MK Stalin: సింధులోయ నాగరికత, ప్రపంచంలోని అతి పురాతన నాగరికతల్లో ఒకటి. హరప్పా, మొహంజదారో వంటి ప్రణాళిక బద్ధమైన పట్టణాలకు కేంద్రంగా ఉంది. అయితే, ఇలాంటి నాగరికతకు చెందిన లిపిని ఇప్పటికీ అర్థం చేసుకోలేకపోతున్నారు. అయితే, సింధూ నాగరికత స్క్రిప్ట్ని విజయవంతంగా అర్థం చేసుకునే వారికి 1 మిలియన్ డాలర్లు(సుమారుగా రూ. 8.5 కోట్లు) నగదు బహుమతిని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ఆదివారం ప్రకటించారు.