New Delh: దేశంలో పెరుగుతోన్న మధుమేహం.. నాలుగేళ్లలో 44% పెరుగుదల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
New Delh: ఇవ్వాలా? రేపు ఎవరిని అడిగినా ఎలా ఉన్నావంటే.. ఏముంది కొంచెం షుగర్(మధుమేహం) పెరిగిందనో.. లేకపోతే తగ్గిందనో చెబుతున్న సంఘటనలు చూస్తున్నాం. దేశంలో రోజు రోజుకు మధుమేహం వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరిగిపోతోంది. మధుమేహం వయస్సులతో సంబంధం లేకుండా.. అన్ని వయస్సుల వారికి వస్తోంది. గత కొన్ని సంవత్సరాలుగా భారతదేశంలో మధుమేహం పెరుగుతోందని ఐసీఎంఆర్ నిర్వహించిన సర్వేలో తేలింది. గడచిన నాలుగేళ్ల కాలంలో 44 శాతం పెరిగింది. దేశంలో 10 కోట్ల మందికంటే ఎక్కువ మందిలో మధుమేహం ఉన్నట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి.
Read also: Gangula Kamalakar: చెరువులో పడ్డ మంత్రి గంగుల కమలాకర్
Also Read
- IMD Big Alert: దేశాన్ని కమ్ముకున్న మేఘాలు.. భారీ వర్షాలకు హెచ్చరిక.. ఇస్రో చిత్రాలు విడుదల
- CJP Protest: ‘మోడీ ప్రభుత్వానికి ఇదే చివరి రోజు’.. ప్రాణత్యాగాలకు సిద్ధంకండి.. సీక్రెట్ యాప్పై దర్యాప్తు
- Delhi: ప్రధాని నివాసం ముందు కాంగ్రెస్ ధర్నా.. రాహుల్ గాంధీతో కేంద్రమంత్రి చర్చలు..
- Supreme Court: భర్తల పొట్టకొట్టొద్దు.. భార్యల తీరుపై సుప్రీంకోర్టు కామెంట్స్..
దేశంలో డయాబెటిస్ బారినపడుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతుందని రిపోర్టులు పేర్కొంటున్నాయి. 2019లో 70 మిలియన్ల మందితో పోలిస్తే ఇండియాలో ఇప్పుడు 101 మిలియన్ల మంది మధుమేహంతో బాధపడుతున్నారని యూకే మెడికల్ జర్నల్ లాన్సెట్ లో ప్రచురించిన ఐసీఎంఆర్ అధ్యయనం తెలిపింది. కొన్ని అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లో మధుమేహ వ్యాధిగ్రస్తుల సంఖ్య స్థిరంగా ఉన్నప్పటికీ.. అనేక రాష్ట్రాల్లో అవి భయంకరమైన రేటుతో పెరుగుతున్నాయనీ, తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఈ అధ్యయనం పేర్కొంది. దేశంలో 136 మిలియన్ల మందికి అంటే జనాభాలో 15.3 శాతం మందికి ప్రీడయాబెటిస్ ఉందని తెలిపింది. డయాబెటిస్ అత్యధికంగా గోవాలో (26.4%), పుదుచ్చేరిలో (26.3%), కేరళలో (25.5%)గా ఉంది. అయితే జాతీయ డయాబెటిస్ సగటు 11.4 శాతం ఉంది. డయాబెటిస్ కేసుల వ్యాప్తి యూపీ, మధ్యప్రదేశ్ వంటి తక్కువగా ఉన్న రాష్ట్రాలతో పాటు బీహార్, అరుణాచల్ ప్రదేశ్ లో క్రమంగా పెరుగుతున్నారు.
Read also: Sharad Pawar: శరద్ పవార్, సుప్రియా సూలేలను చంపేస్తాం.. ట్విట్టర్లో హత్య బెదిరింపులు
గోవా, కేరళ, తమిళనాడు, చండీగఢ్లలో మధుమేహ కేసులతో పోలిస్తే ప్రీ-డయాబెటిస్ కేసులు తక్కువగా ఉన్నాయి. పుదుచ్చేరి, ఢిల్లీలలో దాదాపు సమానంగా ఉన్నాయి. మధుమేహం తక్కువగా ఉన్న రాష్ట్రాల్లో ప్రీ-డయాబెటిస్ లో ఉన్నవారు అధికంగా ఉన్నారని మద్రాస్ డయాబెటిస్ రీసెర్చ్ ఫౌండేషన్ అధ్యక్షుడు డాక్టర్ రంజిత్ మోహన్ అంజనా అన్నారు. యూపీలో డయాబెటిస్ ప్రాబల్యం 4.8 శాతంగా ఉందని… ఇది దేశంలోనే అత్యల్పమన్నారు. జాతీయ సగటు 18.15 శాతంతో పోలిస్తే 3 శాతం మంది డయాబెటిస్ వారు ఉన్నారు. యూపీలో డయాబెటిస్ ఉన్న ప్రతి వ్యక్తికి ప్రీ డయాబెటిస్ ఉన్నవారు దాదాపు నలుగురు ఉన్నారు. ప్రీ-డయాబెటిక్ అంటే సాధారణం కంటే ఎక్కువ రక్తంలో చక్కెర స్థాయి ఉన్న వ్యక్తి, కానీ టైప్ -2 డయాబెటిస్ గా పరిగణించేంత ఎక్కువగా లేదు. జీవనశైలిలో మార్పులు లేకుండా, పెద్దలు-ప్రీ డయాబెటిస్ ఉన్న పిల్లలకు డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఉందని వైద్యలు చెబుతున్నారు. డయాబెటిస్ మూలంగా రక్తపోటు, కొలెస్ట్రాల్ స్థాయిలు పెరగడం, ఊబకాయం వంటి ఇతర ప్రమాద కారకాలు ఉంటాయి. ఇది కార్డియాక్ అరెస్ట్, స్ట్రోక్, మూత్రపిండాల వ్యాధి ప్రమాదాన్ని పెంచుతుంది.
తాజావార్తలు
-
IMD Big Alert: దేశాన్ని కమ్ముకున్న మేఘాలు.. భారీ వర్షాలకు హెచ్చరిక.. ఇస్రో చిత్రాలు విడుదల
-
Fauji vs King: బాక్సాఫీస్ వార్.. ప్రభాస్ ‘ఫౌజీ’ vs షారుఖ్ ‘కింగ్’.. వెయ్యి కోట్ల వేటలో విజేత ఎవరు?
-
KVN : విజయ్ లెగసీకి అదిరిపోయే ట్రిబ్యూట్.. ‘జన నాయకుడు’
-
CJP Protest: ‘మోడీ ప్రభుత్వానికి ఇదే చివరి రోజు’.. ప్రాణత్యాగాలకు సిద్ధంకండి.. సీక్రెట్ యాప్పై దర్యాప్తు
-
Murali Kishor: ‘లెనిన్’ డైరెక్టర్కు బిగ్ ఛాన్స్.. సితారలోనే నెక్స్ట్ మూవీ! ఆ స్టార్ హీరో సినిమా?
ట్రెండింగ్
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!
-
తెలంగాణ ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ (TGTET-2026) నోటిఫికేషన్ విడుదల..!
-
స్క్రీన్ లేకుండానే పనిచేసే Google Fitbit Air త్వరలో భారత్లో లాంచ్.. ఫీచర్స్ ఇవే.!