Haryana: కన్వరియాలు ఘాతుకం.. కక్షతో జవాన్ కాల్చివేత.. 4రోజుల క్రితమే భార్య ప్రసవం
- హర్యానాలో దారుణం
- జవాన్ను కాల్చి చంపిన దుండుగులు
- 4రోజుల క్రితమే భార్య ప్రసవం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హర్యానాలో దారుణం జరిగింది. ఓ సీఆర్పీఎఫ్ జవాన్ను అత్యంత దారుణంగా దుండగులు కాల్చి చంపేశారు. సోనేపట్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: Trump: లండన్ మేయర్ దుష్టుడు.. బ్రిటన్ ప్రధాని పక్కన ఉండగానే ట్రంప్ ఘాటు వ్యాఖ్యలు
Also Read
- Swine Flu H1N1 in India: H1N1 కొత్త వేరియంట్ వచ్చిందా? కరోనా లాంటి ముప్పు ఉందా? ICMR కీలక సమాచారం
- Kangana Ranaut: ‘వాళ్లంతా పనికిమాలిన వాళ్లు’.. తాప్సీ, బాబా రామ్దేవ్పై కంగనా ఘాటు వ్యాఖ్యలు
- CJP: ఢిల్లీలో సెప్టెంబర్ 5న భారీ నిరసన మార్చ్.. మరోసారి ఆందోళనకు సిద్ధమైన విద్యార్థులు
- Tamil Nadu: తీవ్ర దుమారం రేపుతోన్న పొట్టి దుస్తుల వ్యవహారం.. మంత్రి కీర్తన ఘాటు స్పందన
సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) జవాన్ కృష్ణ కుమార్(30)కు ఇటీవల కన్వారియాలతో మత సంబంధమైన ఘర్షణ జరిగింది. అయితే దీన్ని మనసులో పెట్టుకున్న ముగ్గురు దుండగులు జవాన్ ఇంటికి వచ్చారు. బయటకు పిలిచి అతి సమీపంలోంచి కాల్చివేసేశారు. దీంతో కుటుంబ సభ్యులు హుటాహుటినా ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే చనిపోయినట్లు ప్రకటించారు.
ఇది కూడా చదవండి: Karnataka: ఓ అక్క మరణశాసనం.. వ్యాధి బయటకు తెలియకూడదని తమ్ముడు హత్య
కృష్ణ కుమార్ ఇటీవలే ఛత్తీస్గఢ్ నుంచి తన స్వస్థలానికి తిరిగి వచ్చాడు. జూలై 25న ఖాన్పూర్ కలాన్లోని భగత్ ఫూల్ సింగ్ మెడికల్ కాలేజ్ ఫర్ ఉమెన్లో భార్య కుమారుడికి జన్మనిచ్చింది. భార్యను, బిడ్డను చూసేందుకు హర్యానా వచ్చాడు. అయితే ఆదివారం-సోమవారం అర్ధరాత్రి సమయంలో దమ్కాన్ గ్రామంలోని కృష్ణకుమార్ ఇంటికి ముగ్గురు వ్యక్తులు వచ్చారు. బయటకు రావాలని పిలిచారు. వెంటనే అతనిపై కాల్పులకు తెగబడ్డారు. వెంటనే ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే చనిపోయినట్లు వైద్యులు వెల్లడించినట్లు సోనెపట్ పోలీసు ప్రతినిధి రవీందర్ సింగ్ తెలిపారు.
ఇది కూడా చదవండి: Nimisha Priya: కేరళ నర్సు నిమిషా ప్రియ ఉరిశిక్ష రద్దులో ట్విస్ట్..
ఇటీవల కన్వారియాలతో జరిగిన ఘర్షణ కారణంగానే ఈ హత్య జరిగి ఉంటుందని పోలీసులు తెలిపారు. నిందితులంతా సొంత గ్రామస్థులేనని.. అంతేకాకుండా వారంతా కన్వారియాలేనని పోలీసులు పేర్కొన్నారు. నిందితులు నిషాంత్, ఆనంద్, అజయ్లుగా గుర్తించారు. హరిద్వార్ తీర్థయాత్ర చేస్తున్న సమయంలో జవాన్ కృష్ణకుమార్కు నిందితుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. దాన్ని మనసులో పెట్టుకుని నిందితులు ఈ ఘాతుకానికి పాల్పడినట్లుగా వెల్లడించారు. హత్య కేసు కింద కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నట్లు చెప్పారు.
తాజావార్తలు
-
NIA Raids : ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్.. రామగుండంలో NIA మెరుపు దాడులు
-
Off The Record: ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలకు కేటీఆర్ వార్నింగ్..?
-
AP Liquor Scam Case: కారుమూరి అరెస్ట్పై ఈడీ కీలక ప్రకటన
-
Chairmans Desk : కాంగ్రెస్లో పాతకథ పునరావృతమౌతోందా.. రేవంత్ తక్షణ కర్తవ్యమేంటి..?
-
OTR: ప్రభాకర్ చౌదరి ఆరోపణలకు స్పందించని ఎమ్మెల్యే దగ్గుబాటి.. కారణం ఇదేనా..?
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్ఫోన్ కొనేముందు ఈ వాటర్ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!