత్రే జంప్..
-
Groom Dies Before Wedding: ఏమిటి ఈ ఘోరం.. పెళ్లి జరుగుతుండగానే వరుడు..
-
Earphones: రోజూ ఇయర్ఫోన్స్ వాడుతున్నారా? ఎంతసేపు వింటే సురక్షితం..?
ట్రెండింగ్
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!
-
55 రోజుల స్టాండ్బై బ్యాటరీతో రూ.1,699కే itel Power 451 AI ఫీచర్ ఫోన్..
-
Pesara Laddu Recipe: ప్రోటీన్ పుష్కలంగా ఉండే ‘పెసర లడ్డూలు’.. ఇంట్లోనే సులభంగా తయారు చేయండి ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇంత దారుణంగా ఉన్నారేంట్రా బాబు.. భోజనం చేస్తున్న వారి మధ్యే మూత్ర విసర్జన మహిళ..