Supreme Court: పాక్ ఆర్టిస్టులను భారత్లో బ్యాన్ చేయాలి.. “సంకుచిత మనస్తత్వం” వద్దన్న సుప్రీంకోర్టు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Supreme Court: పాకిస్తాన్కి చెందిన ఆర్టిస్టులను భారతదేశంలో ప్రదర్శనలు ఇవ్వడంపై, వారు ఇక్కడ పనిచేయడంపై పూర్తిగా నిషేధం విధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు మంగళవారం విచారించింది. పిటిషనర్ ‘‘అంత సంకుచిత మనస్తత్వం’’ కలిగి ఉండవద్దని కోరింది. ఈ పిటిషన్ని అత్యున్నత కోర్టు కొట్టేసింది. సినీ వర్కర్, ఆర్టిస్ట్ అని చెప్పుకునే ఫైజ్ అన్వర్ ఖురేషీ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్ని కొట్టివేసిన బాంబే హైకోర్టు ఉత్తర్వులపై జోక్యం చేసుకునేందుకు న్యాయమూర్తులు జస్టిస్ సంజీవ్ ఖన్నా, ఎస్వీఎన్ భట్టీలతో కూడిన సుప్రీం ధర్మాసనం తిరస్కరించింది. ‘‘మీరు ఈ అప్పీల్పై ఒత్తిడి చేయవద్దు. అంత సంకుచిత భావంతో ఉండకండి’’ అని ధర్మాసనం పేర్కొంది.
Read Also: Sonia Gandhi: కాంగ్రెస్కు ఓటు వేయండి.. తెలంగాణ ప్రజలకు సోనియా గాంధీ సందేశం
Also Read
- Explained: లౌకికవాదం నుంచి హిందుత్వ వైపు.. బెంగాలీ మేధావుల మనసు ఎందుకు మారింది?
- Supreme Court: పెళ్లికి ముందు శారీరక బంధంలో ఉంటే క్యారెక్టర్ను తప్పుపట్టలేం.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు!
- West Nile Fever: డెంగ్యూ, మలేరియానే కాదు.. కేరళలో దోమ కాటుతో మరో ప్రాణాంతక వ్యాధి!
- Zojila Tunnel Breakthrough: భారత ఇంజినీరింగ్ అద్భుతం.. 'జోజిలా టన్నెల్ బ్రేక్ త్రూ' ను ప్రారంభించిన కేంద్ర మంత్రి..
గతంలో పిటిషన్పై బాంబే హైకోర్టు చేసిన కొన్ని వ్యాఖ్యలను కూడా బహిష్కరించేందుకు అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. భారతీయ పౌరులు, కంపెనీలు, సంస్థలు, సంఘాలు పాకిస్తాన్ ఆర్టిస్టులతో సంబంధాలు పెట్టుకోకుండా కేంద్రానికి ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఇంతకుముందు విచారించిన బాంబే హైకోర్టు, సాంస్కృతిక సామరస్యం, ఐక్యత, శాంతిని పెంపొందించడంలో పిటిషనర్ పిటిషన్ తిరోగమన దశ అని, అందులో ఎలాంటి మెరిట్ లేదని పేర్కొంటూ కొట్టేసింది.
దేశ భక్తుడిగా ఉండాలంటే విదేశాలను ముఖ్యంగా పొరుగు దేశాలకు చెందిన వారిపై శత్రుత్వం చూపాల్సిన అవసరం లేదని కోర్టు పేర్కొంది. నిజమైన దేశ భక్తుడు నిస్వార్థపరుడు, తన దేశం కోసం అంకితభావంతో ఉన్న వ్యక్తి ఇలాంటివి చేయడని, మంచి హృదయం ఉన్న వ్యక్తి తన దేశంలోని ఏదైనా పనిని స్వాగతిస్తాడని, ఇది దేశంలో, సరిహద్దులో శాంతి, సామరస్యం, ప్రశాంతతను ప్రోత్సహిస్తుందని పేర్కొంది. కళలు, సంగీతం, క్రీడలు, సంస్కృతి, నృత్యం మొదలైన కార్యకలాపాలు జాతీయతలు, సంస్కృతులు దేశాల మధ్య శాంతి, ఐక్యత, ప్రశాంతతను కలిగిస్తాయని బాంబే హైకోర్టు తన ఉత్తర్వుల్లో పేర్కొంది. క్రికెట్ ప్రపంచకప్ లో పాకిస్తాన్ పాల్గొందన్న విషయాన్ని గుర్తు చేసింది.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: సచిన్ రికార్డు బద్దలు.. కానీ ఆ ఒక్క మార్క్ను అందుకోలేకపోయిన వైభవ్!
-
Jobs : AI వల్ల ఉద్యోగాలు పోతున్నాయ్.. కానీ ఈ రంగాల్లో మాత్రం డిమాండ్ పెరుగుతోంది!
-
Pawan Kalyan: 33 ఏళ్లలో ఇలాంటి ప్రమాదం జరగలేదు.. ప్రైవేటీకరణ జరగకూడదన్నదే మా ఆకాంక్ష!
-
Hyderabad: మరోసారి రెచ్చిపోయిన నేపాలి గ్యాంగ్.. భారీగా బంగారం, వెండి, వజ్రాభరణాలు లూటీ.!
-
Ben Stokes: ఒక్క తప్పిదం.! కెప్టెన్ గానే కాదు.. జట్టులో స్థానం కూడా ప్రశ్నార్థకం..
ట్రెండింగ్
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!