PM Modi: ప్రధాని డిగ్రీ వివరాలు అవసరం లేదు.. కేజ్రీవాల్కి హైకోర్టు జరిమానా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు గుజరాత్ హైకోర్టులో చుక్కెదురు అయింది. ప్రధాని నరేంద్రమోదీ డిగ్రీ వివరాలను వెల్లడించాలని గుజరాత్ యూనివర్సిటీని ఆదేశిస్తూ జారీ అయిన ఉత్తర్వులను ఆ రాష్ట్ర హైకోర్టు ఈ రోజు కొట్టేసింది. ఆ సమాచారం అవసరం లేదని కోర్టు పేర్కొంది. ఈ వివరాలు అడిగినందుకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు రూ. 25,000 జరిమానా విధించింది. కేజ్రీవాల్ నాలుగు వారాల్లో గుజరాత్ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీలో డబ్బును డిపాజిట్ చేయాలని ఆదేశించింది.
కోర్టు ఆర్డర్ పై స్పందిస్తూ కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. ‘‘తమ ప్రధాని ఎంత చదువుకున్నాడో తెలుసుకునే హక్కు దేశానికి లేదా?, కోర్టులో అతని డిగ్రీని బహిర్గతం చేయడాన్ని వారు తీవ్రంగా వ్యతిరేకించారు ఎందుకు?, డిగ్రీని చూడమని అడిగిన వ్యక్తికి జరిమానా విధించారు ఏం జరుగుతోంది? చదువుకోని లేదా తక్కువ చదువుకున్న ప్రధాని దేశానికి ప్రమాదకరం.” అని తన ట్వీట్ లో కామెంట్స్ చేశారు. 2016లో సమాచార హక్కు(ఆర్టీఐ) అభ్యర్థనపై స్పందించిన కేంద్ర సమాచార కమిషన్ ప్రధాని మోదీ గ్యాడ్యుయేషన్, పోస్ట్ గ్యాడ్యుయేషన్ డిగ్రీలకు సంబంధించిన సమాచారాన్ని అందించాల్సిందిగా ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంఓ), గుజరాత్ యూనివర్సిటీ, ఢిల్లీ యూనివర్సిటీలను ఆదేశించింది.
Also Read
- JP Nadda - CJP Leaders: నడ్డాతో సీజేపీ నాయకుల భేటీ.. సీజేపీ డిమాండ్స్ ఇవే!
- West Bengal: సెప్టెంబర్ 1 నుంచి బెంగాల్లో కొత్త రూల్.. మాతృ భాషకు పట్టం కట్టిన సీఎం సువేందు అధికారి!
- Abhijeet Dipke: ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. కాక్రోచ్ జనతా పార్టీ చీఫ్ అభిజీత్ దీప్కే అరెస్ట్..
- India First Dengue Vaccine: శుభవార్త.. భారత్లో తొలి డెంగ్యూ వ్యాక్సిన్కు ఆమోదం.. ఎవరికి? ఎన్ని డోసులు? పూర్తి వివరాలు
Read Also: Poster War: బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ.. తెలంగాణలో ఇరు పార్టీల మధ్య పోస్టర్ వార్..
అయితే ఈ ఉత్తర్వులను గుజరాత్ యూనివర్సిటీ హైకోర్టులో సవాల్ చేసింది. ప్రధాని మోదీ 1978లో గుజరాత్ యూనివర్సిటీ నుంచి డిగ్రీ, 1983లో ఢిల్లీ యూనివర్సిటీ నుంచి మాస్టర్స్ డిగ్రీ చేశారని ఆయన ఎన్నిక నామినేషన్లు చెబుతున్నాయి. అయితే గత నెల ఈ కేసులో సోలిసిటర్ జనరల్ తుషార్ మోహతా వాదిస్తూ.. ఈ సమాచారాన్ని బహిర్గతం చేయమని యూనివర్సిటీని బలవంతం చేయరాదని కోర్టుకు తెలిపారు. ప్రజాస్వామ్యంలో ఒక పదవిలో ఉన్న వ్యక్తి డాక్టరేటా.. నిరక్షరాస్యుడా..? అన్న తేడా ఉండదని, ఈ కేసులో ఎటువంటి ప్రజా ప్రయోజనం లేదని, ఇది గోప్యతను ప్రభావితం చేస్తుందని ఆయన వాదించాడు. ఒకరి చైల్డిష్, బాధ్యతారాహిత్య అవసరాలను తీర్చడానికి సమాచారాన్ని కోరలేమని తుషార్ మెహతా అన్నారు.
ఎన్నికల నామినేషన్లలో ప్రధాని తన విద్యార్హతను పేర్కొన్నారని కేజ్రీవాల్ తరుపు న్యాయవాది వాదించారు. ప్రధాని మోదీ డిగ్రీ సర్టిఫికేట్స్ అడుగుతున్నాం, అతడి మార్క్ షీట్స్ కాదని వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీకి వ్యతిరేకంగా ఆమ్ ఆద్మీ పార్టీ పోస్టర్ వార్ కు తెరలేపిన సమయంలో ఈ కేసులో తీర్పు వచ్చింది.
తాజావార్తలు
-
Nagarjuna: “ఈ అరుపుల కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురుచూశాడు”.. ‘లెనిన్’ సక్సెస్ మీట్లో నాగార్జున ఎమోషనల్!
-
Housing Scheme: సొంతిళ్లు లేని వారికి శుభవార్త.. రేపటి నుంచే దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం..
-
Nag Chaitanya: ‘ఆ రోజు నుంచే అఖిల్ నా హీరో’.. తమ్ముడిపై నాగచైతన్య ఎమోషనల్ కామెంట్స్!
-
Public Charging: రైల్వే స్టేషన్లో ఫోన్ ఛార్జింగ్ పెడుతున్నారా? జర జాగ్రత్త.. మీ బ్యాంక్ ఖాతా ఖాళీ కావచ్చు!
-
Akhil Akkineni : మూడో రోజుకి బ్రేక్ ఈవెన్ అవ్వడం చాలా చాలా రోజుల తర్వాత జరిగింది
ట్రెండింగ్
-
SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?
-
Ferrari Amalfi Spider: ఫెరారీ కొత్త కన్వర్టిబుల్ సూపర్కార్ లాంచ్.. ధర ఎంతంటే?
-
Rohit Sharma: మజా ఉండదు కదా.. రిటైర్మెంట్ వార్తలపై తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ!
-
Mahindra New SUV: ఆగస్టు 15న మహీంద్రా నుంచి కొత్త SUV.. స్కార్పియో N ఫేస్లిఫ్ట్ ఎంట్రీ ఖాయమేనా?
-
Paneer Tikka Recipe: ప్రోటీన్ రిచ్ ఫుడ్.. టేస్టీ “పన్నీర్ టిక్కా”ను ఇంట్లో సులువుగా చేసేయండి ఇలా.!