Nora Fatehi: రూ.200 కోట్ల మనీలాండరింగ్ కేసు.. నటి నోరా ఫతేహికి క్లీన్చిట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nora Fatehi: ఘరానా మోసగాడు సుకేష్ చంద్రశేఖర్ సూత్రధారిగా భావిస్తున్న రూ.200 కోట్ల కుంభకోణంలో నటి నోరా ఫతేహిని ప్రశ్నించిన ఒక రోజు తర్వాత ఢిల్లీ పోలీసుల ఆర్థిక నేరాల విభాగం (EOW) క్లీన్ చిట్ ఇచ్చినట్లు ఆమె టీమ్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొంది. జైలులో ఉన్న సుకేష్ చంద్రశేఖర్ చుట్టూ జరిగిన కుట్రలో నోరా ప్రమేయం లేదని, క్రైమ్ సిండికేట్ గురించి ఆమెకు తెలియదని ఢిల్లీ పోలీసులు పేర్కొన్నారు.
సుకేష్ చంద్రశేఖర్తో ముడిపడి ఉన్న దోపిడీ కేసుకు సంబంధించి బాలీవుడ్ నటి నోరా ఫతేహిని ఢిల్లీ పోలీసులు గురువారం ఆరు గంటలకు పైగా ప్రశ్నించారు. ఇదే కేసులో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ను దాదాపు ఎనిమిది గంటల పాటు ప్రశ్నించిన ఒక రోజు తర్వాత ఇది వచ్చింది. నోరాకు ఈ కేసుతో సంబంధం లేదని, నిందితుడి వ్యవహారాలపై అనుమానం రాగానే ఆమె ఈ విషయాలను తమతో పంచుకోగా నోరా చర్యలకు అనుగుణంగా దర్యాప్తు సాగించామని ఢిల్లీ పోలీసులు చెప్పినట్టు నటి బృందం తెలిపింది. సుకేష్ చంద్రశేఖర్ భార్యకు చెన్నైలో స్టూడియో ఉంది. నోరాను దాని ఫంక్షన్ కోసం పిలిచారు. రుసుము తీసుకోవద్దని, బదులుగా ఆమెకు కారు బహుమతిగా ఇస్తున్నారని చెప్పారు. సుకేష్ పదే పదే ఫోన్ చేసి బ్లాక్ చేయడంతో నోరాకు అనుమానం వచ్చింది. నోరా తన వ్యవహారాల్లో కచ్చితంగా ప్రొఫెషనల్గా ఉండేదని ఆమె బృందం వెల్లడించింది.
Also Read
- IIT Deaths: ఐఐటీల్లో ఈ చావులు వెనుక ఉన్న కారణాలేంటి? విద్యార్థులను బలి తీసుకుంటుంది ఎవరు?
- NEET Counselling 2026: NEET కౌన్సెలింగ్ తొలి విడతలో సీటు రాకపోవడంతో.. 21 ఏళ్ల విద్యార్థిని ఆత్మహత్య
- High Court Slams FDA: ‘మీరేమైన దేవుడు అనుకుంటున్నారా..?’ ఎఫ్డీఏకు హైకోర్టు షాక్..!
- India’s New Time Rule: ISTపై కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. దేశవ్యాప్తంగా కొత్త టైమ్ రూల్స్.. ఎప్పటినుంచంటే?
Woman Marries 5 Times: నిత్య పెళ్లికూతురు.. ఆరో పెళ్లికి రెడీ అవుతుండగా..
గురువారం, నోరా ఫతేహిని ఢిల్లీ పోలీసుల ఆర్థిక నేరాల విభాగం మందిర్ మార్గ్ ప్రధాన కార్యాలయంలో ప్రశ్నించింది. ఆమె కమ్యూనికేషన్, సంభాషణల స్క్రీన్షాట్లతో సహా తన వద్ద ఉన్న అన్ని సాక్ష్యాలను పంచుకుంది. సాక్షులు సమర్పించిన సాక్ష్యాలు, వాంగ్మూలాల ఆధారంగా కేసును ముందుకు తీసుకెళ్లనున్నారు. నోరా ఫతేహి తాను సుకేష్ను లేదా పింకీని ఎప్పుడూ కలవలేదని అధికారులకు చెప్పింది. వాట్సాప్ ద్వారా సుకేష్ చంద్రశేఖర్తో టచ్లో ఉన్నట్లు ఆమె ఈఓడబ్ల్యూ అధికారులకు చెప్పినట్లు వర్గాలు తెలిపాయి. ఇదిలా ఉండగా, నోరా బావమరిది బాబీ తనకు సుకేష్ చంద్రశేఖర్ రూ. 65 లక్షల విలువైన బీఎమ్డబ్ల్యూ కారును బహుమతిగా ఇచ్చారని అంగీకరించినట్లు సమాచారం.
తాజావార్తలు
-
Suryakumar Yadav: తప్పంతా నాదే.. వన్డే కెరీర్పై సూర్యకుమార్ సంచలన వ్యాఖ్యలు!
-
IIT Deaths: ఐఐటీల్లో ఈ చావులు వెనుక ఉన్న కారణాలేంటి? విద్యార్థులను బలి తీసుకుంటుంది ఎవరు?
-
NEET Counselling 2026: NEET కౌన్సెలింగ్ తొలి విడతలో సీటు రాకపోవడంతో.. 21 ఏళ్ల విద్యార్థిని ఆత్మహత్య
-
Laikey Laikaa: రాషా థడానీ ఇంటెన్స్ రొమాంటిక్ యాక్షన్ ఆగిపోలేదు.. వాలెంటైన్స్ డేకు వస్తోంది..
-
China: వేలాది కుటుంబాల కన్నీటి వేదన..నిజాలను సమాధి చేసే పాలన.. చైనా నిజస్వరూపం ఇదే!
ట్రెండింగ్
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!