Declining Rice Production: దేశంలో తగ్గనున్న వరి ఉత్పత్తి..
Declining Rice Production: దేశంలో ఈ ఏడాది వరి ఉత్పత్తి తగ్గవచ్చని తెలుస్తోంది. అయితే ఈ సారి దేశంలో 12 మిలియన్ టన్నుల మేర వరి ఉత్పత్తి తగ్గవచ్చని కేంద్ర ఆహార కార్యదర్శి సుధాన్షు పాండే వెల్లడించారు. కొన్ని రాష్ట్రాల్లో వర్షాలు తక్కవగా కురవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. అయితే దేశంలో ఇప్పటి వరకు వరి స్టాక్ మిగులు ఉందని వెల్లడించారు. నాలుగు రాష్ట్రాల్లో తక్కువ వర్షపాత వరి ఉత్పత్తిపై ప్రభావం చూపించనుందని ఆయన అన్నారు. అయితే రుతు పవనాల కారణంగా ఈ ఏడాది కొన్ని రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిశాయని.. ఆ రాష్ట్రాల్లో వరి దిగుబడి పెరుగుతుందని పాండే వెల్లడించారు. అయినా దేశంలో వరి నిల్వలు సర్ ప్లస్ లోనే ఉంటాయని తెలిపారు.
ఈ ఖరీఫ్ సీజన్ లో ఇప్పటి వరకు చాలా రాష్ట్రాల్లో తక్కువ వర్షపాతం నమోదు అయింది. దీంతో వరి సాగు విస్తీర్ణం 38 లక్షల హెక్టార్లు తగ్గిందని పాండే అన్నారు. ఖరీఫ్ సీజన్ లోనే భారతదేశంలో ఎక్కువ వరి ఉత్పత్తి అవుతుంది. 80 శాతం వరి ఉత్పత్తి ఒక్క ఖరీఫ్ సీజన్ నుంచే వస్తుంది. చాలా అధ్వాన్న పరిస్థితుల్లో బియ్యం ఉత్పత్తి నష్టం 10 మిలియన్ టన్నుల వరకు ఉండవచ్చని.. అయితే ఈ ఏడాది 12 మిలియన్ టన్నుల వరకు ఉండొచ్చనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్, బీహార్, ఉత్తర్ ప్రదేశ్, జార్ఖండ్ రాష్ట్రాల్లో వరినాట్లు 25 లక్షల హెకార్లు తక్కువగా పడ్డాయి.
Also Read
- Padma Awards 2027: దేశ అత్యున్నత పౌర పురస్కారాలు.. నేడే నామినేట్ చేసుకోండి.. పూర్తి వివరాలివే!
- Ajit Doval: యూఏఈలో అజిత్ దోవల్ పర్యటన.. దౌత్య సంబంధాలపై చర్చ
- Mamata Banerjee: మోడీ ‘ఝల్మురి’.. మమత ‘ఫ్రూట్స్’ కొనుగోలు.. ఫొటోలు వైరల్
- PM Modi: ఇదే నా చివరి బహిరంగ సభ.. తిరిగి ప్రమాణస్వీకారానికి వస్తా.. బెంగాల్లో మోడీ కీలక ప్రసంగం
Read Also: Bandi sanjay: అసోం సీఎంను మాట్లాడనీయకుండా మైక్ లాక్కోవడం హేయమైన చర్య
గత ఆరేళ్లుగా దేశంలో పంటల దిగుబడి చాలా బాగుంది. అయితే ప్రస్తుతం ఏర్పడిన వాతావరణ పరిస్థితులు ఈ ఏడాది ప్రభావం చూపించనున్నాయి. కోవిడ్ మహమ్మారి సమయంలో కూడా అన్ని రంగాలు కుంటుపడినా.. వ్యవసాయ రంగం ఆదుకుంది. ఇప్పటికే మే నెలలో ఉష్ణోగ్రతల కారణంగా గోధుమ పంటపై ప్రభావం చూపింది. గోధుమలను ఇతర దేశాలకు ఎగుమతి చేయాడాన్ని బ్యాన్ చేసింది ఇండియా. తాజాగా నూకల ఎగుమతులను కూడా నిషేధించింది.
తాజావార్తలు
-
Heatwave Alert : తెలంగాణ రికార్డ్ స్థాయి ఉష్ణోగ్రతలు.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్..!
-
Robbery: బిగ్ షాక్.. శ్రీ చైతన్య కాలేజీలో దొంగతనం..
-
Angkrish Raghuvanshi: కోపం ఖరీదు.. 20% మ్యాచ్ ఫీజు జరిమానా.!
-
Padma Awards 2027: దేశ అత్యున్నత పౌర పురస్కారాలు.. నేడే నామినేట్ చేసుకోండి.. పూర్తి వివరాలివే!
-
Ola Electric Share: ఒక్కప్పుడు రారాజు.. ఇప్పుడు బికారి! ఓలా ఎలక్ట్రిక్ రూ.157 నుంచి రూ.20 కి?
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!