DMK: కాంగ్రెస్ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..
- కాంగ్రెస్ తీరుపై డీఎంకే ఆగ్రహం..
- పొత్తు ధర్మాన్ని పాటించలేదని గరం గరం..
- కాంగ్రెస్ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..
- డీఎంకే నేత టీఆర్ బాలు సంచలన వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
DMK: తమిళనాడు రాజకీయాల్లో బిగ్ ట్విస్టులు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే విజయ్ టీవీకే పార్టీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నట్లు కాంగ్రెస్ ప్రకటించింది. డీఎంకే కూటమిలో భాగంగా ఉన్న హస్తం పార్టీ ప్లేటు ఫిరాయించింది. ఈ పరిణామాలపై కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహంతో ఉంది. కాంగ్రెస్ తీరును ‘‘ద్రోహపూరితగ చర్య’’గా అభివర్ణించింది. ఓటమి, ద్రోహం తమకు కొత్త కాదని, ఇవి రెండూ శాశ్వతం కాదని, దీనికి కాలమే సరైన సమాధానం చెబుతుందని డీఎంకే చెబుతోంది.
కష్టసుఖాల్లో కాంగ్రెస్కు తాము అండగా నిలిచామని డీఎంకే పార్టీ గుర్తు చేసింది, ఇప్పుడు ఆ పార్టీ టీవీకేకు మద్దతు ఇవ్వడంపై ‘‘అవకాశవాదులు’’ అని ఆరోపించింది. “కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే క్లిష్ట పరిస్థితులను లేదా సంక్షోభాలను ఎదుర్కొందో, అప్పుడు డీఎంకే ఒక దృఢమైన మిత్రపక్షంగా వారికి అండగా నిలిచింది. ఈ విధేయత కోసం మేము చెల్లించిన మూల్యం చాలా ఎక్కువ, అయినా సరే, మేము దానిని చిరునవ్వుతో భరించాము,” అని డీఎంకే కోశాధికారి టీఆర్ బాలు అన్నారు. కూటమిలో ఉంటేనే కాంగ్రెస్ 5 స్థానాలు గెలిచిందని ఆయన గుర్తు చేశారు.
Also Read
- Iran Oil: భారత్పై ఇరాన్ ఆశలు.. సముద్రంలో భారీగా చమురు..
- Monsoon: రుతుపవనాలపై ఐఎండీ శుభవార్త.. ఈ రాష్ట్రాల్లో భారీ వర్షాలు
- Pune Trekker Case: హత్యకు 4 రోజుల ముందే ‘స్నేక్’ డ్రామా.. పూణెలో సోనమ్ వారసురాలు ఏం మర్డర్ ప్లాన్
- Padma Awards: దిగ్గజాలకు పద్మ పురస్కారాలు.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డుల ప్రదానం!
Read Also: Chanakya Niti: విజయం మీ బానిస కావాలా? అయితే చాణక్యుడు చెప్పిన ఈ ‘సీక్రెట్స్’ పాటించాల్సిందే!
కాంగ్రెస్ చర్యను గొప్ప రాజకీయ వ్యూహంగా చిత్రీకరించడానికి ప్రయత్నిస్తోందని, అవకాశవాదాన్ని సిద్ధాంతం అనే ముసుగులో కప్పిపుచ్చాలని చూస్తోందని, ఇది అవకాశవాద సిద్ధాంతం అని, డీఎంకే కూటమికి ఓట్లేసి గెలిపించిన ప్రజలకు ఇది బహిరంగ ద్రోహచర్యగా పరిగణించబడుతుందని బాలు చెప్పారు. ఇతర రాష్ట్రాల్లో అధికారంలో కోసం బీజేపీ ఏం చేసిందో, ఇప్పుడు కాంగ్రెస్ కూడా ఇదే చేస్తోందని అన్నారు.
ఇటీవల జరిగిన ఎన్నికల్లో తమిళనాడులోని 234 స్థానాలకు గానూ టీవీకే 108 స్థానాలను గెలుచుకుంది. అసెంబ్లీలో మ్యాజిక్ ఫిగర్ సాధించడానికి మరో 10 స్థానాలు తగ్గాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ మద్దతు ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. కాంగ్రెస్ 5 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అయినప్పటికీ, విజయ్ మెజారిటీకి దూరంగానే ఉన్నారు. వీసీకే, వామపక్షాలు కానీ మద్దతు ఇచ్చేందుకు ముందుకు రాకపోవడంతో, తమిళనాడులో నెంబర్ గేమ్ కొనసాగుతోంది.
తాజావార్తలు
-
T20 World Cup: ‘కూతురి కల కోసం నగలు అమ్మిన తల్లి’.. ఇండియన్ ప్లేయర్ కళ్లలో మెరిసిన భావోద్వేగపు సంతకం..
-
Shankh Mitra: ఎలాన్ మస్క్కు ధీటుగా భారతీయుడు.. సెకండ్ పొజేషన్లో ఉన్న శంఖ్ మిత్రా ఎవరు?
-
Iran Oil: భారత్పై ఇరాన్ ఆశలు.. సముద్రంలో భారీగా చమురు..
-
Monsoon: రుతుపవనాలపై ఐఎండీ శుభవార్త.. ఈ రాష్ట్రాల్లో భారీ వర్షాలు
-
Pune Trekker Case: హత్యకు 4 రోజుల ముందే ‘స్నేక్’ డ్రామా.. పూణెలో సోనమ్ వారసురాలు ఏం మర్డర్ ప్లాన్
ట్రెండింగ్
-
Ragi Biscuits : హెల్తీ రాగి బిస్కెట్లు ఎయిర్ ఫ్రైయర్లో 10 నిమిషాల్లో ఇలా చేసుకోండి.!
-
Kitchen Tips : నల్లబడిన వెండి ఆభరణాలు, వస్తువులు కొత్త వాటిలా మెరవాలా..? ఈ కిచెన్ ట్రిక్ సూపర్!
-
మళ్లీ అందుబాటులోకి Telegram.. కానీ వారికీ మాత్రం.!
-
MS Dhoni: భారత క్రికెట్ చరిత్రలో నేడు ప్రత్యేకమైన రోజు.. ప్రపంచంలోనే ఏకైక కెప్టెన్గా ఎంఎస్ ధోనీ చరిత్ర!
-
11,000mAh భారీ బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్, IP69K రేటింగ్ ప్రత్యేకతలతో HONOR X80 Pro Max లాంచ్.! ధర ఎంతంటే.?