DK Shivakumar: డీకే కేబినెట్లో అసంతృప్తి జ్వాలలు.. కర్ణాటక కాంగ్రెస్లో లుకలుకలు..
- డీకే కేబినెట్లో అసంతృప్తి జ్వాలలు..
- ఇప్పటికే ఒక మంత్రి రాజీనామా..
- మరో ముగ్గురిలో అసంతృప్తి..
- కర్ణాటక కాంగ్రెస్లో లుకలుకలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
DK Shivakumar: కర్ణాటక సీఎంగా బాధ్యతలు చేపట్టిన రెండు రోజుల్లోనే డీకే శివకుమార్కు కొత్త తలనొప్పులు ప్రారంభమయ్యాయి. సిద్ధరామయ్యను దించి సీఎంగా పదవీ ప్రమాణస్వీకారం చేసిన డీకేకు మంత్రులు చుక్కలు చూపిస్తున్నారు. ఇప్పటికే, సీనియర్ నేత రామలింగారెడ్డి తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ప్రాధాన్యత లేని శాఖను కేటాయించిన కారణంగా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇదిలా ఉంటే, కేబినెట్లోని మరో ముగ్గురు మంత్రులు కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే, మంత్రి వర్గంలో సిద్ధరామయ్య అనుచరగణం భారీ సంఖ్యలో ఉండటం, డీకేకు భవిష్యత్తులో ఇబ్బందులను కలుగజేస్తాయని భావిస్తున్న తరుణంలో, కేబినెట్లో అసంతృప్తి జ్వాలలు ఎగిసిపడుతున్నాయి.
కేబినెల్లోని సీనియర్ మంత్రులు తమకు మరిన్ని కీలక బాధ్యల్ని కట్టబెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు మహిళలు, ముస్లింలకు తగిన ప్రాధాన్యత ఇవ్వలేదనే విమర్శలు ఉన్నాయి. రామలింగారెడ్డికి బెంగుళూరు అభివృద్ధి శాఖను కేటాయిస్తారని అనుకున్నా, నీటి పారుదల శాఖను కేటాయించడంపై అసంతృప్తితో మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఇప్పుడు కే.హెచ్ మునియప్ప, కే.జి జార్జ్, సతీష్ జార్కిహోళిలు కూడా సమస్యగా మారారు.
Also Read
- Delhi: కేతన్ హత్య తరహాలో మరో ఇల్లాలి కుట్ర.. దేశ రాజధానిలో కలకలం
- Petrol-Diesel: వాహనదారులకు కేంద్రం శుభవార్త.. జూలై 1 నుంచి ఆంక్షలు ఎత్తివేత
- Ayodhya Ram Mandir: బ్యాంకులకు చేరిన రామాలయ కానుకల చోరీ కేసు.. ఎస్బీఐతో పాటు మరో 5 బ్యాంకులకు నోటీసులు!
- Mumbai: ఒడ్డుకు కొట్టుకొచ్చిన భారీ తిమింగలం.. రెస్క్యూ ఆపరేషన్ ఫెయిల్.. చివరికిలా..!
మునియప్ప తన సీనియారిటీకి తగిన శాఖలు ఇవ్వలేని అసంతృప్తితో ఉన్నారు. జార్జ్ తన శాఖలో అధికారుల బదిలీలపై జోక్యం జరుగుతోందని ఆరోపిస్తున్నారు. మంత్రి పదవితో పాటు రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్ష పదవిని ఆశించిన సతీష్ జార్కిహోళి కూడా అసంతృప్తిగా ఉన్నారు. ఈ విభేదాలను పరిష్కరించుకుంటామని డీకే శివకుమార్ చెబుతున్నారు. అయినప్పటికీ కాంగ్రెస్లో పరిస్థితి ఇబ్బందికరంగా ఉంది. సీఎంగా బాధ్యతలు తీసుకున్న సంతోషం డీకేకు ఉండనివ్వకుండా చేస్తున్నారు.
డీకే కేబినెట్లో మహిళా మంత్రికి చోటు కల్పించకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నా్యి. దీనిపై సీనియర్ కాంగ్రెస్ నేత మార్గరేట్ ఆల్వా నిరాశ వ్యక్తం చేశారు. దీనిపై మాట్లాడుతూ, త్వరలోనే మహిళలకు అవకాశం ఇస్తామని సీఎం డీకే శివకుమార్ చెప్పారు. ప్రస్తుతం, కేబినెట్లో యూటీ ఖాదర్ ఒక్కరే ముస్లిం మంత్రిగా ఉన్నారు. నలుగురు మంత్రులకు చోటు కల్పించాలని ముస్లిం నేతలు, మతపెద్దలు డిమాండ్ చేస్తు్న్నారు.
తాజావార్తలు
-
Chairmans Desk : హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇంకా కోలుకోలేదా..?
-
Monsoon Traffic: వర్షాకాలం ట్రాఫిక్ యాక్షన్ ప్లాన్.. పోలీసులకు సైబరాబాద్ సీపీ కీలక ఆదేశాలు!
-
OTR: అసెంబ్లీకి పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారా?
-
OTR: గుంటూరు జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బా? విజయోత్సవ సభ ఫ్లాప్ వెనుక కారణాలు
-
OTR: మూడు నియోజకవర్గాల చుట్టూ తిరిగిన మాజీ మంత్రి.. ఫైనల్గా ఎక్కడ ఫిక్స్ అయ్యారు?
ట్రెండింగ్
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!