Maharashtra: ఢిల్లీలో నడ్డాతో ఫడ్నవీస్ చర్చలు.. ముంబైలో గవర్నర్తో భేటీ.. ఏం జరుగుతోంది?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం నేపథ్యంలో బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాతో మాజీ ముఖ్యమంత్రి, ఆ పార్టీ సీనియర్ నేత దేవేంద్ర ఫడ్నవీస్ ఢిల్లీలో మంగళవారం భేటీ అయ్యారు. వారిద్దరి మధ్య దాదాపు 30 నిమిషాల పాటు చర్చ జరిగినట్లు తెలుస్తోంది. మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై వారు చర్చించినట్లు సమాచారం. మహారాష్ట్ర రాజకీయ పరిణామాల గురించి, రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు ఉన్న అవకాశం గురించి నడ్డాకు ఫడ్నవీస్ వివరించినట్లు తెలుస్తోంది.ఇటీవల ఫడ్నవీస్ బీజేపీ అగ్ర నాయకత్వంతో చర్చలు జరిపిన సంగతి తెలిసిందే.
జేపీ నడ్డాతో చర్చల అనంతరం ఢిల్లీ నుండి ప్రత్యేక విమానంలో ముంబై చేరుకున్న ఫడ్నవీస్ నేరుగా గవర్నర్ వద్దకు వెళ్లారు. రాజ్ భవన్లో గవర్నర్ కోషియారీతో భేటీ అయ్యారు. బలనిరూపణ పరీక్షకు పిలవాలని గవర్నర్ను ఫడ్నవీస్ కోరారు. మహా వికాస్ అఘాడీ సంకీర్ణ కూటమి మెజారిటీ కోల్పోయిందని.. వెంటనే బలనిరూపణ చర్యలు తీసుకోవాలని గవర్నర్కు విజ్ఞప్తి చేశారు. గవర్నర్ ఎలాంటి యాక్షన్ తీసుకుంటారోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది.
Also Read
- UAPA Terrorists List: మరో కఠిన నిర్ణయం.. 23 మంది పేర్లను ఉగ్రవాదుల జాబితాలో చేర్చిన కేంద్రం
- Agra Husband M*urder Case: ఇక మీరు మారరా.. పాయసంలో నిద్ర మాత్రలు కలిపి భర్తను చంపి.. బాత్రూమ్లో పాతిపెట్టిన భార్య..
- Lalu Prasad Yadav: బీహార్ ప్రభుత్వం యూటర్న్.. లాలూ ప్రసాద్, రబ్రీ దేవికి మళ్లీ Z కేటగిరీ భద్రత..
- Centre Orders Google, Apple: ప్రయాణికుల భద్రతకు ముప్పు.. గూగుల్, యాపిల్కు కేంద్రం కీలక ఆదేశాలు
జూన్ 30న మహారాష్ట్ర అసెంబ్లీ సమావేశంతో పాటు.. అదే రోజు బల నిరూపణ ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే ఎనిమిది మంది రెబల్ ఎమ్మెల్యేలు బలనిరూపణ పరీక్ష నిర్వహించాలని గవర్నర్కు ఈమెయిల్ ద్వారా కోరారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలో ఫడ్నవీస్కు జేపీ నడ్డా దిశానిర్ధేశం చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ పరిణామాలపై మహారాష్ట్ర బీజేపీ వడివడిగా అడుగులేస్తోంది. మహారాష్ట్ర బీజేపీలో కీలక నేతగా ఉన్న ఫడ్నవీస్ ఢిల్లీకి వెళ్లి జాతీయ నేతలతో చర్చలు జరుపుతున్నారు. మహా వికాస్ అగాడీ ప్రభుత్వం కూలిపోయిన తర్వాత దేవేంద్ర ఫడ్నవీస్ కీలక పాత్ర పోషించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. శివసేన తిరుగుబాటు వర్గం మద్దతుతో ఆయన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు పావులు కదుపుతున్నట్లు సంకేతాలు వస్తున్నాయి.
ఏక్నాథ్ సిండే నేతృత్వంలోని తిరుగుబాటు వర్గంలో ఉన్న 16 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసేందుకు శాసన సభ ఉప సభాపతి జారీ చేసిన నోటీసులను సుప్రీంకోర్టు సోమవారం అడ్డుకుంది. ఈ నోటీసులపై తదుపరి చర్యలను జూలై 11 వరకు నిలిపేసింది. శాసన సభలో బల పరీక్ష నిర్వహించకుండా ఆదేశించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరినప్పటికీ, అటువంటి తాత్కాలిక ఆదేశాలు ఇచ్చేందుకు అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించింది.
మహారాష్ట్రలో 288 శాసన సభ స్థానాలు ఉన్నాయి. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ కలిసి మహా వికాస్ అగాడీ కూటమిగా ఏర్పడి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ప్రభుత్వానికి 169 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉండేది. అయితే ఏక్నాథ్ షిండే నేతృత్వంలో శివసేనలో తిరుగుబాటు రావడంతో దాదాపు 50 మంది ఎమ్మెల్యేలు ప్రత్యేక వర్గంగా ఏర్పడ్డారు. ప్రతిపక్షంలోని బీజేపీకి 106 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. బీజేపీకి ఆర్ఎస్పీ (1), జేఎస్ఎస్ (1), ఐదుగురు స్వతంత్రులు మద్దతిస్తున్నారు.
తాజావార్తలు
-
Jana Nayagan: ఆ రెండు డేట్స్ లోనే ‘జన నాయగన్’.?
-
Sridevi: కోర్టు హీరోయిన్ కీలక ప్రకటన.!
-
OG 2 Update: ‘ఓజీ 2’ కోసం సుజీత్ మాస్టర్ ప్లాన్.. ఒకటికి రెండుసార్లు.. పవన్ ఫ్యాన్స్కు డబుల్ ట్రీట్?
-
UAPA Terrorists List: మరో కఠిన నిర్ణయం.. 23 మంది పేర్లను ఉగ్రవాదుల జాబితాలో చేర్చిన కేంద్రం
-
Jr NTR-Akhil: ‘లెనిన్’ కోసం రంగంలోకి ఎన్టీఆర్?.. అక్కినేని అఖిల్కు బూస్ట్ ఇచ్చే స్పెషల్ ప్లాన్!
ట్రెండింగ్
-
Thailand: 11 ఏళ్ల బాలుడి ర్యాష్ డ్రైవింగ్.. 9 మంది సన్యాసుల ప్రాణాలు బలి.! వీడియో వైరల్..
-
Smartphones in Budget: రూ. 15,000 లోపు భారీ బ్యాటరీ లైఫ్ బెస్ట్ 5G స్మార్ట్ఫోన్లు ఇవే.. రెండు రోజుల బ్యాకప్ గ్యారెంటీ!
-
EV కారు కొనాలనుకుంటున్నారా? Hyundai Creta ఎలక్ట్రిక్ కు కొత్త BaaS ప్లాన్.. రూ.7 లక్షల వరకు తగ్గింపు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ అరంగేట్రంపై విమర్శలు.. మా ఇష్టం అంటూ మాజీలకు గట్టిగా ఇచ్చిపడేసిన బీసీసీఐ!
-
Indonesia: దొంగతనానికి వచ్చి ‘మమ్మీ’లుగా మారిపోయారు.. వైరల్ వీడియో