Nora Fatehi: రూ.200 కోట్ల మనీలాండరింగ్ కేసు.. నటి నోరా ఫతేహికి క్లీన్చిట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nora Fatehi: ఘరానా మోసగాడు సుకేష్ చంద్రశేఖర్ సూత్రధారిగా భావిస్తున్న రూ.200 కోట్ల కుంభకోణంలో నటి నోరా ఫతేహిని ప్రశ్నించిన ఒక రోజు తర్వాత ఢిల్లీ పోలీసుల ఆర్థిక నేరాల విభాగం (EOW) క్లీన్ చిట్ ఇచ్చినట్లు ఆమె టీమ్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొంది. జైలులో ఉన్న సుకేష్ చంద్రశేఖర్ చుట్టూ జరిగిన కుట్రలో నోరా ప్రమేయం లేదని, క్రైమ్ సిండికేట్ గురించి ఆమెకు తెలియదని ఢిల్లీ పోలీసులు పేర్కొన్నారు.
సుకేష్ చంద్రశేఖర్తో ముడిపడి ఉన్న దోపిడీ కేసుకు సంబంధించి బాలీవుడ్ నటి నోరా ఫతేహిని ఢిల్లీ పోలీసులు గురువారం ఆరు గంటలకు పైగా ప్రశ్నించారు. ఇదే కేసులో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ను దాదాపు ఎనిమిది గంటల పాటు ప్రశ్నించిన ఒక రోజు తర్వాత ఇది వచ్చింది. నోరాకు ఈ కేసుతో సంబంధం లేదని, నిందితుడి వ్యవహారాలపై అనుమానం రాగానే ఆమె ఈ విషయాలను తమతో పంచుకోగా నోరా చర్యలకు అనుగుణంగా దర్యాప్తు సాగించామని ఢిల్లీ పోలీసులు చెప్పినట్టు నటి బృందం తెలిపింది. సుకేష్ చంద్రశేఖర్ భార్యకు చెన్నైలో స్టూడియో ఉంది. నోరాను దాని ఫంక్షన్ కోసం పిలిచారు. రుసుము తీసుకోవద్దని, బదులుగా ఆమెకు కారు బహుమతిగా ఇస్తున్నారని చెప్పారు. సుకేష్ పదే పదే ఫోన్ చేసి బ్లాక్ చేయడంతో నోరాకు అనుమానం వచ్చింది. నోరా తన వ్యవహారాల్లో కచ్చితంగా ప్రొఫెషనల్గా ఉండేదని ఆమె బృందం వెల్లడించింది.
Also Read
- Bharat Taxi Launch: ఓలా, ఉబర్లకు చెక్.. రంగంలోకి కేంద్ర ప్రభుత్వ ‘భారత్ టాక్సీ’.. అమిత్ షా మెగా ప్లాన్!
- PM Modi: సీషెల్స్లో మోడీ పర్యటన.. వృక్ష ఉద్యానవనం సందర్శన
- NCERT: 9వ తరగతి సిలబస్లో భారీ మార్పు.. ఫ్రెంచ్, రష్యా విప్లవాలు తొలగింపు..
- Gold Scam : ‘గోల్డ్ మ్యాన్’ గేమ్ ఓవర్.. రూ.30 లక్షల గోల్డ్ స్కామ్.!
Woman Marries 5 Times: నిత్య పెళ్లికూతురు.. ఆరో పెళ్లికి రెడీ అవుతుండగా..
గురువారం, నోరా ఫతేహిని ఢిల్లీ పోలీసుల ఆర్థిక నేరాల విభాగం మందిర్ మార్గ్ ప్రధాన కార్యాలయంలో ప్రశ్నించింది. ఆమె కమ్యూనికేషన్, సంభాషణల స్క్రీన్షాట్లతో సహా తన వద్ద ఉన్న అన్ని సాక్ష్యాలను పంచుకుంది. సాక్షులు సమర్పించిన సాక్ష్యాలు, వాంగ్మూలాల ఆధారంగా కేసును ముందుకు తీసుకెళ్లనున్నారు. నోరా ఫతేహి తాను సుకేష్ను లేదా పింకీని ఎప్పుడూ కలవలేదని అధికారులకు చెప్పింది. వాట్సాప్ ద్వారా సుకేష్ చంద్రశేఖర్తో టచ్లో ఉన్నట్లు ఆమె ఈఓడబ్ల్యూ అధికారులకు చెప్పినట్లు వర్గాలు తెలిపాయి. ఇదిలా ఉండగా, నోరా బావమరిది బాబీ తనకు సుకేష్ చంద్రశేఖర్ రూ. 65 లక్షల విలువైన బీఎమ్డబ్ల్యూ కారును బహుమతిగా ఇచ్చారని అంగీకరించినట్లు సమాచారం.
తాజావార్తలు
-
Story Board : పాస్ పోర్ట్ కేవలం ప్రయాణ పత్రమేనా..? ఇప్పుడు కేంద్రం వాదనేంటి..?
-
OTR: ధర్మవరం రాజకీయాల్లో హీట్… మంత్రి సత్యకుమార్ వ్యూహం మారిందా?
-
OTR : SIR రూల్తో ఓటర్లలో గందరగోళం – ఏ గట్టు ఎంచుకోవాలి?
-
OTR: మంత్రాలయం కోటను బద్దలు కొట్టేందుకు టీడీపీ మాస్టర్ ప్లాన్?
-
YS Jagan : ఏపీలో నడుస్తోంది గూండాల రాజ్యమా?.. చంద్రబాబుపై వైఎస్ జగన్ ఫైర్..
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!