Sabarimala: భక్త సంద్రంగా శబరిమల.. అయ్యప్ప ఆలయం వద్ద తాజా పరిస్థితులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sabarimala: శబరిమలలో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు కేరళ నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పోటెత్తడంతో స్వామివారి దర్శనంలో జాప్యం జరుగుతోంది. దీంతో అయ్యప్ప దర్శనం కోసం భక్తులు గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొన్నాయి. కొందరు భక్తులు అయితే అయ్యప్ప దర్శనం చేసుకోకుండా వెనుదిరుగుతున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ట్రావెన్కోర్ దేవస్థానం స్వామివారి దర్శన సమయాన్ని గంటపాటు పెంచినా.. భక్తులు మాత్రం స్వామివారి దర్శనం చేసుకోలేకపోతున్నారు. ప్రస్తుతం శబరిమల భక్తులతో కిటకిటలాడుతుండగా, అయ్యప్ప శరణు ఘోషతో మారుమ్రోగుతోంది. అయితే.. శబరిమలకు వెళ్లే రహదారులపై భారీగా ట్రాఫిక్ జామ్లు ఏర్పడ్డాయి. దీంతో అయ్యప్ప స్వామి భక్తులు దారిలో ఇబ్బందులు పడుతున్నారు. శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తులు రోజుల తరబడి వాహనాలు రాకపోకలు సాగిస్తుండటంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, తమ సమస్యలను పరిష్కరించాలని ట్రావెన్కోర్ దేవస్థానం అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు.
Read also: Dhiraj Sahu : బీరువాలు అయిపోయినయ్.. ఇంటి గోడలపై ఫోకస్ చేస్తున్న అధికారులు
Also Read
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
- Bangladesh: భారత్, పాకిస్థాన్ను దాటేసిన బంగ్లాదేశ్.. ఏ విషయంలోనో తెలుసా?
- Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
శబరిమల అయ్యప్పను దర్శించుకునేందుకు వెళ్లే భక్తుల రద్దీ ఊహించిన దానికంటే ఎక్కువగా ఉండడంతో ఆలయ అధికారులు, సౌకర్యాలు సరిపోవడం లేదు. కాగా, శబరిమలకు భక్తులు అధిక సంఖ్యలో వెళుతుండటంతో భక్తుల సౌకర్యార్థం దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. శబరిమల పుణ్యక్షేత్రానికి వెళ్లే వారి కోసం తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలను కలుపుతూ డిసెంబర్, జనవరి నెలల్లో వేర్వేరు తేదీల్లో మొత్తం 51 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. మాజీ వివిధ తేదీలలో నడుస్తున్న రైళ్ల సంఖ్యలు మరియు తేదీలతో పాటు అనేక వివరాలను పంచుకున్నారు. ఈ ప్రత్యేక రైళ్లలో ఫస్ట్ ఏసీ, సెకండ్ క్లాస్ ఏసీ, థర్డ్ క్లాస్ ఏసీ, స్లీపర్, సెకండ్ క్లాస్ కోచ్లు ఉంటాయని అధికారులు తెలిపారు. దక్షిణ మధ్య రైల్వే ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నుంచి వివిధ తేదీల్లో ప్రత్యేక రైళ్ల చార్ట్ను ప్రకటించింది.
Sabarimala Season Special Trains #Sabarimala #SCR @drmhyb @drmsecunderabad @drmvijayawada @drmgnt @drmgtl @drmned pic.twitter.com/OX7NYNjOcR
— South Central Railway (@SCRailwayIndia) December 12, 2023
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!