Sabarimala: భక్త సంద్రంగా శబరిమల.. అయ్యప్ప ఆలయం వద్ద తాజా పరిస్థితులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sabarimala: శబరిమలలో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు కేరళ నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పోటెత్తడంతో స్వామివారి దర్శనంలో జాప్యం జరుగుతోంది. దీంతో అయ్యప్ప దర్శనం కోసం భక్తులు గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొన్నాయి. కొందరు భక్తులు అయితే అయ్యప్ప దర్శనం చేసుకోకుండా వెనుదిరుగుతున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ట్రావెన్కోర్ దేవస్థానం స్వామివారి దర్శన సమయాన్ని గంటపాటు పెంచినా.. భక్తులు మాత్రం స్వామివారి దర్శనం చేసుకోలేకపోతున్నారు. ప్రస్తుతం శబరిమల భక్తులతో కిటకిటలాడుతుండగా, అయ్యప్ప శరణు ఘోషతో మారుమ్రోగుతోంది. అయితే.. శబరిమలకు వెళ్లే రహదారులపై భారీగా ట్రాఫిక్ జామ్లు ఏర్పడ్డాయి. దీంతో అయ్యప్ప స్వామి భక్తులు దారిలో ఇబ్బందులు పడుతున్నారు. శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తులు రోజుల తరబడి వాహనాలు రాకపోకలు సాగిస్తుండటంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, తమ సమస్యలను పరిష్కరించాలని ట్రావెన్కోర్ దేవస్థానం అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు.
Read also: Dhiraj Sahu : బీరువాలు అయిపోయినయ్.. ఇంటి గోడలపై ఫోకస్ చేస్తున్న అధికారులు
Also Read
- NEET: దమ్ముంటే ఇప్పుడు లీక్ చేయండి.. నీట్ పరీక్ష కోసం రంగంలోకి ఇండియన్ ఎయిర్ఫోర్స్..
- Iran-Israel War: శాంతించండి.. దాడులు ఆపాలంటూ ఇరాన్, ఇజ్రాయెల్కు భారత్ విజ్ఞప్తి
- Trinamool Congress: బీజేపీకి టీఎంసీ ఎంపీల మద్దతు.. మమత ఖేల్ ఖతం..
- Lakshadweep: లక్షద్వీప్లో మద్యం అమ్మకాలకు గ్రీన్ సిగ్నల్.. 47 ఏళ్ల నిషేధానికి తెర.. కారణం ఇదే..
శబరిమల అయ్యప్పను దర్శించుకునేందుకు వెళ్లే భక్తుల రద్దీ ఊహించిన దానికంటే ఎక్కువగా ఉండడంతో ఆలయ అధికారులు, సౌకర్యాలు సరిపోవడం లేదు. కాగా, శబరిమలకు భక్తులు అధిక సంఖ్యలో వెళుతుండటంతో భక్తుల సౌకర్యార్థం దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. శబరిమల పుణ్యక్షేత్రానికి వెళ్లే వారి కోసం తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలను కలుపుతూ డిసెంబర్, జనవరి నెలల్లో వేర్వేరు తేదీల్లో మొత్తం 51 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. మాజీ వివిధ తేదీలలో నడుస్తున్న రైళ్ల సంఖ్యలు మరియు తేదీలతో పాటు అనేక వివరాలను పంచుకున్నారు. ఈ ప్రత్యేక రైళ్లలో ఫస్ట్ ఏసీ, సెకండ్ క్లాస్ ఏసీ, థర్డ్ క్లాస్ ఏసీ, స్లీపర్, సెకండ్ క్లాస్ కోచ్లు ఉంటాయని అధికారులు తెలిపారు. దక్షిణ మధ్య రైల్వే ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నుంచి వివిధ తేదీల్లో ప్రత్యేక రైళ్ల చార్ట్ను ప్రకటించింది.
Sabarimala Season Special Trains #Sabarimala #SCR @drmhyb @drmsecunderabad @drmvijayawada @drmgnt @drmgtl @drmned pic.twitter.com/OX7NYNjOcR
— South Central Railway (@SCRailwayIndia) December 12, 2023
తాజావార్తలు
-
NEET: దమ్ముంటే ఇప్పుడు లీక్ చేయండి.. నీట్ పరీక్ష కోసం రంగంలోకి ఇండియన్ ఎయిర్ఫోర్స్..
-
Thaman: ఇదే నా లాస్ట్ సినిమా: తమన్
-
RCB Player: ‘ఆర్సీబీకి ఆడాలని నాకు లేదు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన కెప్టెన్ రజత్ పాటిదార్..
-
Iran-Israel War: శాంతించండి.. దాడులు ఆపాలంటూ ఇరాన్, ఇజ్రాయెల్కు భారత్ విజ్ఞప్తి
-
Minister Sridhar Babu : ‘హిట్లర్’ వ్యాఖ్యలపై రగడ.. కేసీఆర్ వీడియోతో శ్రీధర్ బాబు కౌంటర్.!
ట్రెండింగ్
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!