Mamata Banerjee: ‘‘BSF పోస్టుల వద్దకు మాత్రం వెళ్లకండి’’.. SIRపై మమతా సంచలన వ్యాఖ్యలు..
- SIRపై మమతా సంచలన వ్యాఖ్యలు..
- బెంగాల్ నుంచి ఎవరిని వెళ్లగొట్టనివ్వను..
- బీఎస్ఎఫ్ పోస్టుల వద్దకు వెళ్లొద్దని విన్నపం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mamata Banerjee: మరికొన్ని నెలల్లో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషన్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR) పేరుతో ఓటర్ల జాబితాను సమీక్షిస్తోంది. అయితే, దీనిపై బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీ తీవ్రంగా మండిపడుతోంది. మరోసారి సర్ ప్రక్రియను టార్గెట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓటర్ల జాబితాలో మహిళల పేర్లు తొలగిస్తే, వారంతా వంటగదిలో వాడే పనిముట్లతో సిద్ధంగా ఉండాలని కోరారు.
‘‘ఎస్ఐఆర్ పేరుతో తల్లులు, సోదరీమణుల హక్కులను మీరు లాక్కుంటారా.? ఎన్నికల సమయంలో వారు ఢిల్లీ నుంచి పోలీసులను తీసకువచ్చి మహిళల్ని బెదిరిస్తారు. మీ పేర్లు తొలగిస్తే, మీ దగ్గర వంటింటి సాధానాలు ఉన్నాయి కదా.? మీరు వంట చేయడానికి వాడే పనిముట్ల మీకు బలం కాదా? మీ పేర్లు తొలగిస్తే మీరు ఊరుకోరు కదా.? మహిళలు ముందుండి పోరాడతారు, పురుషులు వారి వెనకాల ఉంటారు’’అని బెంగాల్లోని కృష్ణనగర్ లో జరిగిన ర్యాలీలో మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహంతో అన్నారు.
Also Read
- Saayoni Ghosh: గెటప్ మార్చేసిన టీఎంసీ రెబల్ ఎంపీ సయానీ ఘోష్.. వీడియో వైరల్
- Bengal: అసాంఘిక శక్తులకు అడ్డగా బెంగాల్ స్కూల్స్.. భారీగా నగదు, కండోమ్స్ స్వాధీనం
- Two Trains: ఒకే ట్రాక్పై ఎదురెదురుగా వచ్చిన ట్రైన్లు.. తృటిలో తప్పిన ప్రమాదం..
- KC Venugopal: కాంగ్రెస్లో టీఎంసీ విలీనంపై కీలక వ్యాఖ్యలు.. సోనియా-మమత భేటీపై కేసీ.వేణుగోపాల్ క్లారిటీ
మహిళలు లేదా బీజేపీనా? వీరిలో ఎవరు శక్తివంతులో చూడాలని అనుకుంటున్నట్లు ఆమె అన్నారు. ‘‘నేను మతతత్వాన్ని నమ్మనని, నేను లౌకిక వాదాన్ని నమ్ముతాను. ఎన్నికలు వచ్చినప్పుడల్లా, బీజేపీ డబ్బును ఉపయోగించి, ప్రజలను విభజించడానికి ఇతర రాష్ట్రాల నుండి ప్రజలను తీసుకురావడానికి ప్రయత్నిస్తుంది’’ అని ఆరోపించారు. దెబ్బతిన్న పులి చాలా ప్రమాదకరమని, మాపై దాడి చేస్తే ఎలా ప్రతీకారం తీర్చుకోవాలో తెలుసు అంటూ మమతా హెచ్చరించారు. తన ప్రభుత్వం బెంగాల్ నుంచి ఎవరిని వెళ్లగొట్టేందుకు అనుమతించదని, ‘‘సరిహద్దు ప్రాంతాల్లోని బీఎస్ఎఫ్ పోస్టుల వద్దకు మాత్రం వెళ్లవద్దు, ఇదే నా విన్నపం’’ అని అన్నారు.
Read Also: Pakistan: కక్ష సాధిస్తున్న అసిమ్ మునీర్.. మాజీ ఐఎస్ఐ చీఫ్కు 14 ఏళ్లు జైలు శిక్ష..
ఆదివారం కోల్కతాలో జరిగిన సామూహిక భగవద్గీ పారాయనం గురించి మాట్లాడుతూ.. ‘‘మనకు అవసరమైనప్పుడు మనమందరం ఇంట్లోనే గీతను పఠిస్తాము. బహిరంగ సభ ఎందుకు నిర్వహించాలి? దేవుళ్లు హృదయంలో ఉంటారు. అల్లాను ప్రార్థించేవారు తమ హృదయాలలోనే ప్రార్థిస్తారు. రంజాన్, దుర్గా పూజ సమయంలో, మనమందరం కలిసి ప్రార్థిస్తాము. గీత గురించి అరుస్తున్న వారిని శ్రీకృష్ణుడు ఏమి చెప్పాడో అడగాలనుకుంటున్నాను. ధర్మం అంటే పవిత్రత, మానవత్వం, శాంతి.. హింస వివక్ష, విభజన కాదు’’ అని మమతా బెనర్జీ అన్నారు.
రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద, రవీంద్రనాథ్ ఠాగూర్, నేతాజీ సుభాష్ చంద్రబోస్ వంటి గొప్ప వ్యక్తులు ప్రజలను విభజించలేదని, మీరు ఎవరు ? అని బీజేపీని ప్రశ్నించారు. బెంగాల్ ప్రజలు తాము భారత పౌరులమని నిరూపించుకోవలని అన్నారు. మీరు చేపలు తినాలా, మాంసం తినాలా అని మీరే నిర్ణయించుకుంటారని, బీజేపీ మిమ్మల్ని వాటిని తిననివ్వదని అన్నారు.
తాజావార్తలు
-
Dravid: ద్రవిడ్ వారసుడు వచ్చేస్తున్నాడు.. అండర్-19 జట్టుకు ఎంపికైన రాహుల్ ద్రవిడ్ కుమారుడు..
-
Bhairavi Aarthya : పర్ఫెక్షన్ కోసం టాలీవుడ్ కొత్త హీరోయిన్ భైరవి సంచలనం!
-
Saayoni Ghosh: గెటప్ మార్చేసిన టీఎంసీ రెబల్ ఎంపీ సయానీ ఘోష్.. వీడియో వైరల్
-
Health Benefits of Eggs: ప్రతిరోజూ ఒక గుడ్డు తింటున్నారా..? శరీరంలో జరిగే అద్భుత మార్పులు ఇవే..
-
MLA Chirri Balaraju: పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు కార్యాలయంలో ఉద్రిక్తత..
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!