Delhi Assembly special session: ఢిల్లీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం.. ఎమ్మెల్యేల కొనుగోలు విమర్శల మధ్య ప్రాధాన్యం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi Assembly special session: ఢిల్లీ అసెంబ్లీ ఒక రోజు ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేసింది. శుక్రవారం ఢిల్లీ అసెంబ్లీ సమావేశం అయింది. ప్రస్తుతం ఢిల్లీ కేంద్రంగా జరుగుతున్న రాజకీయం నేపథ్యంలో, ఎమ్మెల్యేల కొనుగోలు విమర్శల నేపథ్యంలో ఈ అసెంబ్లీ సమావేశాలకు ప్రాధాన్యత ఏర్పడింది. బుధవారం ఆప్ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం జరిగింది. ఢిల్లీలో ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీజేపీ రూ.800 కోట్లను సిద్ధం చేసిందని.. 40 మంది ఎమ్మెల్యేలను ఒక్కొక్కరిని రూ.20 కోట్లకు కొనుగోలు చేసిందని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గురువారం ఆరోపించారు. మొత్తం 70 ఎమ్మెల్యేలు ఉన్న ఢిల్లీ అసెంబ్లీలో ఆప్ కు 62 మంది ఎమ్మెల్యేలు ఉండగా.. ఎనమివది మంది బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆప్ ఎమ్మెల్యేలు అజయ్ దత్, సంజీవ్ ఝా, సోమనాథ్ భారతి, కుల్దీప్లను బీజేపీ నేతలు సంప్రదించినట్లు ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపిస్తోంది.
Read Also: Ghulam Nabi Azad: బిగ్ బ్రేకింగ్.. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన గులాంనబీ ఆజాద్
Also Read
- Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్ సింగ్కు షాక్.. న్యాయ వృత్తి నుంచి సస్పెండ్
- Twisha Sharma: ట్విషా శర్మ మరణానికి ముందు ఎక్కడకెళ్లిందంటే.. వెలుగులోకి వీడియో
- Modi-Suvendu: మోడీతో బెంగాల్ సీఎం భేటీ.. 45 నిమిషాలు సాగిన సమావేశం
ప్రస్తుతం ఢిల్లీ ఎక్సైజ్ స్కామ్ లో సీబీఐ విచారణ చేపడుతోంది. ఈ కేసులో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనిష్ సిసోడియా ఏ1 నిందితుడిగా ఉన్నారు. ఇటీవల సిసోడియా ఇంటితో పాటు మొత్తం 20కి పైగా ప్రాంతాల్లో సీబీఐ సోదాలు నిర్వహించింది. ఈ వ్యవహారంపై ఆప్, బీజేపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. అయితే ఢిల్లీ ఎక్సైజ్ స్కామ్ ను పక్కదారి పట్టించేందుకే ఆప్, ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఇలాంటి ఆరోపణలు చేస్తోందని బీజేపీ విమర్శిస్తోంది.
మద్యం స్కామ్ లో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న మనీష్ సిసోడియా కూడా బీజేపీపై ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో చేరితే, ఆప్ లో విభజన తీసుకువస్తే కేసులు మాఫీ చేయడంతో పాటు కీలక పదవి ఇస్తామని ఆఫర్ చేసినట్లు ఆరోపించారు. నేను రాణా ప్రతాప్ వంశంలో పట్టానని.. తల నరికినా ధర్మం వైపే నిలబడా అని వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!