Sabarimala: భక్త సంద్రంగా శబరిమల.. అయ్యప్ప ఆలయం వద్ద తాజా పరిస్థితులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sabarimala: శబరిమలలో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు కేరళ నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పోటెత్తడంతో స్వామివారి దర్శనంలో జాప్యం జరుగుతోంది. దీంతో అయ్యప్ప దర్శనం కోసం భక్తులు గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొన్నాయి. కొందరు భక్తులు అయితే అయ్యప్ప దర్శనం చేసుకోకుండా వెనుదిరుగుతున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ట్రావెన్కోర్ దేవస్థానం స్వామివారి దర్శన సమయాన్ని గంటపాటు పెంచినా.. భక్తులు మాత్రం స్వామివారి దర్శనం చేసుకోలేకపోతున్నారు. ప్రస్తుతం శబరిమల భక్తులతో కిటకిటలాడుతుండగా, అయ్యప్ప శరణు ఘోషతో మారుమ్రోగుతోంది. అయితే.. శబరిమలకు వెళ్లే రహదారులపై భారీగా ట్రాఫిక్ జామ్లు ఏర్పడ్డాయి. దీంతో అయ్యప్ప స్వామి భక్తులు దారిలో ఇబ్బందులు పడుతున్నారు. శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తులు రోజుల తరబడి వాహనాలు రాకపోకలు సాగిస్తుండటంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, తమ సమస్యలను పరిష్కరించాలని ట్రావెన్కోర్ దేవస్థానం అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు.
Read also: Dhiraj Sahu : బీరువాలు అయిపోయినయ్.. ఇంటి గోడలపై ఫోకస్ చేస్తున్న అధికారులు
Also Read
- Chhattisgarh Congress: ఛత్తీస్గఢ్లోని కాంగ్రెస్ ఆఫీస్లో వింతైన ఘటన.. నల్లాలు దొంగిలించి.. నేలపై 'లవ్ యూ' నోట్!
- Bhojshala Case: "భోజ్శాల ఆలయం కాదు".. హైకోర్టు తీర్పుపై కాంగ్రెస్ నేత వ్యాఖ్యలు..
- Bangladesh: ‘‘గంగా నది’’పైనే భారత సంబంధాలు ఆధారపడుతాయి..
- VD Satheesan Oath Ceremony: రేపే కేరళంలో కొలువుదీరనున్న కొత్త సర్కార్.. చీఫ్ గెస్ట్లు వీరే!
శబరిమల అయ్యప్పను దర్శించుకునేందుకు వెళ్లే భక్తుల రద్దీ ఊహించిన దానికంటే ఎక్కువగా ఉండడంతో ఆలయ అధికారులు, సౌకర్యాలు సరిపోవడం లేదు. కాగా, శబరిమలకు భక్తులు అధిక సంఖ్యలో వెళుతుండటంతో భక్తుల సౌకర్యార్థం దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. శబరిమల పుణ్యక్షేత్రానికి వెళ్లే వారి కోసం తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలను కలుపుతూ డిసెంబర్, జనవరి నెలల్లో వేర్వేరు తేదీల్లో మొత్తం 51 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. మాజీ వివిధ తేదీలలో నడుస్తున్న రైళ్ల సంఖ్యలు మరియు తేదీలతో పాటు అనేక వివరాలను పంచుకున్నారు. ఈ ప్రత్యేక రైళ్లలో ఫస్ట్ ఏసీ, సెకండ్ క్లాస్ ఏసీ, థర్డ్ క్లాస్ ఏసీ, స్లీపర్, సెకండ్ క్లాస్ కోచ్లు ఉంటాయని అధికారులు తెలిపారు. దక్షిణ మధ్య రైల్వే ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నుంచి వివిధ తేదీల్లో ప్రత్యేక రైళ్ల చార్ట్ను ప్రకటించింది.
Sabarimala Season Special Trains #Sabarimala #SCR @drmhyb @drmsecunderabad @drmvijayawada @drmgnt @drmgtl @drmned pic.twitter.com/OX7NYNjOcR
— South Central Railway (@SCRailwayIndia) December 12, 2023
తాజావార్తలు
-
Satish Kilaru: ‘పెద్ది’లో సుకుమార్ ఇన్వాల్వ్మెంట్..? లాస్ట్ డే డైరెక్టర్ బుచ్చిబాబు చాలా ఎమోషనల్ అయ్యారు!
-
AP Government: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. జూన్ 12 నుంచి ప్రారంభం..
-
PBKS Vs RCB: కోహ్లీ, వెంకటేశ్ అయ్యర్ వీర విహారం.. భారీ స్కోర్ సాధించిన ఆర్సీబీ..
-
Taiwan: ‘‘మేము చైనా బానిసలం కాదు’’.. ట్రంప్ ప్రకటనపై తైవాన్ ఆగ్రహం..
-
Satish Kilaru: ఒకటి కాదు ఏకంగా మూడు గాయాలు.. ‘పెద్ది’ షూటింగ్లో చరణ్కు ఏమైందో చెప్పిన నిర్మాత!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..