Ahmedabad Plane Crash: టాటా గ్రూప్ కీలక నిర్ణయం.. బాధిత కుటుంబాల కోసం రూ.500 కోట్లతో ట్రస్ట్ ఏర్పాటు
- టాటా గ్రూప్ కీలక నిర్ణయం
- బాధిత కుటుంబాల కోసం రూ.500 కోట్లతో ట్రస్ట్ ఏర్పాటు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అహ్మదాబాద్ విమాన ప్రమాదం అనేక కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఇంకా ఆ ప్రమాదం నుంచి బాధిత కుటుంబాలు తేరుకోలేదు. ఆప్తుల్ని కోల్పోయి తీవ్ర దు:ఖంలో ఉన్నారు. అయితే ప్రమాదంలో చనిపోయిన మృతుల కుటుంబాలకు టాటా గ్రూప్నకు చెందిన ఎయిరిండియా సంస్థ రూ.కోటి సాయం ప్రకటించింది. అలాగే చికిత్స పొందుతున్న బాధితులకు వైద్య ఖర్చులు భరిస్తోంది.
ఇదిలా ఉంటే ఉంటే తాజాగా టాటా గ్రూప్ మరొక కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. బాధిత కుటుంబాల కోసం రూ.500 కోట్లతో ఒక ట్రస్ట్ ఏర్పాటు చేయాలని నిర్ణయానికి వచ్చింది. ఈ మేరకు ఆ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.
Also Read
ఇది కూడా చదవండి: Kannappa : కన్నప్పలో ఆ సీన్స్ కు అదిరిపోయే రెస్పాన్స్
మొదటి బోర్డు సమావేశంలో టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖర్ ఈ ప్రతిపాదన తీసుకొచ్చారు. పరిశీలన చేయాలని టాటా గ్రూప్నకు సూచించినట్లు సమాచారం. ట్రస్ట్ను రూ.500 కోట్లతో ఏర్పాటుకు గ్రీన్సిగ్నల్ ఇచ్చారు. దీన్ని టాటా గ్రూప్ ఆమోదించాలి. రెండు ప్రత్యేక ట్రస్టుల ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఒకటి భారతీయులకు.. ఇంకొకటి విదేశీ పౌరుల కోసం ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఈ ట్రస్ట్ నిధిని బాధిత కుటుంబాలకు పరిహారం, వైద్య సంరక్షణతో పాటు ప్రభావిత వైద్య పాఠశాలకు వినియోగించనున్నారు. ఈ కార్యక్రమానికి టాటా మోటార్స్ గ్రూప్ సీఎఫ్ఓ పీబీ బాలాజీ నాయకత్వం వహిస్తున్నారు. ఇక దర్యాప్తులో టాటా గ్రూప్ సహకరిస్తోందని తెలిపింది. కంపెనీ తన బాధ్యతల నుంచి వెనక్కి తగ్గదని ప్రతిజ్ఞ చేసింది.
ఇది కూడా చదవండి: Kerala Rains: కేరళను ముంచెత్తిన కుండపోత వర్షాలు.. బిల్డింగ్ కూలి ముగ్గురు మృతి
జూన్ 12న అహ్మదాబాద్ ఎయిర్పోర్టు నుంచి ఎయిరిండియా విమానం బయల్దేరింది. కొన్ని సెకన్లలోనే హాస్టల్పై కూలిపోయింది. విమానంలో ఒక్కరు మినహా 241 మంది ప్రయాణికులు చనిపోయారు. ఇక హాస్టల్లో ఉన్న 34 మంది మెడికోలు చనిపోయారు. ఇక విమాన ప్రమాదంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా చనిపోయారు. కుమార్తెను చూసేందుకు లండన్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
తాజావార్తలు
-
Srikanth Odela: నాలుగేళ్లు గేటు బయటే నుంచుంటే సుకుమార్ కంట పడ్డా!
-
Heavy Rain Alert: ఏపీకి భారీ వర్ష సూచన.. ఈ ప్రాంతంలో పిడుగులతో కూడిన వర్షం..
-
Srikanth Odela: చిరంజీవి సినిమా పక్కన పెట్టేసి 3 నెలల బ్రేక్.. శ్రీకాంత్ ఓదెల మైండ్లో ఏముంది?
-
Srikanth Odela:రోజుకో అప్డేట్ అంటే చిరాకు!
-
Srikanth Odela: షూటింగ్లో ప్లానింగ్ ఫెయిల్.. అందరినీ టార్చర్ పెట్టా: ‘ప్యారడైజ్’ ఆలస్యంపై దర్శకుడి షాకింగ్ కామెంట్స్!
ట్రెండింగ్
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!