Ahmedabad Plane Crash: టాటా గ్రూప్ కీలక నిర్ణయం.. బాధిత కుటుంబాల కోసం రూ.500 కోట్లతో ట్రస్ట్ ఏర్పాటు
- టాటా గ్రూప్ కీలక నిర్ణయం
- బాధిత కుటుంబాల కోసం రూ.500 కోట్లతో ట్రస్ట్ ఏర్పాటు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అహ్మదాబాద్ విమాన ప్రమాదం అనేక కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఇంకా ఆ ప్రమాదం నుంచి బాధిత కుటుంబాలు తేరుకోలేదు. ఆప్తుల్ని కోల్పోయి తీవ్ర దు:ఖంలో ఉన్నారు. అయితే ప్రమాదంలో చనిపోయిన మృతుల కుటుంబాలకు టాటా గ్రూప్నకు చెందిన ఎయిరిండియా సంస్థ రూ.కోటి సాయం ప్రకటించింది. అలాగే చికిత్స పొందుతున్న బాధితులకు వైద్య ఖర్చులు భరిస్తోంది.
ఇదిలా ఉంటే ఉంటే తాజాగా టాటా గ్రూప్ మరొక కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. బాధిత కుటుంబాల కోసం రూ.500 కోట్లతో ఒక ట్రస్ట్ ఏర్పాటు చేయాలని నిర్ణయానికి వచ్చింది. ఈ మేరకు ఆ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.
Also Read
- Haryana: ‘‘సువేందు బీఫ్ వండాను, తింటావా’’.. మహిళ ఓవరాక్షన్కు శిక్ష..
- G Parameshwara: పరమేశ్వరకు లక్కీ ఛాన్స్.. కొత్త ప్రభుత్వంలో కీలక పదవి!
- Maharashtra: ఆర్మీ ట్రైనింగ్ స్కూల్లో ఇంట్రెస్టింగ్ సీన్.. ప్రేయసికి ప్రపోజ్ చేసిన కెప్టెన్.. రియాక్షన్ ఇదే!
- Trinamool Congress: చీలిక దిశగా మమత పార్టీ.. 50 మంది ఎమ్మెల్యేలు గుడ్ బై..!
ఇది కూడా చదవండి: Kannappa : కన్నప్పలో ఆ సీన్స్ కు అదిరిపోయే రెస్పాన్స్
మొదటి బోర్డు సమావేశంలో టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖర్ ఈ ప్రతిపాదన తీసుకొచ్చారు. పరిశీలన చేయాలని టాటా గ్రూప్నకు సూచించినట్లు సమాచారం. ట్రస్ట్ను రూ.500 కోట్లతో ఏర్పాటుకు గ్రీన్సిగ్నల్ ఇచ్చారు. దీన్ని టాటా గ్రూప్ ఆమోదించాలి. రెండు ప్రత్యేక ట్రస్టుల ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఒకటి భారతీయులకు.. ఇంకొకటి విదేశీ పౌరుల కోసం ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఈ ట్రస్ట్ నిధిని బాధిత కుటుంబాలకు పరిహారం, వైద్య సంరక్షణతో పాటు ప్రభావిత వైద్య పాఠశాలకు వినియోగించనున్నారు. ఈ కార్యక్రమానికి టాటా మోటార్స్ గ్రూప్ సీఎఫ్ఓ పీబీ బాలాజీ నాయకత్వం వహిస్తున్నారు. ఇక దర్యాప్తులో టాటా గ్రూప్ సహకరిస్తోందని తెలిపింది. కంపెనీ తన బాధ్యతల నుంచి వెనక్కి తగ్గదని ప్రతిజ్ఞ చేసింది.
ఇది కూడా చదవండి: Kerala Rains: కేరళను ముంచెత్తిన కుండపోత వర్షాలు.. బిల్డింగ్ కూలి ముగ్గురు మృతి
జూన్ 12న అహ్మదాబాద్ ఎయిర్పోర్టు నుంచి ఎయిరిండియా విమానం బయల్దేరింది. కొన్ని సెకన్లలోనే హాస్టల్పై కూలిపోయింది. విమానంలో ఒక్కరు మినహా 241 మంది ప్రయాణికులు చనిపోయారు. ఇక హాస్టల్లో ఉన్న 34 మంది మెడికోలు చనిపోయారు. ఇక విమాన ప్రమాదంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా చనిపోయారు. కుమార్తెను చూసేందుకు లండన్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
తాజావార్తలు
-
NBK 111: ఈసారి రెగ్యులర్ మాస్ కాదు.. నెక్స్ట్ లెవెల్ ఇంటెన్స్ అవతారంలో ‘గాడ్ ఆఫ్ మాసెస్’!
-
Team India Spin Bowling Coach: 630 వికెట్ల వీరుడికి బీసీసీఐ గౌరవం.. స్పిన్ బౌలింగ్ కోచ్గా ఎంపిక
-
Haryana: ‘‘సువేందు బీఫ్ వండాను, తింటావా’’.. మహిళ ఓవరాక్షన్కు శిక్ష..
-
G Parameshwara: పరమేశ్వరకు లక్కీ ఛాన్స్.. కొత్త ప్రభుత్వంలో కీలక పదవి!
-
Rat Control Tips: ఎలుకలకు భయం పుట్టించే ఐదు వాసనలు ఇవే.. సింపుల్ చిట్కాలు ట్రై చేయండి
ట్రెండింగ్
-
Pest Control : చెదల బెడదకు చెక్.. ఇంట్లోనే ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!
-
రూ.1,799కే IP67 రేటింగ్ ఫీచర్ ఫోన్.. AI నాయిస్ క్యాన్సిలేషన్తో Itel Aqua లాంచ్.!