Bangladesh: ఉద్రిక్తతల వేళ 17 ఏళ్ల తర్వాత తారిఖ్ రెహమాన్ రాక.. లక్షలాది మంది స్వాగతం
- బంగ్లాదేశ్ చేరుకున్న తారిఖ్ రెహమాన్
- తీవ్ర ఉద్రిక్తతల వేళ 17 ఏళ్ల తర్వాత రాక
- లక్షలాది మంది రోడ్లపైకి వచ్చి ఘన స్వాగతం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బంగ్లాదేశ్లో గత కొద్దిరోజులుగా తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకుంటున్నాయి. యువ రాజకీయ నేత ఉస్మాన్ హాదీ హత్య తర్వాత దేశంలో పరిస్థితులు అదుపు తప్పాయి. హిందువులు లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయి. పరిస్థితులు ఇంకా అదుపులోకి రాలేదు. ఇంతలోనే బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (BNP) తాత్కాలిక అధ్యక్షుడు తారిఖ్ రెహమాన్ ఢాకా చేరుకున్నారు. లండన్లో ఉంటున్న ఆయన 17 ఏళ్ల తర్వాత బంగ్లాదేశ్కు వచ్చారు. దీంతో అభిమానులు, పార్టీ కార్యకర్తలు లక్షలాది మంది రోడ్లపైకి వచ్చి ఘన స్వాగతం పలికారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Also Read
- Vladimir Putin: "భారత్ను భయపెట్టాలని చూస్తే మీకే నష్టం".. ఆ దేశాలకు పుతిన్ స్ట్రాంగ్ వార్నింగ్!
- ISS Air Leak: అంతరిక్షంలో ఆందోళన.. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో గాలి లీక్ కలకలం
- Iran-US Tensions: మరోసారి భగ్గుమన్న పశ్చిమాసియా.. ఇరాన్ డ్రోన్లను కూల్చేసిన అమెరికా, రాడార్ కేంద్రాలపై దాడులు
- Niger: సహారా ఎడారిలో ఘోర విషాదం.. నీరు దొరక్క తీవ్ర దాహంతో 49 మంది నరకయాతన అనుభవిస్తూ మృతి!
ఫిబ్రవరి, 2026లో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ తరుణంలో తారిఖ్ రెహమాన్ రావడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. తారిఖ్ రెహమాన్.. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా కుమారుడు. ప్రస్తుతం ఖలీదా జియా తీవ్ర అస్వస్థతతో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. తల్లిని చూసేందుకే తారిఖ్ రెహమాన్ వస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నా.. త్వరలోనే ఎన్నికలు జరగనున్న తరుణంలో ఆయన రాక ప్రాధాన్యత సంతరించుకుంది. భార్య జుబైదా రెహమాన్, కూతురు జైమా రెహమాన్తో విమానంలో వస్తున్న ఫొటోలను తారిఖ్ రెహమాన్ సోషల్ మీడియాలో పంచుకున్నారు.

ఇదిలా ఉంటే బుధవారం శక్తివంతమైన బాంబ్ పేలుడు కారణంగా ఢాకాలో ఒకరు చనిపోయారు. దీంతో మరొకసారి హింస చెలరేగింది. ఇలాంటి తరుణంలో తారిఖ్ రెహమాన్ రావడం.. ఆయన కోసం లక్షలాది మంది రోడ్లపైకి రావడంతో భద్రతా అధికారులకు తలనొప్పిగా మారింది. తొలుత విమానం బంగ్లాదేశ్లోని సిల్హెట్ విమానాశ్రయంలో దిగింది. అక్కడ నుంచి ఢాకా చేరుకున్నారు. బుల్లెట్ ఫ్రూఫ్ బస్సులో తారిఖ్ రెహమాన్ అనేక కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఆస్పత్రిలో ఉన్న తల్లి ఖలీదా జియాను పరామర్శిస్తారు.

ఇదిలా ఉంటే తారిఖ్ రెహమాన్ రాకపై భారతదేశం సానుకూల సంకేతాలు వ్యక్తం చేస్తోంది. ఖలీదా జియా ప్రధానిగా ఉన్నప్పుడు భారతదేశంతో మంచి సంబంధాలు ఉన్నాయి. త్వరలో జరిగే ఎన్నికల్లో బీఎన్పీ గెలిస్తే.. తిరిగి సంబంధాలు మెరుగుపడతాయని భారత్ భావిస్తోంది. ప్రస్తుతం బంగ్లాదేశ్లో షేక్ హసీనాకు చెందిన అవామీ లీగ్ పార్టీ బహిష్కరణకు గురైంది. షేక్ హసీనా భారత్లో తలదాచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో యూనస్ ప్రభుత్వాన్ని ఎదుర్కొనేంది బీఎన్పీనే.
তারেক রহমানকে বরণ করে নিতে সকাল থেকেই জনসমূদ্র ঢাকা মহানগরী | 25 Dec 2025 https://t.co/sTFVj8pnj4
— Bangladesh Nationalist Party-BNP (@bdbnp78) December 25, 2025
తాజావార్తలు
-
Prakash Raj: నాగబాబుకు ప్రకాష్ రాజ్ స్ట్రాంగ్ కౌంటర్.. “మేము గొర్రెలం కాదు..!”
-
Devara 2 Update : ‘వర’కు ఏమైంది ?… జాన్వీ ప్రశ్నపై తారక్ సీరియస్
-
AFG vs IND: మనవ్ సుతార్ అరంగేట్రం.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న గిల్ సేన.!
-
Buchi Babu : జాన్వీ కపూర్ క్యారెక్టర్’పై బుచ్చిబాబు క్షమాపణలు..ఆ సీన్స్ కట్ చేస్తానని ప్రకటన!
-
E85 Fuel: భారత్ లో E85 ఇంధనం విడుదల.. పెట్రోల్ కంటే రూ.20 చౌక..! ప్రత్యేకతలు ఇవే
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!