New Delh: దేశంలో పెరుగుతోన్న మధుమేహం.. నాలుగేళ్లలో 44% పెరుగుదల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
New Delh: ఇవ్వాలా? రేపు ఎవరిని అడిగినా ఎలా ఉన్నావంటే.. ఏముంది కొంచెం షుగర్(మధుమేహం) పెరిగిందనో.. లేకపోతే తగ్గిందనో చెబుతున్న సంఘటనలు చూస్తున్నాం. దేశంలో రోజు రోజుకు మధుమేహం వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరిగిపోతోంది. మధుమేహం వయస్సులతో సంబంధం లేకుండా.. అన్ని వయస్సుల వారికి వస్తోంది. గత కొన్ని సంవత్సరాలుగా భారతదేశంలో మధుమేహం పెరుగుతోందని ఐసీఎంఆర్ నిర్వహించిన సర్వేలో తేలింది. గడచిన నాలుగేళ్ల కాలంలో 44 శాతం పెరిగింది. దేశంలో 10 కోట్ల మందికంటే ఎక్కువ మందిలో మధుమేహం ఉన్నట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి.
Read also: Gangula Kamalakar: చెరువులో పడ్డ మంత్రి గంగుల కమలాకర్
Also Read
- Ayodhya Ram Mandir: రూ.4కోట్లు చెక్ ఇచ్చింది.. అకౌంట్లో చూస్తే 3 రూపాయలే ఉన్నాయ్..అయోధ్య చెక్ బౌన్స్ కథ వింటే..
- GLOF Risk in India: నేపాల్ వరదల తర్వాత భారత్కు భారీ ముప్పు.. హిమాలయాల్లో 200 ‘జల బాంబులు’?
- Rahul Gandhi: రాహుల్ గాంధీపై ఎఫ్ఐఆర్.. హల్ద్వానీ ‘శుద్ధీకరణ’ వివాదంలో కేసు నమోదు
- Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
దేశంలో డయాబెటిస్ బారినపడుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతుందని రిపోర్టులు పేర్కొంటున్నాయి. 2019లో 70 మిలియన్ల మందితో పోలిస్తే ఇండియాలో ఇప్పుడు 101 మిలియన్ల మంది మధుమేహంతో బాధపడుతున్నారని యూకే మెడికల్ జర్నల్ లాన్సెట్ లో ప్రచురించిన ఐసీఎంఆర్ అధ్యయనం తెలిపింది. కొన్ని అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లో మధుమేహ వ్యాధిగ్రస్తుల సంఖ్య స్థిరంగా ఉన్నప్పటికీ.. అనేక రాష్ట్రాల్లో అవి భయంకరమైన రేటుతో పెరుగుతున్నాయనీ, తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఈ అధ్యయనం పేర్కొంది. దేశంలో 136 మిలియన్ల మందికి అంటే జనాభాలో 15.3 శాతం మందికి ప్రీడయాబెటిస్ ఉందని తెలిపింది. డయాబెటిస్ అత్యధికంగా గోవాలో (26.4%), పుదుచ్చేరిలో (26.3%), కేరళలో (25.5%)గా ఉంది. అయితే జాతీయ డయాబెటిస్ సగటు 11.4 శాతం ఉంది. డయాబెటిస్ కేసుల వ్యాప్తి యూపీ, మధ్యప్రదేశ్ వంటి తక్కువగా ఉన్న రాష్ట్రాలతో పాటు బీహార్, అరుణాచల్ ప్రదేశ్ లో క్రమంగా పెరుగుతున్నారు.
Read also: Sharad Pawar: శరద్ పవార్, సుప్రియా సూలేలను చంపేస్తాం.. ట్విట్టర్లో హత్య బెదిరింపులు
గోవా, కేరళ, తమిళనాడు, చండీగఢ్లలో మధుమేహ కేసులతో పోలిస్తే ప్రీ-డయాబెటిస్ కేసులు తక్కువగా ఉన్నాయి. పుదుచ్చేరి, ఢిల్లీలలో దాదాపు సమానంగా ఉన్నాయి. మధుమేహం తక్కువగా ఉన్న రాష్ట్రాల్లో ప్రీ-డయాబెటిస్ లో ఉన్నవారు అధికంగా ఉన్నారని మద్రాస్ డయాబెటిస్ రీసెర్చ్ ఫౌండేషన్ అధ్యక్షుడు డాక్టర్ రంజిత్ మోహన్ అంజనా అన్నారు. యూపీలో డయాబెటిస్ ప్రాబల్యం 4.8 శాతంగా ఉందని… ఇది దేశంలోనే అత్యల్పమన్నారు. జాతీయ సగటు 18.15 శాతంతో పోలిస్తే 3 శాతం మంది డయాబెటిస్ వారు ఉన్నారు. యూపీలో డయాబెటిస్ ఉన్న ప్రతి వ్యక్తికి ప్రీ డయాబెటిస్ ఉన్నవారు దాదాపు నలుగురు ఉన్నారు. ప్రీ-డయాబెటిక్ అంటే సాధారణం కంటే ఎక్కువ రక్తంలో చక్కెర స్థాయి ఉన్న వ్యక్తి, కానీ టైప్ -2 డయాబెటిస్ గా పరిగణించేంత ఎక్కువగా లేదు. జీవనశైలిలో మార్పులు లేకుండా, పెద్దలు-ప్రీ డయాబెటిస్ ఉన్న పిల్లలకు డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఉందని వైద్యలు చెబుతున్నారు. డయాబెటిస్ మూలంగా రక్తపోటు, కొలెస్ట్రాల్ స్థాయిలు పెరగడం, ఊబకాయం వంటి ఇతర ప్రమాద కారకాలు ఉంటాయి. ఇది కార్డియాక్ అరెస్ట్, స్ట్రోక్, మూత్రపిండాల వ్యాధి ప్రమాదాన్ని పెంచుతుంది.
తాజావార్తలు
-
Ayodhya Ram Mandir: రూ.4కోట్లు చెక్ ఇచ్చింది.. అకౌంట్లో చూస్తే 3 రూపాయలే ఉన్నాయ్..అయోధ్య చెక్ బౌన్స్ కథ వింటే..
-
NBK 112 : బాలయ్య – కొరటాల సినిమాలో తమిళ స్టార్ హీరో?
-
Se*xual Assault: తుక్కుగూడ నర్సు శిరీష హత్య కేసు.. లైంగిక దాడి చేసినట్లు నిర్ధారణ.. నిందితుడి అరెస్ట్.!
-
Sardar 2: కార్తి ‘సర్దార్ 2’ ట్రైలర్ కు టైమ్ ఫిక్స్ చేసిన మేకర్స్!
-
CTET 2026: సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్.. దరఖాస్తుకు రేపే చివరి ఛాన్స్..
ట్రెండింగ్
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!