Kolkata doctor case: వైద్యుల నిరసనల్లో పాల్గొన్న క్రికెట్ లెజెండ్ గంగూలీ దంపతులు
- వైద్యుల నిరసనల్లో పాల్గొన్న క్రికెట్ లెజెండ్ గంగూలీ దంపతులు
- బాధితురాలి కుటుంబానికి న్యాయం జరగాలని డిమాండ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోల్కతా వైద్యురాలి హత్యాచార ఘటన భారతీయుల హృదయాలను కలిచివేస్తోంది. ఆస్పత్రిలో అత్యంత క్రూరంగా వైద్యురాలు హత్యాచారానికి గురి కావడంతో మానవత్వం ఉన్న ప్రతివారి హృదయాలను చలింపచేస్తోంది. ఇప్పటికే వైద్యులు, నర్సులు, మహిళా సంఘాలు, రాజకీయ పార్టీలు పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగిస్తున్నారు. సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఇక తాజాగా క్రికెట్ లెజెండ్ సౌరవ్ గంగూలీ దంపతులైతే ఏకంగా ప్రత్యక్ష నిరసనల్లో పాల్గొని న్యాయం కోసం గొంతెత్తారు. బుధవారం వైద్యుల చేపట్టిన ఆందోళన కార్యక్రమంలో పాల్గొని.. వైద్యురాలి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా గంగూలీ మీడియాతో మాట్లాడారు.. కోల్కతా వైద్యురాలి హత్యాచార ఘటనపై సీబీఐ త్వరితగతిని దర్యాప్తు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. దేశంలో ఈ మధ్య ఇలాంటి కేసులు భయంకరంగా జరుగుతున్నాయని వాపోయారు. బాధితురాలికి న్యాయం జరగాలి.. ఆమె కుటుంబానికి న్యాయం జరగాలని డిమాండ్ చేశారు. ర్యాలీలో గంగూలీతో పాటు భార్య డోనా గంగూలీ కూడా వెంట నడిచారు.
Also Read
- Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
- Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
- UP: ‘నాకు విడాకులు ఇచ్చేయండి’.. ఓ వింతైన కారణంతో కోర్టుకెళ్లిన నూతన వధువు
- INIDIA alliance: ఇండియా కూటమి సమావేశానికి విజయ్ పార్టీకి నో ఎంట్రీ.. కాంగ్రెస్ చెప్పిన కారణం ఇదే!
ఆగస్టు 9న కోల్కతా ఆర్జీ కర్ ఆస్పత్రిలో అత్యంత క్రూరంగా వైద్యురాలు హత్యాచారానికి గురైంది. ఆమె కళ్లు, ప్రైవేటు భాగాల నుంచి విపరీతంగా రక్తస్రావం జరిగింది. అంతేకాదు.. శరీరమంతా గాయాలతో నిండిపోయింది. ఇక పోస్టుమార్టం రిపోర్టులో అయితే ఆమెలో 150 మిల్లీగ్రాముల వీర్యం ఉన్నట్లుగా గుర్తించారు. అంటే ఆమెపై గ్యాంగ్రేప్ జరిగినట్లుగా భావిస్తున్నారు. ఇక ఈ ఘటన జరిగిన తర్వాత రౌడీలు, గూండాలు ఆస్పత్రిలోకి వెళ్లి ఆధారాలు చెరిపేశారు. కోల్కతా హైకోర్టు జోక్యంతో సీబీఐ దర్యాప్తునకు ఆదేశించింది. ప్రస్తుతం సీబీఐ దర్యాప్తు చేస్తోంది. లోతుగా విచారిస్తోంది. ప్రధానంగా మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోస్ను లోతుగా విచారిస్తున్నారు. ఇతడు భయంకరంగా మాఫియాను నడిపిస్తున్నట్లుగా అధికారులు గుర్తించారు.
తాజావార్తలు
-
Peddi : ‘పెద్ది’ టికెట్ రేట్ల తగ్గింపు… ఒక్క రోజే ఈ బంపర్ ఆఫర్
-
Fish Medicine: నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చేపమందు ప్రసాదం పంపిణీ.. రాత్రి 9 గంటల వరకే.!
-
Vastu Tips: ఇంట్లో డబ్బు ఉంచే ప్రదేశం వాస్తు ప్రకారం ఎలా ఉండాలి? చాలామందికి తెలియని విషయాలు ఇవే!
-
Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
-
Israel-Iran: ఇరాన్ సీజ్ఫైర్పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!