Manish Sisodia Arrest: సిసోడియా అరెస్ట్కు దారి తీసిన “మిస్సింగ్ ఫైల్స్”
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Manish Sisodia Arrest: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీబీఐ ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను ఆదివారం అరెస్ట్ చేసింది. సోమవారం న్యాయస్థానంలో హాజరుపరచనున్నారు. అయితే ఈ కేసులో సిసోడియా అరెస్ట్ కు మిస్సింగ్ ఫైల్స్ కారణం అని తెలుస్తోంది. ఢిల్లీ ఎక్సైజ్ విభాగంలో సీజ్ చేసిన ఓ డిజిటల్ డివైస్ సిసోడియా పాత్రను బయటపెట్టినట్లు సీబీఐ వర్గాలు తెలిపాయి. ఢిల్లీ మద్యం కేసులో గతేడాది ఆగస్టు 19న సీబీఐ సోదాలు చేసింది. అయితే ఈ సమయంలో ఓ డిజిటల్ డివైస్ ని స్వాధీనం చేసుకున్నారు. దీన్ని పరిశీలించగా.. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ తో సంబంధం లేని ఓ కంప్యూటర్ లో లిక్కర్ పాలసీకి చెందిన ఓ డ్రాఫ్ట్ డాక్యుమెంట్ ఉన్నట్లు సీబీఐ వర్గాలు తెలిపాయి.
ఈ కంప్యూటర్ గురించి కూపీలాగగా.. ఇది సిసోడియా ఆఫీసులోని సిస్టమ్ గా తేలింది. జనవరి 14న సిసోడియా ఆఫీసు నుంచి కంప్యూటర్ ను స్వాధీనం చేసుకున్నారు. అయితే కంప్యూటర్ లో చాలా వరకు ఫైళ్లు డిలీట్ అయినట్లు సీబీఐ అధికారు గుర్తించారు. ఫోరెన్సిక్ సాయంతో ఆ ఫైళ్లను రీట్రీవ్ చేశారు అధికారు. ఇందులో ఓ ఫైల్ పరిశీలించగా.. లిక్కర్ పాలసీకి సంబంధించిన ఓ ఫైల్ వాట్సాప్ ద్వారా పంపినట్లు తేలింది. సిసోడియా మాజీ సెక్రటరీని సీబీఐ ప్రశ్నించి, అతడి వాంగ్మూలాన్ని రికార్డ్ చేశారు. 2021 మార్చిలో సిసోడియా తనను సీఎం అరవింద్ కేజ్రీవాల్ నివాసానికి పిలిచారని, అక్కడే మంత్రుల బృందం తయారు చేసిన డ్రాఫ్ట్ రిపోర్టు కాపీని తనకు ఇచ్చినట్లు, ఆ సమయంలో సత్యేంద్ర జైన్ కూడా అక్కడే ఉన్నట్లు అధికారి సీబీఐకి వెల్లడించినట్లు తెలుస్తోంది.
Also Read
- Rajasthan: ప్రియుడి ప్రైవేట్ పార్ట్ కోసేసిన ప్రియురాలు.. అద్భుతం చేసిన వైద్యులు..
- Bullet Train: బుల్లెట్ ట్రైన్ ఆలస్యానికి భారతే కారణం.. జపాన్ మాజీ మంత్రి ఆరోపణలు..
- Citizenship: భూమి పత్రాలు పౌరసత్వానికి ఆధారం కాదు: కలకత్తా హైకోర్టు..
- Sonam Wangchuk: సోనం వాంగ్చుక్ దీక్షలో నవ్వులు.. పువ్వులు.. ఏం జరిగిందంటే..!
Read Also: CM Bhagwant Mann: అజ్నాలా హింసాకాండ పాకిస్తాన్ పనే..
లిక్కర్ పాలసీని ఎవరు రూపొందించారు..? ఎవరు ఆమోదించారు..? ఎలాంటి చర్చ జరిగింది..? 12 శాతం ప్రాఫిట్ మార్జిన్ ఎలా వచ్చింది..? అనే కీలక ఫైళ్లు మిస్ అయినట్లు సీబీఐ వర్గాలు చెబుతున్నాయి. సిసోడియాను దీని గురించి ఎన్నిసార్లు అడిగినా.. సమాధానం దాటవేయడంతోనే అరెస్ట్ చేసినట్లు సీబీఐ వెల్లడించింది.
ఇదిలా ఉంటే డ్రాఫ్ట్ డాక్యుమెంట్ లో మార్పులకు సంబంధించిన ఆదేశాలు తనకు వాట్సాప్ ద్వారా అందాయని.. ఎక్సైజ్ విభాగంలో పనిచేసే ఓ అధికారి వెల్లడించారు. ఆ ఫోన్ నెంబర్ సిసోడియాదిగా మాజీ అధికారి వెల్లడించారు. 2022 ఆగస్టు నుంచి సెప్టెంబర్ మధ్య సిసోడియా 18 ఫోన్లు, 4 సిమ్ కార్డులను వాడినట్లు సీబీఐ దర్యాప్తులో తేలినట్లు సమాచారం. గతేడాది ఆగస్టు 19న సీబీఐ సిసోడియాపై కేసు నమోదు చేసింది. దీని మరుసటి రోజు ఆయన ఒకే నెంబర్ పై మూడు ఫోన్లను మార్చినట్లు సీబీఐ పేర్కొంది.
తాజావార్తలు
-
Rohit Replacement: రోహిత్ శర్మ స్థానాన్ని భర్తీ చేసేది ఎవరు..? పరిశీలనలో ఈ ఐదుగురు పేర్లు..
-
Cleaning Tips: మీ గ్యాస్ బర్నర్లు నల్లబడ్డాయా..? ఈ ఒక్క పని చేస్తే మిలమిల మెరిసిపోవాల్సిందే..
-
Telangana Cabinet: గ్రామ పంచాయతీలకు గుడ్న్యూస్.. తెలంగాణ క్యాబినెట్ కీలక నిర్ణయాలు..
-
Ration Cardholders: రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. ఈ నెల 31 వరకే అవకాశం..
-
Trump: ట్రంప్ టెలిప్రాంప్టర్ ఆపరేటర్కు భారీ షాక్.. ఎంత పని చేశాడంటే..!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?