Arvind Kejriwal: “ఎమ్మెల్యేల కొనుగోలు” ఆరోపణలపై ఢిల్లీ సీఎంకి క్రైమ్ బ్రాంచ్ నోటీసులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Arvind Kejriwal: ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) చీఫ్ అరవింద్ కేజ్రీవాల్కి ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ నోటీసులు అందించింది. ఇటీవల కేజ్రీవాల్ మాట్లాడుతూ.. బీజేపీ తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తోందని ఆరోపించారు. ఈ నేపథ్యంలో క్రైమ్ బ్రాంచ్ యూనిట్ శుక్రవారం నేరుగా కేజ్రీవాల్ ఇంటికి వెళ్లింది. అయితే, క్రైమ్ బ్రాంచ్ అధికారులు నోటీసులు ఇవ్వకుండానే వెనుదిరిగినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం పేర్కొంది. ఆప్ ఎమ్మెల్యేలను బీజేపీ ప్రలోభాలకు గురిచేస్తుందని కేజ్రీవాల్ ఆరోపణలపై విచారణ జరిపించాలని బీజేపీ నాయకులు పోలీస్ కమిషనర్ని కలిసిన తర్వాత క్రైం బ్రాంచ్ ఈ చర్య తీసుకుంది. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్)తో విచారణ జరిపించాలని బిజెపి ప్రతినిధి బృందం కోరింది.
Read Also: Indian Navy: సముద్ర దొంగల బారి నుంచి పాక్, ఇరాన్ సిబ్బందిని కాపాడిన ఇండియన్ నేవీ..
Also Read
- UP: ‘నాకు విడాకులు ఇచ్చేయండి’.. ఓ వింతైన కారణంతో కోర్టుకెళ్లిన నూతన వధువు
- INIDIA alliance: ఇండియా కూటమి సమావేశానికి విజయ్ పార్టీకి నో ఎంట్రీ.. కాంగ్రెస్ చెప్పిన కారణం ఇదే!
- Kirti Chakra: అమరవీరుడు సిపాయి జంజాల్ ప్రవీణ్ ప్రభాకర్కు ‘కీర్తి చక్ర’ ప్రదానం.. రాష్ట్రపతి దగ్గర వెక్కి వెక్కి ఏడ్చిన తల్లి
- India-US Trade Deal: అమెరికాతో వాణిజ్య ఒప్పందం కుదిరేది అప్పుడే.. భారత్ ఎదురుచూపులు!
గత వారం ఢిల్లీ మంత్రి అతిషి.. ఆప్కి చెందిన ఏడుగురు ఎమ్మెల్యేలకు పార్టీ వీడేందుకు ఒక్కొక్కరికి రూ.25 కోట్లను బీజేజీ ఆఫర్ చేసిందని, కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని పడగొడతామని బెదిరించిందని ఆరోపించారు. పార్టీ ఎమ్మెల్యేల్లో ఒకరిని సంప్రదించిన రికార్డింగ్ అందుబాటులో ఉందని, తర్వాత చూపిస్తామని ఆమె చెప్పారు. ఎన్నికల్లో గెలవలేకనే బీజేపీ ఆప్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు సిద్ధమైందని ఆరోపించింది.
దీనిపై కేజ్రీవాల్ ఎక్స్లో స్పందించారు. తమ ఎమ్మెల్యేలను బీజేపీ సంప్రదించిందని, తనను త్వరలో అరెస్ట్ చేయవచ్చని, ఢిల్లీ ప్రభుత్వాన్ని పడగొట్టిన తర్వాత ఏడుగురు ఎమ్మెల్యేలకు రూ. 25 కోట్ల చొప్పున ఇస్తామని, బీజేపీ తరుపున టికెట్ ఇస్తామని హామీ ఇచ్చినట్లు, అయితే వారు పార్టీని వీడేందుకు నిరాకరించినట్లు కేజ్రీవాల్ తెలిపారు. అయితే ఢిల్లీ బీజేపీ ఈ ఆరోపణల్ని కొట్టేసింది. ఎమ్మెల్యేల పేర్లు చెప్పాలని డిమాండ్ చేసింది. మద్యం కుంభకోణంలో ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఆప్ ఇలాంటి ఆరోపణలు చేస్తుందని బీజేపీ ఆరోపించింది.
తాజావార్తలు
-
Kitchen Hacks: వంటగదిలో ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే.. మీ పని సగం తగ్గుతుంది!
-
UP: ‘నాకు విడాకులు ఇచ్చేయండి’.. ఓ వింతైన కారణంతో కోర్టుకెళ్లిన నూతన వధువు
-
Vijay Sethupathi : నాడు పూరి సినిమాకు జూనియర్ ఆర్టిస్ట్.. నేడు అదే పూరి దర్శకత్వంలో హీరోగా!
-
Carlsberg IPO: ప్రపంచంలోనే అత్యంత పురాతన బియర్ బ్రాండ్ ఐపీఓ.. వివరాలు ఇవే!
-
Mohammed Siraj: ముల్లన్పూర్ టెస్టులో ఘర్షణ.. అఫ్గానిస్థాన్ బ్యాటర్పై ఆగ్రహంతో ఊగిపోయిన సిరాజ్..
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!