Bengaluru: వైద్య వృత్తికే మాయని మచ్చ.. భార్యకు అనస్థీషియా ఇచ్చి చంపిన డాక్టర్
- వైద్య వృత్తికే మాయని మచ్చ
- భార్యకు అనస్థీషియా ఇచ్చి చంపిన డాక్టర్
- బెంగళూరులో ఘటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వారిద్దరూ వైద్య వృత్తిలో ఉన్నారు. చూడచక్కని జంట. ఇంకేముంది పెళ్లితో చక్కని జంట అవుతుందని పెద్దవాళ్లు భావించారు. ఇద్దరికి గ్రాండ్గా వివాహం జరిపించారు. కానీ ఏడాది తిరగకుండానే భార్యను కాటికి పంపేశాడు దుర్మార్గుడు. ఈ దారుణ ఘటన బెంగళూరులో వెలుగుచూసింది. వైద్య వృత్తికే మాయని మచ్చగా మిగిలిపోయింది.

Also Read
- BrahMos-Vietnam: భారత్ రక్షణ రంగంలో మరో కీలక మైలురాయి.. వియత్నాంకు బ్రహ్మోస్ క్షిపణులు విక్రయం!
- Mamata Banerjee: సిగ్గుపడాలి.. పాలకులే హంతకులుగా మారారు.. బీజేపీ ప్రభుత్వంపై మమత ఆగ్రహం
- Abhishek Banerjee: "నా గొంతు కోసినా సరే, మీకు లొంగేది లేదు".. చిక్కుల్లో మమత మేనల్లుడు
- Abhishek Banerjee: మమతా మేనల్లుడిని ప్రజలు ఎందుకు కొట్టారు..?
కృతికా రెడ్డి-మహేందర్ రెడ్డి ఇద్దరూ డాక్టర్లు. ఈ జంటకు గత ఏడాది మే 26న వివాహం జరిగింది. ఇద్దరూ కూడా విక్టోరియా ఆస్పత్రిలో వైద్యులుగా కొనసాగుతున్నారు. కృతికా రెడ్డి చర్మవ్యాధి నిపుణురాలు. ఏప్రిల్ 21న కృతికా రెడ్డి అనారోగ్యానికి గురైందని సమీపంలోని ఒక ఆస్పత్రికి తరలించాడు. డాక్టర్లు పరిశీలించి చనిపోయినట్లుగా ప్రకటించారు. కృతికా రెడ్డిది సహజ మరణంగా భావించి సమాధి కార్యక్రమాలు నిర్వహించారు.
ఇది కూడా చదవండి: Durgapur Student Rape: మమత ‘తల్లి’లాంటిది.. సీఎంకు క్షమాపణ చెప్పిన బాధితురాలి తండ్రి
కానీ మారతహళ్లి పోలీస్ స్టేషన్లో మాత్రం అసహజ మరణంగా కేసు నమోదైంది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి ఇంట్లో తనిఖీలు చేయగా కొన్ని ఇంజెక్షన్లు, వైద్య వస్తువులు లభించాయి. మరికొన్ని కీలక ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ వస్తువులన్నిటినీ ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారు.
తాజాగా నివేదిక వెలుగులోకి వచ్చింది. దాదాపు 6 నెలల తర్వాత బాధితురాలి శరీరంలో శక్తివంతమైన మత్తుమందు ఉన్నట్లు నిర్ధారణ అయింది. కృతికారెడ్డిది సహజమరణం కాదని.. హత్యగా పేర్కొంది. దీంతో బాధిత తండ్రి తీవ్ర ఆవేదన చెందాడు.. తన అల్లుడు మత్తుమందు ఇచ్చి కుమార్తెను చంపాడని ఆరోపించి తిరిగి ఫిర్యాదు చేశాడు.
ఇది కూడా చదవండి: Trump: యుద్ధాలను ఆపడం ఇష్టం.. వచ్చే ఏడాది నోబెల్ రావొచ్చేమో!
మారతహళ్లి పోలీసులు వేగంగా రంగంలోకి దిగి అక్టోబర్ 14న నిందితుడు మహేందర్రెడ్డిని అరెస్టు చేశారు. నిందితుడు తన వైద్య నైపుణ్యాన్ని ఉపయోగించి సహజ మరణాన్ని చూపించాడని పోలీసులు పేర్కొన్నారు. నిందితుడు దురుద్దేశంతోనే భార్యను చంపినట్లు బెంగళూరు పోలీస్ కమిషనర్ సీమంత్ కుమార్ సింగ్ తెలిపారు. తదుపరి దర్యాప్తు జరుగుతోందని పేర్కొన్నారు. అయితే కృతికారెడ్డి అనారోగ్య సమస్యలను దాచి పెట్టి పెళ్లి చేశారన్న కోపంతోనే మహేందర్రెడ్డి ఇలా చేసినట్లుగా సమాచారం.
తాజావార్తలు
-
Ajay Bhupathi: “శ్రీనివాస మంగాపురం” ఆడియో బ్లాక్బస్టర్ హిట్ కాబోతోంది: డైరెక్టర్ అజయ్ భూపతి
-
BrahMos-Vietnam: భారత్ రక్షణ రంగంలో మరో కీలక మైలురాయి.. వియత్నాంకు బ్రహ్మోస్ క్షిపణులు విక్రయం!
-
NSE Trading Hours Change: స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ సమయం మార్పు.. ఎన్ఎస్ఈ కీలక ప్రకటన!
-
Cuba vs America: క్యూబాలో నాయకత్వ మార్పు? ఫిడెల్ కాస్ట్రో కుమార్తె సంచలన వ్యాఖ్యలు!
-
Lashkar-e-Taiba: భారత్ను టార్గెట్ చేస్తూ బార్డర్ల కొత్త ఉగ్ర కోట.. నిఘా వర్గాల చేతికి లష్కర్ సీక్రెట్ మ్యాప్!
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..