Amruta fadnavis: ఫడ్నవిస్ ప్రమాణస్వీకారంపై భార్య అమృత ఏమన్నారంటే..!
- ఫడ్నవిస్ ప్రమాణస్వీకారంపై భార్య అమృత స్పందన
- అందమైన రోజు అంటూ వ్యాఖ్య
- మరింత బాధ్యత పెరిగిందని వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవిస్ ప్రమాణస్వీకారం చేశారు. ముచ్చటగా మూడోసారి ఫడ్నవిస్ సీఎంగా ప్రమాణం చేశారు. గురవారం ముంబైలోని ఆజాద్ మైదాన్లో జరిగిన ప్రమాణస్వీకార కార్యక్రమంలో ఫడ్నవిస్ చేత గవర్నర్ రాధాకృష్ణన్ ప్రమాణం చేయించారు. ఈ ప్రమాణస్వీకార కార్యక్రమానికి ప్రధాని మోడీ సహా అతిరథ మహరథులంతా హాజరయ్యారు. ఎన్డీఏ మఖ్యమంత్రుల సహా బాలీవుడ్ ప్రముఖులు, వ్యాపార వేత్తలు పాల్గొన్నారు.
ఇదిలా ఉంటే ప్రమాణస్వీకార కార్యక్రమానికి దేవేంద్ర ఫడ్నవిస్ సతీమణి అమృతా ఫడ్నవిస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. అందమైన రోజుగా పేర్కొన్నారు. ఫడ్నవిస్ ఆరోసారి ఎమ్మెల్యేగా ఎన్నికై.. మూడోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం చాలా అందమైన రోజుగా అభివర్ణించారు. చాలా సంతోషంగా ఉందని.. అలాగే మరింత బాధ్యత కూడా పెరిగిందని పేర్కొన్నారు.
Also Read
- Sana Malik: పాకిస్తాన్లోని ఇస్లామిక్ చట్టాన్ని భారత్ లో అమలు చేయాలి.. ఎమ్మెల్యే సనా మాలిక్ సంచలన వ్యాఖ్యలు
- Ketan Agarwal Murder: 6 నెలల ప్లానింగ్.. 2004 ఫోన్ కాల్స్, 238 గంటల టాక్ టైమ్.. వణుకు పుట్టిస్తున్న మర్డర్ స్కెచ్..
- PM Modi: వెనెజువెలాకు భారత్ అండ.. సహాయ సహకారాలు అందిస్తామన్న ప్రధాని మోడీ..
- Ayodhya: రామాలయ నిధుల వివాదంలో కొత్త ట్విస్ట్.. PMOకు సైతం లెక్కలు ఇవ్వని రామ్ మందిర్ ట్రస్ట్!
ముంబైలో జరిగిన ప్రమాణస్వీకారంలో ఫడ్నవిస్తో పాటు డిప్యూటీ సీఎంలుగా షిండే, అజిత్ పవార్ ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ముఖ్యమంత్రులు చంద్రబాబు, నితీష్ కుమార్, యోగి ఆదిత్యనాథ్, ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయి, గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్, గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి తదితరులు పాల్గొన్నారు. కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, శివరాజ్సింగ్ చౌహాన్, చిరాగ్ పాశ్వాన్తో పాటు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. క్రికెటర్ సచిన్ టెండూల్కర్, బాలీవుడ్ స్టార్స్ షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, రణవీర్ సింగ్, మాధురీ దీక్షిత్ వంటి ప్రముఖులు హాజరయ్యారు.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల 2024 ఫలితాల్లో మహాయుతి 235 సీట్లతో భారీ విజయాన్ని సాధించింది. 132 సీట్లతో అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించింది. శివసేన 57, ఎన్సీపీ 41 స్థానాలు గెలుచుకున్నాయి. కాంగ్రెస్ కేవలం 16 స్థానాల్లో గెలుపొందగా… భాగస్వామ్య పక్షాలు శివసేన (యుబిటి), ఎన్సిపి (శరద్ పవార్ వర్గం) వరుసగా 20, 10 స్థానాలను గెలుచుకున్నాయి.
#WATCH | Mumbai: After the oath ceremony, Maharashtra CM Devendra Fadnavis's wife, Amruta Fadnavis says, "I am very happy that Devendra ji has taken oath as the CM for the third time today. Till now, he has spent his life in service of the people and he will continue to do… pic.twitter.com/4XezRZHK6u
— ANI (@ANI) December 5, 2024
తాజావార్తలు
-
iQOO Neo11s: ఐకూ Neo11s వచ్చేస్తోంది.. 8000mAh భారీ బ్యాటరీ, 144Hz 2K డిస్ప్లేతో గేమర్లకు కొత్త పవర్హౌస్!
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
OG Universe : OG – 2 ఊచకోతకు శ్రీకారం చుట్టిన పవర్ స్టార్ – సుజీత్
-
Akash Deep Wedding: ధోనీ, కోహ్లీ, రోహిత్ వస్తే నా పెళ్లి ఆగిపోతుంది.. ఆకాశ్ దీప్ కామెంట్స్ వైరల్!
-
Sana Malik: పాకిస్తాన్లోని ఇస్లామిక్ చట్టాన్ని భారత్ లో అమలు చేయాలి.. ఎమ్మెల్యే సనా మాలిక్ సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!
-
IND vs BAN: నేడు టీమిండియాకు కీలక మ్యాచ్.. గెలవకుంటే ఇంటికే.. కొడితే గట్టిగా కొట్టాల్సిందే!
-
ట్యాబ్లెట్ కాదు.. మినీ ల్యాప్టాప్! 13-అంగుళాల 3.5K డిస్ప్లే, 144Hz డిస్ప్లే, 10,200mAh బ్యాటరీతో Moto Pad 70 Pro..