Delhi Fire Accident: ఢిల్లీ అగ్నిప్రమాదంలో 27 మంది మృతి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీలో శుక్రవారం రాత్రి ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ఢిల్లీ ముండ్కా ఫైర్ ఆక్సిడెంట్ లో ఇప్పటి వరకు 27 మరణించగా… 30 మందికి పైగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోెంది. పశ్చిమ ఢిల్లీ ముడ్కా మెట్రోస్టేషన్ సమీపంలోని ఓ భవనంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో భారీగా ప్రాణ నష్టం సంభవించింది. నిన్న ఘటన జరిగిన వెంటనే 24 ఫైర్ ఇంజిన్ల ద్వరా మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. ఈ ఘటనలో 50 మందిని రక్షించారు. అయితే చాలా మంది ఆచూకీ కనిపించడం లేదని తెలుస్తోంది. బిల్డింగ్ లోకి వెళ్లేందుకు ఒకే ఒక మార్గం ఉండటం… అది కూడా ఇరుకుగా ఉండటంతో సహాయక చర్యలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. భవనంలో ఎలాంటి భద్రత ప్రమాణాలు తీసుకోలేదని అధికారులు చెబుతున్నారు. షార్ట్ సర్య్కూట్ వల్లే ప్రమాదం జరిగిందని అధికారులు ప్రాథమికంగా నిర్థారించారు.
ప్రాథమిక సమాచారం ప్రకారం వివిధ కంపెనీ కార్యాలయాలు ఉన్న మూడు అంతస్తుల వాణిజ్య భవనంలో మంటలు చెలరేగాయి. సీసీటీవీ కెమెరాలు, రూటర్లు తయారు చేసే కంపెనీ కార్యాలయంలోని ఉన్న మొదటి అంతస్తులో ముందుగా మంటలు చెలరేగాయని అధికారులు వెల్లడించారు. నిమిషాల వ్యవధిలోనే అన్ని ఫ్లోర్లకు మంటలు వ్యాపించాయి. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. చనిపోయిన వారిని గుర్తించేందుకు ఫోరెన్సిన్ టీం రంగంలోకి దిగింది. కంపెనీ యజమానిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Also Read
- Railways: మొన్న హనీమూన్, నేడు బర్త్ డే.. వివాదాల పాలవుతున్న రైల్వే..
- Prakash Raj: "నా ఓటు తొలగించి, ఆట మొదలుపెట్టారు".. SIRపై ప్రకాష్ రాజ్ వార్నింగ్..
- Delhi Alert: రెడ్ఫోర్ట్ నుంచి మెట్రో స్టేషన్ల వరకు నిఘా.. ఢిల్లీలో భద్రత కట్టుదిట్టం.. 19 మంది ఉగ్రవాదుల పోస్టర్లు విడుదల..
- Government Schools Decline: ఒకే ఏడాదిలో 9,900 ప్రభుత్వ పాఠశాలల మూత... తెలుగు రాష్ట్రాల్లో భారీగా..! కారణమేంటి?
ఢిల్లీ అగ్ని ప్రమాదంపై రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ సంతాపం తెలిపారు. ఘటనపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతి చెందిన వారికి ప్రధానమంత్రి రిలీఫ్ ఫండ్ నుంచి ఒక్కొక్కరికి రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50,000 చొప్పున పరిహారం ప్రకటించారు. ఢిల్లీలోని ముండ్కాలో జరిగిన అగ్ని ప్రమాదం చాలా బాధాకరమని … అధికారులతో నిరంతరం టచ్ లో ఉన్నట్లు హోంమంత్రి అమిత్ షా ట్వీట్ చేశారు.
తాజావార్తలు
-
Railways: మొన్న హనీమూన్, నేడు బర్త్ డే.. వివాదాల పాలవుతున్న రైల్వే..
-
Lenin OTT: జీ5లో ‘లెనిన్’ సెన్సేషన్.. రెండు రోజుల్లోనే 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్!
-
Viswanath and Sons’ Censor : విశ్వనాథ్ అండ్ సన్స్’ సెన్సార్ టాక్.. సింపుల్ బ్లాక్బస్టర్
-
USA: ఉద్యోగంలో చేరిన కొన్ని రోజులకే.. అమెరికాలో ఏపీకి చెందిన టెక్కీ మృతి..
-
Public Wi-Fi Risks: ఎయిర్పోర్ట్, రైల్వేస్టేషన్, హోటళ్లు.. ఇలా పబ్లిక్ Wi-Fiకి కనెక్ట్ అవుతున్నారా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి
ట్రెండింగ్
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..
-
Beetroot Dosa: ఎప్పుడు మాములు దోసలేనా..? కొత్తగా క్రిస్పీ & హెల్దీ బీట్రూట్ దోస చేసేయండి ఇలా.!
-
890cc V-Twin ఇంజిన్, కొత్త చాసిస్, కొత్త లుక్ తో Ducati Monster V2 లాంచ్.. ధర ఎంతంటే..?