New Delh: దేశంలో పెరుగుతోన్న మధుమేహం.. నాలుగేళ్లలో 44% పెరుగుదల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
New Delh: ఇవ్వాలా? రేపు ఎవరిని అడిగినా ఎలా ఉన్నావంటే.. ఏముంది కొంచెం షుగర్(మధుమేహం) పెరిగిందనో.. లేకపోతే తగ్గిందనో చెబుతున్న సంఘటనలు చూస్తున్నాం. దేశంలో రోజు రోజుకు మధుమేహం వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరిగిపోతోంది. మధుమేహం వయస్సులతో సంబంధం లేకుండా.. అన్ని వయస్సుల వారికి వస్తోంది. గత కొన్ని సంవత్సరాలుగా భారతదేశంలో మధుమేహం పెరుగుతోందని ఐసీఎంఆర్ నిర్వహించిన సర్వేలో తేలింది. గడచిన నాలుగేళ్ల కాలంలో 44 శాతం పెరిగింది. దేశంలో 10 కోట్ల మందికంటే ఎక్కువ మందిలో మధుమేహం ఉన్నట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి.
Read also: Gangula Kamalakar: చెరువులో పడ్డ మంత్రి గంగుల కమలాకర్
Also Read
దేశంలో డయాబెటిస్ బారినపడుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతుందని రిపోర్టులు పేర్కొంటున్నాయి. 2019లో 70 మిలియన్ల మందితో పోలిస్తే ఇండియాలో ఇప్పుడు 101 మిలియన్ల మంది మధుమేహంతో బాధపడుతున్నారని యూకే మెడికల్ జర్నల్ లాన్సెట్ లో ప్రచురించిన ఐసీఎంఆర్ అధ్యయనం తెలిపింది. కొన్ని అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లో మధుమేహ వ్యాధిగ్రస్తుల సంఖ్య స్థిరంగా ఉన్నప్పటికీ.. అనేక రాష్ట్రాల్లో అవి భయంకరమైన రేటుతో పెరుగుతున్నాయనీ, తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఈ అధ్యయనం పేర్కొంది. దేశంలో 136 మిలియన్ల మందికి అంటే జనాభాలో 15.3 శాతం మందికి ప్రీడయాబెటిస్ ఉందని తెలిపింది. డయాబెటిస్ అత్యధికంగా గోవాలో (26.4%), పుదుచ్చేరిలో (26.3%), కేరళలో (25.5%)గా ఉంది. అయితే జాతీయ డయాబెటిస్ సగటు 11.4 శాతం ఉంది. డయాబెటిస్ కేసుల వ్యాప్తి యూపీ, మధ్యప్రదేశ్ వంటి తక్కువగా ఉన్న రాష్ట్రాలతో పాటు బీహార్, అరుణాచల్ ప్రదేశ్ లో క్రమంగా పెరుగుతున్నారు.
Read also: Sharad Pawar: శరద్ పవార్, సుప్రియా సూలేలను చంపేస్తాం.. ట్విట్టర్లో హత్య బెదిరింపులు
గోవా, కేరళ, తమిళనాడు, చండీగఢ్లలో మధుమేహ కేసులతో పోలిస్తే ప్రీ-డయాబెటిస్ కేసులు తక్కువగా ఉన్నాయి. పుదుచ్చేరి, ఢిల్లీలలో దాదాపు సమానంగా ఉన్నాయి. మధుమేహం తక్కువగా ఉన్న రాష్ట్రాల్లో ప్రీ-డయాబెటిస్ లో ఉన్నవారు అధికంగా ఉన్నారని మద్రాస్ డయాబెటిస్ రీసెర్చ్ ఫౌండేషన్ అధ్యక్షుడు డాక్టర్ రంజిత్ మోహన్ అంజనా అన్నారు. యూపీలో డయాబెటిస్ ప్రాబల్యం 4.8 శాతంగా ఉందని… ఇది దేశంలోనే అత్యల్పమన్నారు. జాతీయ సగటు 18.15 శాతంతో పోలిస్తే 3 శాతం మంది డయాబెటిస్ వారు ఉన్నారు. యూపీలో డయాబెటిస్ ఉన్న ప్రతి వ్యక్తికి ప్రీ డయాబెటిస్ ఉన్నవారు దాదాపు నలుగురు ఉన్నారు. ప్రీ-డయాబెటిక్ అంటే సాధారణం కంటే ఎక్కువ రక్తంలో చక్కెర స్థాయి ఉన్న వ్యక్తి, కానీ టైప్ -2 డయాబెటిస్ గా పరిగణించేంత ఎక్కువగా లేదు. జీవనశైలిలో మార్పులు లేకుండా, పెద్దలు-ప్రీ డయాబెటిస్ ఉన్న పిల్లలకు డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఉందని వైద్యలు చెబుతున్నారు. డయాబెటిస్ మూలంగా రక్తపోటు, కొలెస్ట్రాల్ స్థాయిలు పెరగడం, ఊబకాయం వంటి ఇతర ప్రమాద కారకాలు ఉంటాయి. ఇది కార్డియాక్ అరెస్ట్, స్ట్రోక్, మూత్రపిండాల వ్యాధి ప్రమాదాన్ని పెంచుతుంది.
తాజావార్తలు
-
Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
-
UP: యూపీలో భారీ తుపాను.. 11 మంది మృతి
-
CM Convoy: ‘నా కాన్వాయ్లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
-
CBI Director: సీబీఐ డైరెక్టర్ ఎంపికపై కేంద్రం కీలక నిర్ణయం.. మళ్లీ లక్కీ ఛాన్స్ ఆయనకే
-
Pakistan: ‘‘భారత్, ఆఫ్ఘనిస్తాన్ ఒకటే’’.. పాక్ రక్షణ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!