Disha Salian Case: దిశా సాలియన్ మరణం కేసు రీ ఓపెన్.. ఆదిత్య ఠాక్రే, రియాలపై ఎఫ్ఐఆర్..
- దిశా సాలియన్ కేసు రీ ఓపెన్..
- ఆదిత్య ఠాక్రేతో సహా 9 మందిపై ఎఫ్ఐఆర్..
- 2020లో 14వ అంతస్తు నుంచి పడి దిశా మృతి..
- దిశా సాలియన్, సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణాలపై అనుమానాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Disha Salian Case: సెలబ్రిటీ మేనేజర్ దిశా సాలియన్ మరణంపై కేసు తిరిగి ప్రారంభమైంది. జూన్ 8, 2020న ముంబైలో మలాడ్ ప్రాంతంలోని ఓ భవనం 14వ అంతస్తు నుంచి పడి దిశా సాలియన్ మరణించింది. అయితే, ఈ కేసులో దిశ తండ్రి సతీష్ సాలియన్ ముంబై హైకోర్టుని ఆశ్రయించారు. దిశా మరణించిన 6 రోజులకు దివంగత బాలీవుడ్ స్టార్ సుశాంత్ సింగ్ రాజ్పుత్ తన ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నాడు. దిశా, సుశాంత్కి కూడా మేనేజర్గా పనిచేసింది. ఈ నేపథ్యంలో ఈ రెండు మరణాల్లో మిస్టరీ ఉందని అప్పటి ప్రతిపక్షమైన బీజేపీ ఆరోపించింది.
Read Also: iPhone: పేరెంట్స్ “ఐఫోన్” కొనివ్వలేదని ఆత్మాహత్యాయత్నం చేసిన అమ్మాయి..
Also Read
- Milk Price Hike: పండుగ సీజన్కు ముందు మిల్క్ షాక్.. పాల ధర లీటరుకు రూ.102
- Nepal Flood Tragedy: 600 దాటిన మృతుల సంఖ్య.. మరణాలు పెరుగుతుండటంతో నేపాల్లో కొత్త సంక్షోభం..!
- CM Vijay: పుజల్ జైలులో సీఎం విజయ్ సడన్ ఇన్స్పెక్షన్.. ఆసుపత్రి, లైబ్రరీ, కంప్యూటర్ సెంటర్ తనిఖీ
- Mallikarjun Kharge: ప్రధాని మోడీ, అమిత్షాకు ఖర్గే లేఖ.. వారిని కాపాడాలని విజ్ఞప్తి
తాజాగా, సతీష్ సాలియన్ ముంబై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో శివసేన(యూబీటీ) ఎమ్మెల్యే ఆదిత్య ఠాక్రే, నటి రియా చక్రవర్తి, నలుడు డినో మోరియా, సూరజ్ పంచోలితో సహా హై ప్రొఫైల్ వ్యక్తులపై ఎఫ్ఐఆర్ నమోదైంది. దిశా మరణంపై ఆమె తండ్రి మరింత లోతైన విచారణను డిమాండ్ చేస్తున్నారు. తన కుమార్తె మరణంపై అనేక అనుమానాస్పద పరిస్థితులు ఉన్నాయని, రాజకీయ జోక్యం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. తన బిడ్డపై లైంగిక దాడి చేసి చంపేశారని ఆయన తన పిటిషన్లో పేర్కొన్నాడు. ఈ కేసులో ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రే పేరు ఉండటంతో ఇది సంచలనంగా మారింది.
తాజాగా, ముంబై కమిషనర్ ఆఫ్ పోలీస్ అండ్ జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్(క్రైమ్) ఈ ఫిర్యాదుని అధికారికంగా అంగీకరించింది. ఎఫ్ఐఆర్లో మొత్తం తొమ్మిది మందిని నిందితులుగా పేర్కొన్నారు. ఆదిత్య థాకరే, డినో మోరియా, సూరజ్ పంచోలి, రియా చక్రవర్తితో పాటు, ఇందులో సూరజ్ పంచోలి అంగరక్షకుడు, మాజీ ముంబై పోలీసు కమిషనర్ పరంబీర్ సింగ్, తొలగించబడిన పోలీసు అధికారి సచిన్ వాజే, ఇతరులు కూడా ఉన్నారు. ఎఫ్ఐఆర్లో జాబితా చేయబడిన వారందరూ పెద్ద కుట్రలో పాల్గొన్నారని, నేరాన్ని కప్పిపుచ్చారని సతీష్ సాలియన్ న్యాయవాది పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Ather Konarc Launched: తక్కువ ధరలో ఎక్కువ రేంజ్.. మెటల్ బాడీ, స్మార్ట్ ఫీచర్లతో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్
-
Taapsee Pannu: టాలీవుడ్లోకి తాప్సీ రీ ఎంట్రీ.. ఆ డైరెక్టర్తో హారర్ మూవీ?
-
H-1B Visa Rules: H-1B ఉద్యోగులకు ట్రంప్ సర్కార్ షాక్.. 60 రోజుల గ్రేస్ పీరియడ్ తొలగించే ప్రతిపాదనకు కీలక ఆమోదం
-
Milk Price Hike: పండుగ సీజన్కు ముందు మిల్క్ షాక్.. పాల ధర లీటరుకు రూ.102
-
Race 4: ‘రేస్’ రీబూట్లో అమీర్ ఖాన్.. సిద్ధార్థ్, టైగర్తో అల్టిమేట్ యాక్షన్ ?
ట్రెండింగ్
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!