DMK: కాంగ్రెస్ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..
- కాంగ్రెస్ తీరుపై డీఎంకే ఆగ్రహం..
- పొత్తు ధర్మాన్ని పాటించలేదని గరం గరం..
- కాంగ్రెస్ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..
- డీఎంకే నేత టీఆర్ బాలు సంచలన వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
DMK: తమిళనాడు రాజకీయాల్లో బిగ్ ట్విస్టులు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే విజయ్ టీవీకే పార్టీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నట్లు కాంగ్రెస్ ప్రకటించింది. డీఎంకే కూటమిలో భాగంగా ఉన్న హస్తం పార్టీ ప్లేటు ఫిరాయించింది. ఈ పరిణామాలపై కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహంతో ఉంది. కాంగ్రెస్ తీరును ‘‘ద్రోహపూరితగ చర్య’’గా అభివర్ణించింది. ఓటమి, ద్రోహం తమకు కొత్త కాదని, ఇవి రెండూ శాశ్వతం కాదని, దీనికి కాలమే సరైన సమాధానం చెబుతుందని డీఎంకే చెబుతోంది.
కష్టసుఖాల్లో కాంగ్రెస్కు తాము అండగా నిలిచామని డీఎంకే పార్టీ గుర్తు చేసింది, ఇప్పుడు ఆ పార్టీ టీవీకేకు మద్దతు ఇవ్వడంపై ‘‘అవకాశవాదులు’’ అని ఆరోపించింది. “కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే క్లిష్ట పరిస్థితులను లేదా సంక్షోభాలను ఎదుర్కొందో, అప్పుడు డీఎంకే ఒక దృఢమైన మిత్రపక్షంగా వారికి అండగా నిలిచింది. ఈ విధేయత కోసం మేము చెల్లించిన మూల్యం చాలా ఎక్కువ, అయినా సరే, మేము దానిని చిరునవ్వుతో భరించాము,” అని డీఎంకే కోశాధికారి టీఆర్ బాలు అన్నారు. కూటమిలో ఉంటేనే కాంగ్రెస్ 5 స్థానాలు గెలిచిందని ఆయన గుర్తు చేశారు.
Also Read
- Vijay Government Trust Vote: బలపరీక్షలో నెగ్గిన విజయ్ సర్కార్..!
- PM Modi: చెప్పడమే కాదు.. చేసి చూపించారు.. పెట్రోల్ సేవ్ చేసేందుకు 'కాన్వాయ్' కట్ చేసిన ప్రధాని మోడీ!
- NTA Scam Explained: పరీక్ష పెట్టడం కూడా చేతకాదా? భగ్గుమన్న విద్యార్థి లోకం!
- Emergency Landing: పొలంలో శిక్షణా విమానం అత్యవసరంగా ల్యాండ్..!
Read Also: Chanakya Niti: విజయం మీ బానిస కావాలా? అయితే చాణక్యుడు చెప్పిన ఈ ‘సీక్రెట్స్’ పాటించాల్సిందే!
కాంగ్రెస్ చర్యను గొప్ప రాజకీయ వ్యూహంగా చిత్రీకరించడానికి ప్రయత్నిస్తోందని, అవకాశవాదాన్ని సిద్ధాంతం అనే ముసుగులో కప్పిపుచ్చాలని చూస్తోందని, ఇది అవకాశవాద సిద్ధాంతం అని, డీఎంకే కూటమికి ఓట్లేసి గెలిపించిన ప్రజలకు ఇది బహిరంగ ద్రోహచర్యగా పరిగణించబడుతుందని బాలు చెప్పారు. ఇతర రాష్ట్రాల్లో అధికారంలో కోసం బీజేపీ ఏం చేసిందో, ఇప్పుడు కాంగ్రెస్ కూడా ఇదే చేస్తోందని అన్నారు.
ఇటీవల జరిగిన ఎన్నికల్లో తమిళనాడులోని 234 స్థానాలకు గానూ టీవీకే 108 స్థానాలను గెలుచుకుంది. అసెంబ్లీలో మ్యాజిక్ ఫిగర్ సాధించడానికి మరో 10 స్థానాలు తగ్గాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ మద్దతు ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. కాంగ్రెస్ 5 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అయినప్పటికీ, విజయ్ మెజారిటీకి దూరంగానే ఉన్నారు. వీసీకే, వామపక్షాలు కానీ మద్దతు ఇచ్చేందుకు ముందుకు రాకపోవడంతో, తమిళనాడులో నెంబర్ గేమ్ కొనసాగుతోంది.
తాజావార్తలు
-
Vijay Government Trust Vote: బలపరీక్షలో నెగ్గిన విజయ్ సర్కార్..!
-
Milk Storage Tips: వేసవిలో పాలు విరిగిపోతున్నాయా..? ఈ చిన్న చిట్కాలతో తాజాగా నిల్వ చేసుకోండి
-
Pat Cummins: ఎస్ఆర్హెచ్ కెప్టెన్కు బీసీసీఐ బిగ్ షాక్.. ప్యాట్ కమిన్స్కు పీడకలగా మారిన అహ్మదాబాద్ మ్యాచ్!
-
PM Modi: చెప్పడమే కాదు.. చేసి చూపించారు.. పెట్రోల్ సేవ్ చేసేందుకు ‘కాన్వాయ్’ కట్ చేసిన ప్రధాని మోడీ!
-
Ban vs Pak: బంగ్లాదేశ్ చేతిలో చిత్తుచిత్తుగా ఓడిన పాకిస్థాన్..
ట్రెండింగ్
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!