అహ్మదాబాద్ విమాన ప్రమాదం అనేక కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఇంకా ఆ ప్రమాదం నుంచి బాధిత కుటుంబాలు తేరుకోలేదు. ఆప్తుల్ని కోల్పోయి తీవ్ర దు:ఖంలో ఉన్నారు. అయితే ప్రమాదంలో చనిపోయిన మృతుల కుటుంబాలకు టాటా గ్రూప్నకు చెందిన ఎయిరిండియా సంస్థ రూ.కోటి సాయం ప్రకటించింది. అలాగే చికిత్స పొందుతున్న బాధితులకు వైద్య ఖర్చులు భరిస్తోంది.