TV news channels: ఉగ్రవాదులకు వేదిక కావద్దు.. మీడియా ఛానెళ్లకు కేంద్రం వార్నింగ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TV news channels: ఉగ్రవాదులకు వేదికగా మారొద్దని కేంద్రం ప్రైవేట్ టీవీ ఛానెళ్లకు వార్నింగ్ ఇచ్చింది. కెనడా, ఇండియాల మధ్య దౌత్యపరమైన వివాదం నడుస్తున్న నేపథ్యంలో ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మంత్రిత్వ శాఖ గురువారం కోరింది. ఉగ్రవాదంతో సంబంధం ఉన్న వ్యక్తులను ఇంటర్వ్యూ చేయడం మానుకోవానలి సూచించింది.
భారతదేశంలో చట్టం ద్వారా నిషేధించబడిన సంస్థకు చెందిన ఉగ్రవాదంతో సంబంధం ఉన్న, తీవ్ర నేర కేసులు ఉన్న విదేశాలకు చెందిన వ్యక్తిని ఓ టెలివిజన్ ఛానెల్ ఇంటర్వ్యూకు ఆహ్వానించినట్లు కేంద్రం దృష్టికి రావడంతో ఈ సూచనలను జారీ చేసింది. దేశ సార్వభౌమాధికారం, సమగ్రత, దేశ భద్రత, విదేశాలతో భారతదేశ సంబంధాలకు హాని కలిగిచే పలు వ్యాఖ్యలు చేశాడని కేంద్రం పేర్కొంది. దేశంలో ఇది పబ్లిక్ ఆర్డర్ కి భంగం కలిగించే అవకాశం ఉందని I&B మంత్రిత్వ శాఖ సలహాగా చెప్పింది.
Also Read
- Ayodhya Ram Mandir: రూ.4కోట్లు చెక్ ఇచ్చింది.. అకౌంట్లో చూస్తే 3 రూపాయలే ఉన్నాయ్..అయోధ్య చెక్ బౌన్స్ కథ వింటే..
- GLOF Risk in India: నేపాల్ వరదల తర్వాత భారత్కు భారీ ముప్పు.. హిమాలయాల్లో 200 ‘జల బాంబులు’?
- Rahul Gandhi: రాహుల్ గాంధీపై ఎఫ్ఐఆర్.. హల్ద్వానీ ‘శుద్ధీకరణ’ వివాదంలో కేసు నమోదు
- Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
Read Also: Tesla: భారత్లో బ్యాటరీ స్టోరేజ్ ఫ్యాక్టరీ నిర్మాణానికి టెస్లా ప్రతిపాదన..
ప్రభుత్వం మీడియా స్వేచ్ఛను సమర్థిస్తుందని, రాజ్యాంగం ప్రకారం దాని హక్కుల్ని గౌరవిస్తుందని, టీవీ ఛానెళ్లు ప్రసారం చేసే కంటెంట్ సెక్షన్ 20లోని సబ్ సెక్షన్(2)తో సహా సీటీఎన్ చట్టం-1995లోని నిబంధనలకు కట్టుబడి ఉండాలని అని పేర్కొంది. ఉగ్రవాదంతో సంబంధం ఉన్న వ్యక్తులు, సంస్థలకు చెందిన వ్యక్తులకు చెందిన రిపోర్టులను, అభిప్రాయాలు, ఎజెండాలకు టీవీ ఛానెళ్లలో చోటు ఇవ్వద్దని తెలిపింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(2), సీటీఎన్ చట్టంలోని పరిమితులకు కట్టుబడి ఉండాలని తెలిపింది.
ఇండియా, కెనడాల మధ్య ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య చిచ్చు పెట్టింది. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో అక్కడి పార్లమెంట్ లో మాట్లాడుతూ.. ఈ హత్యలో భారత్ ప్రమేయం ఉందని ఆరోపించారు. కెనడా సీనియర్ భారతీయ దౌత్యవేత్తను బహిష్కరించింది. దీనికి బదులుగా భారత్ కూడా కెనిడియన్ దౌత్యవేత్తను బహిష్కరించింది. కెనడావి అసంబద్ధ, రాజకీయ ప్రేరేపిత వ్యాఖ్యలుగా భారత్ ఖండించింది. కెనడా ఉగ్రవాదులకు స్వర్గధామంగా మారిందని భారత విదేశాంగశాఖ తీవ్రంగా వ్యాఖ్యానించింది.
Govt of India issues an advisory for television channels to refrain from giving any platform to reports/references about and views/agenda of persons of such background including those against whom there are charges of serious crimes/terrorism and belonging to organizations which… pic.twitter.com/DEjCSymmAr
— ANI (@ANI) September 21, 2023
తాజావార్తలు
-
Honda UC3 Electric Scooter: 122KM రేంజ్, 3.2kWh బ్యాటరీతో హోండా UC3 ఎలక్ట్రిక్ స్కూటర్.. భారత్లో రిలీజ్ కు రెడీ..!
-
Hatha: పిల్లి చుట్టూ తిరిగే మిస్టరీ!.. ఇంటెన్స్ గా కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్
-
Veligonda Project Phase 1: వెలిగొండ ఫేజ్-1 ప్రారంభం.. 10.70 టీఎంసీల కృష్ణా జలాలు విడుదల చేసిన సీఎం చంద్రబాబు
-
Tukkuguda Nurse Mu*rder: తుక్కుగూడ నర్సు హ*త్యకేసు.. సీన్ టు సీన్.. అసలేం జరిగిందంటే.!
-
NBK111 : బాలయ్య – గోపీచంద్ మలినేని సినిమా టైటిల్ అనౌన్స్మెంట్ డేట్ ఫిక్స్
ట్రెండింగ్
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!