Delhi Fire Accident: ఢిల్లీ అగ్నిప్రమాదంలో 27 మంది మృతి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీలో శుక్రవారం రాత్రి ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ఢిల్లీ ముండ్కా ఫైర్ ఆక్సిడెంట్ లో ఇప్పటి వరకు 27 మరణించగా… 30 మందికి పైగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోెంది. పశ్చిమ ఢిల్లీ ముడ్కా మెట్రోస్టేషన్ సమీపంలోని ఓ భవనంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో భారీగా ప్రాణ నష్టం సంభవించింది. నిన్న ఘటన జరిగిన వెంటనే 24 ఫైర్ ఇంజిన్ల ద్వరా మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. ఈ ఘటనలో 50 మందిని రక్షించారు. అయితే చాలా మంది ఆచూకీ కనిపించడం లేదని తెలుస్తోంది. బిల్డింగ్ లోకి వెళ్లేందుకు ఒకే ఒక మార్గం ఉండటం… అది కూడా ఇరుకుగా ఉండటంతో సహాయక చర్యలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. భవనంలో ఎలాంటి భద్రత ప్రమాణాలు తీసుకోలేదని అధికారులు చెబుతున్నారు. షార్ట్ సర్య్కూట్ వల్లే ప్రమాదం జరిగిందని అధికారులు ప్రాథమికంగా నిర్థారించారు.
ప్రాథమిక సమాచారం ప్రకారం వివిధ కంపెనీ కార్యాలయాలు ఉన్న మూడు అంతస్తుల వాణిజ్య భవనంలో మంటలు చెలరేగాయి. సీసీటీవీ కెమెరాలు, రూటర్లు తయారు చేసే కంపెనీ కార్యాలయంలోని ఉన్న మొదటి అంతస్తులో ముందుగా మంటలు చెలరేగాయని అధికారులు వెల్లడించారు. నిమిషాల వ్యవధిలోనే అన్ని ఫ్లోర్లకు మంటలు వ్యాపించాయి. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. చనిపోయిన వారిని గుర్తించేందుకు ఫోరెన్సిన్ టీం రంగంలోకి దిగింది. కంపెనీ యజమానిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Also Read
- Lalu Prasad Yadav: బీహార్ ప్రభుత్వం యూటర్న్.. లాలూ ప్రసాద్, రబ్రీ దేవికి మళ్లీ Z కేటగిరీ భద్రత..
- Centre Orders Google, Apple: ప్రయాణికుల భద్రతకు ముప్పు.. గూగుల్, యాపిల్కు కేంద్రం కీలక ఆదేశాలు
- Ahilyanagar: అదుపుతప్పి బోల్తా పడ్డ స్కూల్ బస్సు.. 50 మంది విద్యార్థులతో వెళ్తుండగా ప్రమాదం.!
- Tamil Nadu Politics: విజయ్ ప్రభుత్వంపై కుట్ర కేసులో షాకింగ్ నిజాలు.. రూ.180 కోట్లతో స్కెచ్..!
ఢిల్లీ అగ్ని ప్రమాదంపై రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ సంతాపం తెలిపారు. ఘటనపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతి చెందిన వారికి ప్రధానమంత్రి రిలీఫ్ ఫండ్ నుంచి ఒక్కొక్కరికి రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50,000 చొప్పున పరిహారం ప్రకటించారు. ఢిల్లీలోని ముండ్కాలో జరిగిన అగ్ని ప్రమాదం చాలా బాధాకరమని … అధికారులతో నిరంతరం టచ్ లో ఉన్నట్లు హోంమంత్రి అమిత్ షా ట్వీట్ చేశారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy: రేవంత్ రెడ్డిగా మొదలై.. నేడు మీ అందరి గుండెల్లో “రేవంతన్న”గా.. భావోద్వేగ ట్వీట్ చేసిన సీఎం.!
-
Lalu Prasad Yadav: బీహార్ ప్రభుత్వం యూటర్న్.. లాలూ ప్రసాద్, రబ్రీ దేవికి మళ్లీ Z కేటగిరీ భద్రత..
-
Centre Orders Google, Apple: ప్రయాణికుల భద్రతకు ముప్పు.. గూగుల్, యాపిల్కు కేంద్రం కీలక ఆదేశాలు
-
Janhvi Kapoor: ఒక్క ఇన్స్టా పోస్ట్కే అన్ని లక్షలా!… జాన్వీ డిజిటల్ ఆదాయం షాకింగ్
-
Thailand: 11 ఏళ్ల బాలుడి ర్యాష్ డ్రైవింగ్.. 9 మంది సన్యాసుల ప్రాణాలు బలి.! వీడియో వైరల్..
ట్రెండింగ్
-
Smartphones in Budget: రూ. 15,000 లోపు భారీ బ్యాటరీ లైఫ్ బెస్ట్ 5G స్మార్ట్ఫోన్లు ఇవే.. రెండు రోజుల బ్యాకప్ గ్యారెంటీ!
-
EV కారు కొనాలనుకుంటున్నారా? Hyundai Creta ఎలక్ట్రిక్ కు కొత్త BaaS ప్లాన్.. రూ.7 లక్షల వరకు తగ్గింపు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ అరంగేట్రంపై విమర్శలు.. మా ఇష్టం అంటూ మాజీలకు గట్టిగా ఇచ్చిపడేసిన బీసీసీఐ!
-
Indonesia: దొంగతనానికి వచ్చి ‘మమ్మీ’లుగా మారిపోయారు.. వైరల్ వీడియో
-
Instagram: ఇంస్టాగ్రామ్కు కేంద్రం నోటీసులు.!