Ladakh: ‘‘సీఆర్పీఎఫ్ సిబ్బందిని తగలబెట్టే యత్నం’’.. లడఖ్లో హింస, లేహ్లో కర్ఫ్యూ..
- రాష్ట్ర హోదాను డిమాండ్ చేస్తూ లడఖ్లో హింస..
- బీజేపీ కార్యాలయం, వాహనాలకు నిప్పు..
- లేహ్లో కర్ఫ్యూ విధించిన లెఫ్టినెంట్ గవర్నర్..
- హింసకు పాల్పడిన వారిపై చర్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ladakh: లడఖ్కు రాష్ట్రహోదా డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున ఆందోళనలు చోటు చేసుకున్నాయి. ఈ ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో నలుగురు మరణించారు. 70 మందికి పైగా గాయపడ్డారు. కేంద్రపాలిత ప్రాంతంలో కేంద్ర పాలనకు వ్యతిరేకంగా లడఖ్కు రాష్ట్ర హోదా డిమాండ్ చేస్తూ నిరసనలు చెలరేగాయి. ఈ నేపథ్యంలో లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ కవిందర్ గుప్తా బుధవారం కేంద్ర భూభాగంలోని లేహ్ జిల్లా అంతటా కర్ఫ్యూ విధించినట్లు తెలిపారు.
Read Also: Cancer: ప్రమాదకరమైన రోగం.. కనిపించే ప్రథమ లక్షణం.. గుర్తించకపోతే ఇక అంతే సంగతులు!
Also Read
- EV Market: ఎలక్ట్రిక్ వాహనాల జోరు..12 రెట్లు పెరిగిన EV మార్కెట్..
- Karnataka: కర్ణాటకలో దారుణం.. డాక్టర్ భర్తను చంపిన భార్య.. కుమారుడిపై కూడా కత్తితో దాడి
- Work From Home: ప్రభుత్వ ఉద్యోగులకు WFH.. 40 లక్షల లీటర్ల పెట్రోల్ సేవ్..
- Puri: పూరీ జగన్నాథ రథయాత్రలో తొక్కిసలాట.. ఒకరి మృతి.. 120 మందికి గాయాలు
ఈ ఘర్షణల్ని లెఫ్టినెంట్ గవర్నర్ కుట్రగా అభివర్ణించారు. హింసలో పాల్గొన్న అందరిపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. నిరసన తెలుపుతున్న గుంపు హఠాత్తుగా హింసకు పాల్పడ్డారు. లడఖ్లోని పోలీస్ వాహనాలను కాల్చారు, బీజేపీ ప్రధాన కార్యాలయంపై దాడి చేసిన తర్వాత ఆందోళనకారులపైకి భద్రతా బలగాలు కాల్పులు జరిపాయి. లడఖ్లో నలుగురు మరణాలకు కారణమైన, నిరసనల్ని ప్రేరేపించిన వారిపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు. గుంపు వాహనం లోపల సీఆర్పీఎఫ్ వాహణంలో సిబ్బందిని తగలబెట్టే ప్రయత్నం చేశారు.
అయితే, తమపైనే భద్రతా బలగాలు బలప్రయోగం చేశాయని స్థానిక నాయకులు ఆరోపిస్తున్నారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. ఆందోళనకారుల దాడిలో అనేక మంది పోలీసులకు గాయాలు అయ్యాయి. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా లేహ్లో కర్ఫ్యూ విధించారు. గత కొన్నాళ్ల నుంచి లడఖ్ ప్రాంతంలో కొందరు నాయకులు రాష్ట్ర హోదాను డిమాండ్ చేస్తున్నారు. ఆర్టికల్ 370 రద్దు, జమ్మూ కాశ్మీర్ విభజన తర్వాత 2019లో లడఖ్ కేంద్ర పాలిత ప్రాంతంగా ఏర్పాటైంది.
తాజావార్తలు
-
EV Market: ఎలక్ట్రిక్ వాహనాల జోరు..12 రెట్లు పెరిగిన EV మార్కెట్..
-
Uttam Kumar Reddy : కమిషన్ల కక్కుర్తి వల్లే కాళేశ్వరం కూలిపోయింది
-
Karnataka: కర్ణాటకలో దారుణం.. డాక్టర్ భర్తను చంపిన భార్య.. కుమారుడిపై కూడా కత్తితో దాడి
-
Posani Krishna Murali: ‘లవ్ యూ రాజా’ డైలాగ్ వెనుక అసలు కథ ఇదే.. అసలు విషయం చెప్పిన పోసాని
-
Work From Home: ప్రభుత్వ ఉద్యోగులకు WFH.. 40 లక్షల లీటర్ల పెట్రోల్ సేవ్..
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!