India-China Border: లద్దాఖ్లో భారత్, చైనా బలగాల ఉపసంహరణ..
- లద్దాఖ్లో భారత్- చైనా బలగాల ఉపసంహరణ..
- డెమ్చోక్- డెస్పాంగ్ నుంచి ఇరుదేశాల బలగాలు వెనక్కి వెళ్లినట్లు వెల్లడి..
- టెంట్లు.. తాత్కాలిక నిర్మాణాలను ఇరుదేశాలు తొలగిస్తున్నాయి: భారత రక్షణ శాఖ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India-China Border: భారత్- చైనా దేశాల మధ్య వాస్తవాధీన రేఖ వెంబడి గత నాలుగేళ్లుగా కొనసాగుతున్న ఉద్రిక్తతలకు ముగింపు పలికేందుకు ఇటీవల ఇరు దేశాల మధ్య కీలక ఒప్పందం జరిగింది. అందుకు అనుగుణంగానే సరిహద్దుల్లో బలగాల ఉపసంహరణ ప్రక్రియ తాజాగా ప్రారంభమైంది. తూర్పు లద్దాఖ్ సెక్టార్లోని రెండు కీలక ప్రాంతాలైన డెమ్చోక్, డెస్పాంగ్ నుంచి రెండు దేశాల బలగాలు వెనక్కి వెళ్లినట్లు భారత రక్షణ శాఖ అధికారులు ఈరోజు (శుక్రవారం) తెలిపారు.
Read Also: Minister Narayana: దాచేపల్లిలో డయేరియాపై మంత్రి నారాయణ సమీక్ష..
Also Read
- National Doctors Day 2026: మద్యం, ఒత్తిడి, మధుమేహం.. ప్రజల్లో ఉన్న అపోహలపై వైద్యుల క్లారిటీ
- Delhi EV Policy 2026: ఢిల్లీలో ఈవీ విప్లవం.. మరి పెట్రోల్, డీజిల్ వాహనాల భవిష్యత్ ఏంటి?
- Pawan Kalyan Meets Devendra Fadnavis: పవన్ – ఫడ్నవీస్ భేటీ.. పులుల సంరక్షణపై కీలక నిర్ణయం
- Home Delivery Tragedy: యూట్యూబ్ వీడియోలు చూసి ఇంట్లో ప్రసవం.. భర్తపై కేసు..!
ఇక, ఒప్పందం ప్రకారం.. ఈ ప్రాంతంలోని సైనిక సామగ్రి, ఇతర పరికరాలను భారత బలగాలు వెనక్కి తీసుకొస్తున్నట్లు పేర్కొన్నారు. ఇక్కడి టెంట్లు, తాత్కాలిక నిర్మాణాలను కూడా ఇరు దేశాల బలగాలు తొలగిస్తున్నట్లు భారత రక్షణ శాఖ అధికారులు చెప్పుకొచ్చారు. చార్దింగ్ లా పాస్కు సమీపంలోని నదికి పశ్చిమదిశగా భారత బలగాలు, తూర్పు దిశగా చైనా బలగాలు వెనక్కివెళ్తున్నట్లు తెలిపాయి. ఈప్రాంతాల్లో సరిహద్దులకు ఇరు వైపులా దాదాపు 10-12 తాత్కాలిక నిర్మాణాలు, 12 టెంట్లు నిర్మించినట్లు సమాచారం. బలగాల ఉపసంహరణ ప్రక్రియంతా పూర్తైన తర్వాత మరో 4-5 రోజుల్లో డెస్పాంగ్, డెమ్చోక్ ప్రాంతాల్లో పెట్రోలింగ్ను పునరుద్ధరించబోతున్నట్లు వెల్లడించారు.
కాగా, వాస్తవాధీన రేఖ వెంబడి గస్తీ పునఃప్రారంభంపై ఇరు దేశాలు ఒప్పందం చేసుకున్నాయి. దీని ప్రకారం.. ఎల్ఏసీ వెంబడి 2020 గల్వాన్ ఘర్షణలకు ముందు నాటి యథాస్థితి కొనసాగనున్నాయి. భారత్- చైనా దేశాల సైనికులు 2020లో గస్తీ నిర్వహించిన పెట్రోలింగ్ పాయింట్లకు ఇప్పుడు స్వేచ్ఛగా వెళ్లొచ్చు. ఇటీవల జరిగిన బ్రిక్స్ సమ్మిట్ లో ఇరు దేశాల నేతలు ప్రధాని మోడీ, జిన్ పింగ్ ఈ ఒప్పందాన్ని ధ్రువీకరించారు.
తాజావార్తలు
-
RRB Technician Recruitment 2026: రైల్వేలో 6,557 ఉద్యోగాలు.. నేటి నుంచి దరఖాస్తులు ప్రారంభం, పూర్తి వివరాలు ఇవే
-
National Doctors Day 2026: మద్యం, ఒత్తిడి, మధుమేహం.. ప్రజల్లో ఉన్న అపోహలపై వైద్యుల క్లారిటీ
-
LA 2028 Olympics: ఒలింపిక్స్లో భారత్-పాక్ హైవోల్టేజ్ మ్యాచ్ ఉంటుందా? క్లారిటీ ఇదిగో..
-
Samudra: ఆ వసూళ్లతో నాకేం సంబంధం లేదు.. ఎవరైనా నా పేరు వాడితే ఊరుకోను
-
Sudha Kongara: ఆ సినిమా రిలీజ్ ఆపండి.. కోర్టుకెక్కిన సుధా కొంగర!
ట్రెండింగ్
-
Jai Moondra: వాడు మనోడు కాదు.. పగోడు.. మొత్తం పరువు తీసేశాడుగా!
-
Inspiring Success Story: అమ్మ బంగారు గాజులు.. కూతురి బంగారు భవిష్యత్తు.. యువతి ఎమోషనల్ పోస్ట్ వైరల్
-
IND vs ENG 1st T20: తొలి టీ20లో వైభవ్ అరంగేట్రం.. సంజుకు కూడా ఛాన్స్.. వేటు ఎవరిపై!
-
PBKS Star: పంజాబ్ కింగ్స్ స్టార్ క్రికెటర్పై ఎఫ్ఐఆర్ నమోదు.. వంట మనిషిపై..!
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!