Puja khedkar: యూపీఎస్సీ చర్యపై ఢిల్లీ హైకోర్టులో విచారణ.. రద్దు ఉత్తర్వులు అందలేదన్న పూజా
- యూపీఎస్సీ చర్యపై ఢిల్లీ హైకోర్టులో విచారణ
- రద్దు ఉత్తర్వులు అందలేదన్న పూజా ఖేద్కర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వివాదాస్పద మాజీ ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్.. యూపీఎస్సీ చర్యను సవాల్ చేస్తూ ఢిల్లీ హైకోర్టులో వేసిన పిటిషన్పై బుధవారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఐఏఎస్ అభ్యర్థిత్వాన్ని రద్దు చేస్తూ యూపీఎస్సీ తీసుకున్న చర్యలకు సంబంధించిన ఉత్తర్వులు తనకు అందలేదని విచారణ సందర్భంగా పూజా ఖేద్కర్ న్యాయస్థానానికి తెలిపింది. తన అభ్యర్థిత్వాన్ని రద్దు చేసినట్లుగా కేవలం తాను మీడియాతో ద్వారా తెలుసుకున్నట్లు ఆమె పేర్కొంది. ఐఏఎస్ అభ్యర్థిత్వం రద్దుతో పటు భవిష్యత్లో జరిగే అన్ని పరీక్షల నుంచి యూపీఎస్సీ డిబార్ చేసనట్లుగా మీడియాలో కథనాలు చూసినట్లు ఆమె ధర్మాసనానికి తెలిపింది. పూజా ఖేద్కర్ పిటిషన్ను న్యాయమూర్తి జ్యోతి సింగ్ విచారించారు.
ఇది కూడా చదవండి: Uttam Kumar Reddy: ఉత్తమ్ కుమార్ రెడ్డి చైర్మన్ గా కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు..
Also Read
- PM Modi: నార్వే నుంచి ఇటలీకి బయల్దేరిన మోడీ.. జార్జియా మెలోనితో భేటీకానున్న ప్రధాని
- EPFO: పీఎఫ్ ఖాతాదారులకు పండగలాంటి న్యూస్.. ఇకపై నిమిషాల్లోనే జేబుల్లోకి క్యాష్!
- PM Modi: భారత్-నార్వే ప్రపంచ శాంతిని కోరుకుంటున్నాయి.. ఉగ్రవాదం విషయంలో రాజీపడబోమన్న మోడీ
- CM Vijay: రాజీవ్గాంధీ హంతకుడికి సీఎం విజయ్ నివాళి.. రాజకీయ దుమారం రేపుతోన్న వ్యవహారం
అయితే పూజా ఖేద్కర్ అభ్యర్థిత్వాన్ని రద్దు చేసినట్లుగా అధికారిక ఉత్తర్వుపై రెండు రోజుల్లో కమ్యూనికేట్ చేస్తామని యూపీఎస్సీ న్యాయస్థానానికి స్పష్టం చేసింది. యూపీఎస్సీ తరపున న్యాయవాది నరేష్ కౌశిక్ పేర్కొన్నారు. ఖేద్కర్ అందుబాటులో లేనందున పత్రికా ప్రకటన ద్వారా తెలియజేయడం జరిగిందని తెలిపారు. షోకాజ్ నోటీసు జారీ చేసినా.. ఆమె స్పందించకపోవడంతో యూపీఎస్సీ చర్యలు తీసుకుందని తెలిపారు.
ఇది కూడా చదవండి: Anchor Suma : వివాదంలో యాంకర్ సుమ.. న్యాయం చేయాలంటూ వేడుకోలు!
2023 ఐఏఎస్ బ్యాచ్కు చెందిన పూజా ఖేద్కర్.. అక్రమంగా యూపీఎస్సీ ఉద్యోగాన్ని సంపాదించినట్లుగా ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆమెకు యూపీఎస్సీ షోకాజ్ నోటీసు జారీ చేసింది. జూలై 30 వరకు అవకాశం ఇచ్చినా స్పందన రాకపోవడంతో.. జూలై 31న ఆమె అభ్యర్థిత్వాన్ని.. భవిష్యత్లో జరిగే అన్ని రకాల పరీక్షల నుంచి డిబార్ చేసినట్లుగా యూపీఎస్సీ పేర్కొంది. ఇక ఆమెపై ఢిల్లీ పోలీసులు క్రిమినల్ కేసు బుక్ చేశారు. దీనిపై ఢిల్లీ కోర్టులో ముందుస్తు బెయిల్ పిటిషన్ వేయగా.. న్యాయస్థానం తిరస్కరించింది. ఇదిలా ఉంటే పూజా దుబాయ్ పారిపోయినట్లుగా జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
ఇది కూడా చదవండి: Guess the Celebrity: పవన్-రేణు దేశాయ్ పక్కన కూర్చున్న ఈ పాపను గుర్తు పట్టారా?
తాజావార్తలు
-
Dragon Glimpse: ‘డ్రాగన్’ బాక్సాఫీస్ ఊచకోత ఖాయం.. ప్రశాంత్ నీల్ మైండ్ బ్లాకింగ్ గ్లింప్స్!
-
CI: సహాయం కోరితే సహజీవనం చేశాడు.. మహిళ జీవితంతో ఆడుకున్న సీఐ..
-
Hyderabad: పెళ్లికి ముందే తల్లయింది.. చివరికి ప్రియుడిని పెళ్లాడేందుకు కన్నింగ్ ప్లాన్
-
Trump Warning: ‘వాళ్లకు మరో భారీ దెబ్బ ఇవ్వాల్సి రావచ్చు’.. ఇరాన్కు ట్రంప్ తాజా వార్నింగ్
-
Mitchell Marsh: సెంచరీ మిస్.. బ్యాటింగ్ ‘టార్చర్’ అనిపించింది.. మిచెల్ మార్ష్ ఆవేదన..
ట్రెండింగ్
-
Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!