Disha Salian case: ‘‘దిశా సాలియన్ మృతిలో ఆదిత్య పేరు తీసుకురావద్దని ఉద్ధవ్ ఠాక్రే కోరాడు..’’
- సంచలనంగా మారుతున్న దిశా సాలియన్ మృతి కేసు..
- ఆదిత్య ఠాక్రే పేరు తీసుకురావద్దని ఉద్ధవ్ ఠాక్రే కోరాడు..
- ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఆదిత్యను అరెస్ట్ చేయాలి..
- ఈ కేసులో బీజేపీ నేత నారాయణ్ రాణే సంచలన వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Disha Salian case: సెలబ్రిటీ మేనేజర్ దిశా సాలియన్ మరణం మరోసారి వార్తాంశంగా మారింది. దిశా తండ్రి సతీష్ సాలియన్ తన కూతురుపై సామూహిత్య అత్యాచారం జరిగిందని ఆరోపిస్తూ, బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం సంచలనంగా మారింది. ఈ కేసులో ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు, మాజీ మంత్రి ఆదిత్య ఠాక్రే పేరు ఉండటం ఇప్పుడు రాజకీయంగా ఈ కేసులు ప్రాధాన్యత సంతరించుకుంది. దిశా సాలియన్ ముంబైలోని ఒక అపార్ట్మెంట్ 14వ అంతస్తు నుంచి పడిపోయిన చనిపోయినట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటన జరిగిన ఆరు రోజులకే, దివంగత బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ తన ఫ్లాట్లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దిశా సాలియన్ సుశాంత్కి కూడా మేనేజర్గా పనిచేసింది. వీరిద్దరూ ప్రేమించుకున్నారనే ఊహాగానాలు కూడా ఉన్నాయి.
Read Also: Varalakshmi : ఆరుగురు లైంగికంగా వేధించారు.. వరలక్ష్మీ షాకింగ్ కామెంట్స్
Also Read
అయితే, ఈ వ్యవహారంలో శనివారం, బీజేపీ నేత, కేంద్రమంత్రి నారాయణ రాణే సంచలన విషయాలు వెల్లడించారు. విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ..‘‘ఉద్ధవ్ ఠాక్రే తనకు ఫోన్ చేసి ఈ కేసులో తన కొడుకు ఆదిత్య ఠాక్రే పేరు తీసుకురావద్దని కోరారు’’ అని చెప్పాడు. ‘‘ఉద్ధవ్ థాకరే నాకు రెండుసార్లు కాల్ చేసాడు. నాకు మొదటిసారి కాల్ వచ్చినప్పుడు, నేను ముంబైలోని జుహులో ఉన్న నా ఇంటికి వెళ్తున్నాను. ఠాక్రే మాట్లాడుతూ..మీకు పిల్లలు ఉన్నారు. నాకు కూడా ఉన్నారు. మీరు ఈ కేసు గురించి మాట్లాడేటప్పుడు ఆదిత్య ఠాక్రే పేరు ప్రస్తావించవద్దు అని నన్ను అభ్యర్థించారు. ’’ అని నారాయణ్ రాణే విలేకరుల సమావేశంలో చెప్పాడు.
Read Also: Delimitation: మరో 25 ఏళ్లు డీలిమిటేషన్ వద్దు.. స్టాలిన్ మీటింగ్లో 7-పాయింట్ల తీర్మానం..
‘‘ ఒక అమాయకమైన అమ్మాయి హత్యకు గురైంది. దాడి చేసిన వారిని అరెస్ట్ చేయాలి, అందులో రాజీ లేదు.’’ అని తాను ఉద్ధవ్ ఠాక్రేకి స్పష్టం చేశానని రాణే వెల్లడించారు. ఇప్పటి వరకు సేకరించిన ఆధారాల ఆధారంగా ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఆదిత్య ఠాక్రేని అరెస్ట్ చేయాలి అని రాణే అన్నారు. రెండోసారి ఫోన్ చేసిన సమయంలో, తన ఆస్పత్రి అనుమతి కోసం మాట్లాడానని, అయితే, అనుమతి వస్తుందని ఠాక్రే చెప్పారని, కానీ అతడి పేరు(ఆదిత్య) ప్రస్తావించొద్దని మరోసారి అభ్యర్థించారని రాణే వెల్లడించాడు.
అయితే, ఉద్ధవ్ ఠాక్రే ఈ వాదనల్ని తోసిపుచ్చారు. తన కుమారుడు ఆదిత్య ఠాక్రేకి, దిశా సాలియన్ కేసుతో ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. ఆదిత్య మాట్లాడుతూ, తన పేరును అప్రతిష్టపాలు చేసేందుకు బీజేపీ ఈ ఆరోపణలు చేయిస్తుందని విమర్శించారు. మరోవైపు, సుశాంత్ సింగ్ రాజ్పుత్ కూడా హత్యకు గురయ్యాడని రాణే ఆరోపించాడు.
తాజావార్తలు
-
Virat Kohli: ఛేజ్ మాస్టర్ విరాట్ కోహ్లీ సెంచరీ.. 105తో RCBని టాప్కి.. క్రిస్ గేల్ వరల్డ్ రికార్డ్ బ్రేక్
-
Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
-
UP: యూపీలో భారీ తుపాను.. 11 మంది మృతి
-
CM Convoy: ‘నా కాన్వాయ్లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
-
CBI Director: సీబీఐ డైరెక్టర్ ఎంపికపై కేంద్రం కీలక నిర్ణయం.. మళ్లీ లక్కీ ఛాన్స్ ఆయనకే
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!