DK Shivakumar: డీకే కేబినెట్లో అసంతృప్తి జ్వాలలు.. కర్ణాటక కాంగ్రెస్లో లుకలుకలు..
- డీకే కేబినెట్లో అసంతృప్తి జ్వాలలు..
- ఇప్పటికే ఒక మంత్రి రాజీనామా..
- మరో ముగ్గురిలో అసంతృప్తి..
- కర్ణాటక కాంగ్రెస్లో లుకలుకలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
DK Shivakumar: కర్ణాటక సీఎంగా బాధ్యతలు చేపట్టిన రెండు రోజుల్లోనే డీకే శివకుమార్కు కొత్త తలనొప్పులు ప్రారంభమయ్యాయి. సిద్ధరామయ్యను దించి సీఎంగా పదవీ ప్రమాణస్వీకారం చేసిన డీకేకు మంత్రులు చుక్కలు చూపిస్తున్నారు. ఇప్పటికే, సీనియర్ నేత రామలింగారెడ్డి తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ప్రాధాన్యత లేని శాఖను కేటాయించిన కారణంగా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇదిలా ఉంటే, కేబినెట్లోని మరో ముగ్గురు మంత్రులు కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే, మంత్రి వర్గంలో సిద్ధరామయ్య అనుచరగణం భారీ సంఖ్యలో ఉండటం, డీకేకు భవిష్యత్తులో ఇబ్బందులను కలుగజేస్తాయని భావిస్తున్న తరుణంలో, కేబినెట్లో అసంతృప్తి జ్వాలలు ఎగిసిపడుతున్నాయి.
కేబినెల్లోని సీనియర్ మంత్రులు తమకు మరిన్ని కీలక బాధ్యల్ని కట్టబెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు మహిళలు, ముస్లింలకు తగిన ప్రాధాన్యత ఇవ్వలేదనే విమర్శలు ఉన్నాయి. రామలింగారెడ్డికి బెంగుళూరు అభివృద్ధి శాఖను కేటాయిస్తారని అనుకున్నా, నీటి పారుదల శాఖను కేటాయించడంపై అసంతృప్తితో మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఇప్పుడు కే.హెచ్ మునియప్ప, కే.జి జార్జ్, సతీష్ జార్కిహోళిలు కూడా సమస్యగా మారారు.
Also Read
- GLOF Risk in India: నేపాల్ వరదల తర్వాత భారత్కు భారీ ముప్పు.. హిమాలయాల్లో 200 ‘జల బాంబులు’?
- Rahul Gandhi: రాహుల్ గాంధీపై ఎఫ్ఐఆర్.. హల్ద్వానీ ‘శుద్ధీకరణ’ వివాదంలో కేసు నమోదు
- Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
- Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
మునియప్ప తన సీనియారిటీకి తగిన శాఖలు ఇవ్వలేని అసంతృప్తితో ఉన్నారు. జార్జ్ తన శాఖలో అధికారుల బదిలీలపై జోక్యం జరుగుతోందని ఆరోపిస్తున్నారు. మంత్రి పదవితో పాటు రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్ష పదవిని ఆశించిన సతీష్ జార్కిహోళి కూడా అసంతృప్తిగా ఉన్నారు. ఈ విభేదాలను పరిష్కరించుకుంటామని డీకే శివకుమార్ చెబుతున్నారు. అయినప్పటికీ కాంగ్రెస్లో పరిస్థితి ఇబ్బందికరంగా ఉంది. సీఎంగా బాధ్యతలు తీసుకున్న సంతోషం డీకేకు ఉండనివ్వకుండా చేస్తున్నారు.
డీకే కేబినెట్లో మహిళా మంత్రికి చోటు కల్పించకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నా్యి. దీనిపై సీనియర్ కాంగ్రెస్ నేత మార్గరేట్ ఆల్వా నిరాశ వ్యక్తం చేశారు. దీనిపై మాట్లాడుతూ, త్వరలోనే మహిళలకు అవకాశం ఇస్తామని సీఎం డీకే శివకుమార్ చెప్పారు. ప్రస్తుతం, కేబినెట్లో యూటీ ఖాదర్ ఒక్కరే ముస్లిం మంత్రిగా ఉన్నారు. నలుగురు మంత్రులకు చోటు కల్పించాలని ముస్లిం నేతలు, మతపెద్దలు డిమాండ్ చేస్తు్న్నారు.
తాజావార్తలు
-
NBK 112 : బాలయ్య – కొరటాల సినిమాలో తమిళ స్టార్ హీరో?
-
Se*xual Assault: తుక్కుగూడ నర్సు శిరీష హత్య కేసు.. లైంగిక దాడి చేసినట్లు నిర్ధారణ.. నిందితుడి అరెస్ట్.!
-
Sardar 2: కార్తి ‘సర్దార్ 2’ ట్రైలర్ కు టైమ్ ఫిక్స్ చేసిన మేకర్స్!
-
CTET 2026: సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్.. దరఖాస్తుకు రేపే చివరి ఛాన్స్..
-
YASH : టాక్సిక్ డిజాస్టర్ తర్వాత రాకింగ్ స్టార్ యశ్ నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏంటి?
ట్రెండింగ్
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!